CTR: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో శనివారం భక్తులు పోటెత్తారు. రెండో శనివారం సెలవు కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు వరసిద్ధుడి దర్శనార్థం కాణిపాకం విచ్చేశారు. క్యూలైన్లు పూర్తిగా నిండిపోయి.. భక్తులు ఆలయం వెలుపలకు వచ్చారు. స్వామి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది. ఈఓ పెంచల కిషోర్, ఛైర్మన్ మణి నాయుడు పర్యవేక్షించారు.
E.G: బిక్కవోలు మండల పరిషత్ కార్యాలయంలో MPDO శ్రీనివాస్ అధ్యక్షతన జలధార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బిక్కవోలు MPP సుమ పాల్గొని, మాట్లాడారు. జలవనరుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. చెరువులు, నీటి వనరులను పరిరక్షించాలని ఎన్డీఏ కన్వీనర్ శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో గొర్రెల త్రిమూర్తులు, చిట్టిబాబు చౌదరి పాల్గొన్నారు.
KDP: ముద్దనూరు టౌన్లో ఇంటి తాళం పగలగొట్టి నగదు, బంగారం దొంగతనం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. హేబ్రోన్ చర్చి వీధికి చెందిన నాగలచ్చమ్మ తన తల్లి చికిత్స కోసం బయటకు వెళ్లగా, ఈ ఘటన జరిగింది. సుమారు రూ.20 వేల నగదు, 3 గ్రాముల బంగారం అపహరించబడినట్లు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.
KRNL: పెద్దకడబూరు మండలం చిన్నతుంబళం గ్రామంలోని రాయల చెరువు సమస్యలను పరిష్కరించాలని నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత అవగాహన కార్యక్రమంలో జేఈ సంజీవ్ కుమార్ను టీడీపీ సీనియర్ నేత వీరేష్ గౌడ్, సాగునీటి సంఘం అధ్యక్షులు నారాయణ శనివారం డిమాండ్ చేశారు. చెరువు గట్టుపై ముళ్ల కంపలు పెరిగి పోయాయని, దీంతో గట్టు బలహీనపడే ప్రమాదం ఉందని జేఈ దృష్టికి తీసుకెళ్లారు.
NDL: డోన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో మైకేల్ స్విమ్మింగ్ పూల్, గేమింగ్ జోన్ను శనివారం ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం యువ నాయకుడు కోట్ల రాఘవేంద్ర రెడ్డి జన్మదిన వేడుకల్లో కేక్ కటింగ్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
NLR: యుద్ధం కారణంగా వైజాగ్లో చిక్కుకుని ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఇద్దరు ఇరాన్ మహిళలకు ఏపీ వర్ఫ్ బోర్డు రూ. 1.50 లక్షల ఆర్థిక సాయం అందించింది. బోర్డు ఛైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారికి ధైర్యం చెప్పి, నిధులను అందజేశారు. కష్టకాలంలో ఉన్న విదేశీయులకు కూటమి అండగా ఉంటుందని.. సీఎం చంద్రబాబు సహకారంతోనే నిధులు అందించామన్నారు.
శ్రీకాకుళం ఇందిరా విజ్ఞాన్ భవన్లో అఖిలభారత 90వ కిసాన్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి మాట్లాడుతూ.. రైతు కార్పొరేటు వ్యవస్థ ప్రస్తుత ప్రభుత్వాల చేతుల మధ్య నలిగిపోతూ వ్యవసాయాన్ని చేస్తున్న రైతులను ఆత్మహత్యల స్థితికి తీసుకెళ్తున్నారన్నారు.
KRNL: పెద్దకడబూరు మండలం హనుమాపురం సమీపంలో 167 జాతీయ రహదారిలో ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించారు. SML డిగ్రీ కళాశాల ముందు, హనుమాపురం గ్రామ సమీపంలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమలో ఏఎస్ఐ శివరాములు, టీడీపీ నేత బీపీ ఈరన్న పాల్గొన్నారు.
ATP: జిల్లాస్థాయి అండర్-19 చెస్ క్రీడాకారుల ఎంపిక పోటీలు ఆదివారం స్థానిక కోవూరు నగర్లోని విద్యారణ్య పాఠశాలలో నిర్వహించనున్నట్లు చెస్ అసోసియేషన్ నాగరాజు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు 18,19 తేదీలలో అన్నవరంలో జరిగే రాష్ట్ర స్థాయి ఛాంపియన్ షిప్ పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. అర్హత గల క్రీడాకారులు ఆధార్ కార్డు, క్రీడా సామాగ్రితో హాజరు కావాలన్నారు.
BPT: పంగులూరు మండల పరిధిలోని రామకూరులో ఇవాళ రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభకు విశేష స్పందన లభించింది. భూ రికార్డుల ప్రక్షాళన, క్షేత్రస్థాయిలో పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం ఆదేశించిన ‘రెవెన్యూ సదస్సు’లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఉదయం నుంచే రైతులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను అధికారులు చెప్పారు.
KDP: ఖాజీపేట అగ్రహారానికి చెందిన విద్యార్థిని కీర్తన మృతదేహానికి శనివారం రిమ్స్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మధ్యాహ్నానికి పోస్టుమార్టం పూర్తి కావడంతో వైద్యులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు ఆర్తనాదాలు చేస్తూ కన్నీరుమున్నీరయ్యారు. రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణం అంతా విషాద వాతావరణంతో నిండిపోయింది.
KRNL: ఆదోని శివారులో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సిప్రా అక్కడికక్కడే మృతి చెందింది. ఎస్సై వివరాల మేరకు.. బెంగళూరు నగరానికి చెందిన ప్రదీప్, అర్పిత, షర్మిల, సిప్రా రాయచూరులో జరిగే వివాహానికి బయలుదేరారు. ఆదోని శివారులో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టారు. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 3 తీవ్రంగా గాయపడ్డారు.
ELR: నూజివీడు మండలం యనమదల గ్రామంలో శనివారం మంత్రికి కోలుసు పార్థసారథి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో రూ.80 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రహదారి నిర్మాణంతో గ్రామ ప్రజలకు మెరుగైన రాకపోక సౌకర్యాలు అందుతాయన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్గేట్ వద్ద శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన లారీ ట్యాంకర్ ఓ కారుపై పడిన ఘటన కలకలం రేపింది. ప్రమాద సమయంలో కారులో ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే వారి పరిస్థితిపై ఇంకా స్పష్టమైన వివరాలు తెలియరాలేదు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.