KDP: ముద్దనూరు టౌన్లో ఇంటి తాళం పగలగొట్టి నగదు, బంగారం దొంగతనం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. హేబ్రోన్ చర్చి వీధికి చెందిన నాగలచ్చమ్మ తన తల్లి చికిత్స కోసం బయటకు వెళ్లగా, ఈ ఘటన జరిగింది. సుమారు రూ.20 వేల నగదు, 3 గ్రాముల బంగారం అపహరించబడినట్లు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.