• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

స్వీయ గణన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ELR: చింతలపూడిలో గురువారం స్వీయ గణన కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సొంగ రోషన్ కుమార్ ప్రారంభించారు. ఈనెల 30 వరకు స్వీయ గణనకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని ఖచ్చితమైన సమాచారాన్ని మాత్రమే ఇందులో నమోదు చేయాలని ఆయన పేర్కొన్నారు. మే ఒకటి నుంచి 30 వరకు క్షేత్రస్థాయిలో సర్వే జరుగుతుందని ఎమ్మెల్యే వివరించారు.

April 16, 2026 / 01:10 PM IST

సత్యసాయి తాగునీటి కార్మికులు ధర్నా

ATP: గుత్తి తహసిల్దార్ కార్యాలయం ఎదుట గురువారం సత్యసాయి తాగునీటి కార్మికులు ధర్నా చేపట్టారు. తాగునీటి కార్మికులు శ్రీనివాసులు మాట్లాడుతూ.. తాగునీటి కార్మికులకు బకాయి పడ్డ ఐదు నెలల వేతనాలను చెల్లించాలని, ఆరోగ్య భద్రత కల్పించాలని, సమాన పనికి సమానమైన వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసిల్దార్ పుణ్యవతికి అందజేశారు.

April 16, 2026 / 01:07 PM IST

పోలేరమ్మ గుడి వద్ద స్థలం కబ్జాకు యత్నం

ATP: గుత్తి మండలం కొత్తపేట గ్రామంలోని పోలేరమ్మ గుడి వద్ద గల స్థలాన్ని గురువారం కొందరు భూకబ్జాదారులు జెసీబీతో స్థలాన్ని క్లీనింగ్ పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు క్లీనింగ్ పనులను అడ్డుకున్నారు. ఈ స్థలం కొత్తపేట గ్రామపంచాయతీకి సంబంధించిందని గ్రామస్తులు తెలిపారు. అధికారులు స్పందించి మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు

April 16, 2026 / 12:57 PM IST

స్వదేశానికి నాగలక్ష్మి.. అధికారుల చొరవ

కోనసీమ: ఉప్పలగుప్తం మండలం విలసవిల్లికి చెందిన నాగలక్ష్మి ఖతార్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న కేసీఎం అధికారులు ఆమెను క్షేమంగా స్వగ్రామానికి చేర్చారు. ఫిబ్రవరి నెలలో ఏజెంట్ ద్వారా వెళ్ళిన ఆమెను అక్కడ తోటి పనిమనిషి వేధించినట్లు నాగలక్ష్మి ఆరోపించింది. దీంతో అధికారులు ఏజెంట్‌తో మాట్లాడి ఆమెను గురువారం స్వదేశానికి రప్పించారు.

April 16, 2026 / 12:50 PM IST

గ్యాస్ డెలివరీ మోసం.. పోలీసులకు ఫిర్యాదు

కోనసీమ: ఆత్రేయపురం గ్రామంలోని బుల్లిపేటకు చెందిన ఉందుర్తి మనోహరం 25 రోజుల క్రితం గ్యాస్ బుక్ చేసుకోగా, సిలిండర్ డెలివరీ కాకుండానే వారం క్రితం డెలివరీ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీనితో స్థానిక గ్యాస్ ఏజెన్సీని సంప్రదించినా సరైన సమాధానం లేకుండా తిప్పుకోవడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు గ్యాస్ బండను ఇప్పించాలంటూ కోరారు. 

April 16, 2026 / 12:40 PM IST

పరిగిలో టీడీపీ మాజీ సర్పంచ్ మృతి

సత్యసాయి: పరిగి మండలం కోడిగెనహళ్లి గ్రామానికి చెందిన టీడీపీ మాజీ సర్పంచ్, సీనియర్ నాయకుడు చిన్న బీరప్ప అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ మండల కన్వీనర్ గోవింద్ రెడ్డి, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి హనుమయ్య, తదితరులు వారి గ్రామానికి వెళ్లి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

April 16, 2026 / 12:30 PM IST

స్వయంగా అన్ లైన్లో స్వీయ గణనను చేసిన కలెక్టర్

PPM: జిల్లాలో జనగణన-2027లో భాగంగా స్వీయ గణన నమోదు కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ప్రభాకర రెడ్డి స్వయంగా తన ఇంటి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ నెల 30 లోపు అందరూ సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ పూర్తి చేయాలని సూచించారు. మొబైల్‌ ఫోన్‌ ద్వారా కుటుంబ వివరాలను నమోదు చేయవచ్చని తెలిపారు.

