SKLM: వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్ర చారిత్రాత్మకమైనదని వైసీపీ టెక్కలి నియోజకవర్గ ఇంఛార్జ్ పేరాడ తిలక్ అన్నారు. ఈరోజుతో 23 సంవత్సరాలు గడచిన సందర్భంగా టెక్కలిలో కేకు కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహానేత ఆశయాలకు అనుగుణంగా యువనేత జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు.
అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లి మండలం కోనంపేట గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎలుగోటి రామకృష్ణ (55) తన ఇంటిలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పనిచేసిన ఆయన, ఇటీవల ఉద్యోగం మానేసి వ్యవసాయ పనులు చేస్తున్నట్లు సమాచారం. మధ్యాహ్నం సమయంలో భార్య గమనించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
PPM: పదవ తరగతి మూల్యాంకన ప్రక్రియలో ఎలాంటి తప్పులకు తావులేకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను, ఉపాధ్యాయులను ఆదేశించారు. ప్రతి మార్కు విద్యార్థి భవిష్యత్తుకు కీలకమని, కోడింగ్-డీకోడింగ్ ప్రక్రియలో ఎక్కడా నిబంధనల ఉల్లంఘన జరగకూడదని స్పష్టం చేశారు. ఈ మేరకు పార్వతీపురంలో నిర్వహిస్తున్న మూల్యాంకన ప్రక్రియను సందర్శించారు.
కర్నూలు: న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే అమలుపరచాలని కర్నూలు న్యాయవాదుల సంఘం డిమాండ్ చేశారు. గురువారం పీలేరు బార్లో అడ్వకేట్ విధులు నిర్వహిస్తున్న పూజారి ఎల్లయ్య అనే న్యాయవాదిని కొందరు గుర్తుతెలియని దుండగులు హత్యకు నిరసనగా న్యాయవాదుల సంఘం కోర్టు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. న్యాయవాదిని దారుణంగా హత్య చేసిన దుండగులను గుర్తించి వెంటనే శిక్షించాలన్నారు.
CTR: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అన్ని స్థానాలలోనూ విజయం సాధించాలని ఏపీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం సూచించారు. కుప్పం మండలం మోట్లచేను పంచాయతీ టీడీపీ సమన్వయ సమావేశం గురువారం ఆయన నిర్వహించారు. విజయం కోసం ప్రతి కార్యకర్త ఇప్పటి నుంచే కష్టపడాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు.
ELR: ద్వారకతిరుమల శ్రీవారి దర్శనం నకిలీ టికెట్ల వ్యవహారంలో గురువారం ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. దేవస్థానం అకౌంట్స్ విభాగంలో కంప్యూటర్ సూపర్వైజర్గా పనిచేస్తున్న వ్యక్తి ఇతరుల సహాయంతో నకిలీ సాఫ్ట్వేర్ రూపొందించి టికెట్లను తయారుచేసి కౌంటర్లో విక్రయించారన్నారు. దేవస్థానం అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసామన్నారు.
KDP: ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె సుందరయ్య కాలనీలో కనీస వసతులు కల్పించాలని కోరుతూ కాలనీవాసులు గురువారం పంచాయతీ కార్యదర్శి నరసింహులుకు వినతిపత్రం అందజేశారు. భూపోరాటం ద్వారా నివాసాలు ఏర్పాటు చేసుకున్న ఈ ప్రాంతంలో రోడ్లు, డ్రైన్లు, తాగునీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ASR: చిన్నారుల ఎదుగుదలకు పోషకారం, సరైన సంరక్షణ, ప్రేమతో కూడిన వాతావరణం కల్పించాలని కలెక్టర్ టీ.నిశాంతి అధికారులను ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 8వ పోషణ పక్షోత్సవం గోడ పత్రికను గురువారం ఆమె ఆవిష్కరించారు. ఈనెల 23వరకు పోషణ పక్షోత్సవం పక్కాగా నిర్వహించాలన్నారు. మాతా శిశు పోషణ, ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కార్యక్రమం అమలు చేయాలన్నారు.
AKP: భూములు స్వాధీనానికి వ్యతిరేకంగా రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలో దళిత రైతులు చేపట్టిన నిరసన దీక్షలు గురువారం 65వ రోజుకు చేరుకున్నాయి. సీపీఎం నాయకులు దేవుడు నాయుడు, సోమనాయుడు, శివాజీ నిరసన దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు. రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా బలవంతంగా భూములను తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను ఆపాలన్నారు.
కోనసీమ: కూటమి ప్రభుత్వం చేపట్టిన రీ-సర్వే కార్యక్రమంలో భాగంగా ఐ.పోలవరం మండలం పశువులంక గ్రామంలో రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సుమారు 249 మంది లబ్ధిదారులకు పాసుపుస్తకాలు అందజేశారు. కూటమి ప్రభుత్వం రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని ఆయన తెలిపారు.
NLR: కందుకూరులోని కోటారెడ్డి నర్సింగ్ హోమ్లో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు NTR వైద్య సేవలను ప్రారంభించారు. మూడు తరాలుగా నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్న కోటారెడ్డి కుటుంబాన్ని ఆయన అభినందించారు. పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సీఎం సహాయనిధి ద్వారా ఇప్పటికే 1200 మందికి రూ. 10 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
ATP: జిల్లాలో మహిళల రక్షణ కోసం పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన ‘స్త్రీరక్ష’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 11,054 ఇళ్లల్లో పోలీసులు సర్వే పూర్తి చేశారు. కుటుంబ కలహాలు, గృహ హింస వంటి 100 సమస్యలను గుర్తించి పరిష్కారానికి ఎస్పీ ఆదేశాలు ఇచ్చారు. పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేసే సౌకర్యం కల్పించారు.
AKP: పాయకరావుపేట ఎంపీడీవోగా లవరాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ ఎంపీడీవో గా పనిచేసిన విజయలక్ష్మికి అల్లూరు జిల్లా అరకు బదిలీ అయింది. అక్కడ ఎంపీడీవోగా పనిచేస్తున్న లవరాజును ఇక్కడకు బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు.
SKLM: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గురువారం రణస్థలంలోని రెడ్డీస్ ల్యాబ్ను సందర్శించారు. ఈ సందర్భంగా ల్యాబ్లో ఉన్న బాయిలర్స్ను ఆయన పరిశీలించారు. అనంతరం కార్మికులతో కలిసి భోజనం చేశారు. ఈ మేరకు కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఈశ్వరరావు, RDO కె. సాయి ప్రత్యూష, తదితరులు పాల్గొన్నారు.