April 16, 2026 / 12:29 PM IST

సింహాచలం గంధం అమావాస్యకు భారీ ఏర్పాట్లు

విశాఖ: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి దేవస్థానంలో చైత్ర బహుళ అమావాస్య (గంధం అమావాస్య) సందర్భంగా శనివారం భారీగా భక్తులు తరలివచ్చే అవకాశముందని ఈఓ జల్లేపల్లి వెంకటరావు తెలిపారు. గురువారం సాయంత్రం నుంచే భక్తులు కొండదిగువ వరాహ పుష్కరిణి వద్ద, కొండపై జాగారం చేసి, అమావాస్య రోజు స్నానమాచరించి స్వామివారి దర్శనం చేసుకునే ఆనవాయితీ కొనసాగుతుందన్నారు.

April 16, 2026 / 12:24 PM IST

తిరుపతిలో 18న జాబ్ మేళా

TPT: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయం మోడల్ కెరీర్ సెంటర్‌లో 18వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యాలయ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. 9 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లమా, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. దాదాపు 800 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలియజేశారు.

April 16, 2026 / 12:22 PM IST

‘రైతులు భూముల రీ సర్వేకు సహకరించాలి’

శ్రీకాకుళం: రైతులు భూముల సర్వేకు సహకరించాలని కోసమాల పీఎసీఎస్ అధ్యక్షుడు సలాన మోహన్రావు కోరారు. గురువారం మెలియాపుట్టి మండలంలో వసుంధర గ్రామములో ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్టుపై రైతులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. భూముల రీ సర్వే అయిన తర్వాత రాజముద్రలతో రైతులకు పాసుపుస్తకాలు అందించడం జరుగుతుందన్నారు. సరిహద్దుల సమస్యలు ఉంటే తెలియజేయాలి అన్నారు.

April 16, 2026 / 12:19 PM IST

మహిళా బిల్లుకు మద్దతుగా ఢిల్లీలో జిల్లా ఎమ్మెల్యేలు

ATP: మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ అధినియం) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న చారిత్రక ఘట్టానికి సాక్షులుగా నిలిచేందుకు ఎమ్మెల్యే పరిటాల సునీత ఢిల్లీ వెళ్లారు. ఇతర మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి ఆమె దేశ రాజధానికి చేరుకున్నారు. గురువారం ఉదయం ఎంపీ లావు కృష్ణదేవరాయలు నివాసంలో ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు ఆమె హాజరయ్యారు.

April 16, 2026 / 12:16 PM IST

అభ్యంతరకర వ్యాఖ్యలు.. ఇద్దరిపై కేసు నమోదు

W.G: అంబేడ్కర్ జయంతి ర్యాలీ వీడియోలపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొగల్తూరు ఎస్సై జి.వాసు వివరాల ప్రకారం.. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలపై నిందితులు అనుచితంగా స్పందించారు. దీనిపై సీతారామపురం సౌత్ గ్రామానికి చెందిన పిల్లి యశ్వంత్ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

April 16, 2026 / 12:15 PM IST

పాత బస్టాండ్ వద్ద హెల్మెట్‌పై అవగాహన

బాపట్ల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద పోలీసులు హెల్మెట్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం తగ్గుతుందని తెలిపారు. ట్రాఫిక్ నియమాలను పాటించాలని వాహనదారులకు సూచించారు.

April 16, 2026 / 12:14 PM IST

‘రీ సర్వే ద్వారా రెవెన్యూ సమస్యలు పరిష్కారం’

SKLM: ఎచ్చెర్ల మండలం షేర్ మహమ్మద్ పురంలో గురువారం రీ సర్వే గ్రామసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మార్వో గోపాలరావు మాట్లాడుతూ.. రీ సర్వే ద్వారా రెవెన్యూ సమస్యలు పరిష్కరించబడతాయని తెలిపారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ మండల అధ్యక్షులు చౌదరి బాబ్జి, డీసీఎంఎస్ ఛైర్మన్ చౌదరి అవినాష్, తదితరులు పాల్గొన్నారు.

April 16, 2026 / 12:10 PM IST

వంకాయలపాడులో ‘బడిబాట’ ర్యాలీ

PLD: ఎడ్లపాడు మండలం వంకాయలపాడులో గురువారం ‘బడిబాట’ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జడ్పీ ఉన్నత పాఠశాలల ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామంలో పర్యటిస్తూ విద్యా ప్రాముఖ్యతను వివరించారు. బడి ఈడు పిల్లలందరినీ తప్పకుండా బడిలో చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.

April 16, 2026 / 12:08 PM IST