• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మర్రిపూడిలో పెయ్యదూడల 56వ ప్రదర్శన సభలో

ప్రకాశం: గ్రామీణ సంపద పెంపుదలకు పెయ్యదూడల ఉత్పత్తి పథకం ఎంతో మేలని ప్రకాశం జిల్లా పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ మురళీకృష్ణ పేర్కొన్నారు. మర్రిపూడిలో డాక్టర్ మని శేఖర్ ఆధ్వర్యంలో జరిగిన 56వ ప్రదర్శన సభలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం దూడల కోసం ప్రత్యేక టీకాను కేవలం రూ. 150కే అందిస్తోందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

April 16, 2026 / 04:22 PM IST

PAC సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

KRNL: వెలగపూడి అసెంబ్లీ భవనంలో ఇవాళ జరిగిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. రోడ్లు, భవనాల శాఖ ఆడిట్ అంశాలు, టెండర్ డిస్కౌంట్ మాఫీ వల్ల పెరిగిన వ్యయంపై చర్చించారు. ప్రజాధనాన్ని పారదర్శకంగా వినియోగించాలని ఆయన అధికారులకు సూచించారు.

April 16, 2026 / 04:20 PM IST

‘గిరిజన సమస్యలు పరిష్కరించాలి’

ASR: గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నూతన కలెక్టర్, ఐటీడీఏ పీవోలను కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గిరిజనేతరులు 1/70 చట్టాన్ని ఉల్లంఘిస్తూ అక్రమ కట్టడాలు చేపడుతున్నారని ఆరోపించారు. గిరిజన హక్కుల రక్షణ కోసం 1/70 చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని కోరారు.

April 16, 2026 / 04:14 PM IST

జాతర మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

SKLM: రణస్థలం మండలం గరికపాలెం గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్యే కిరణ్ కుమార్ గురువారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు.

April 16, 2026 / 04:13 PM IST

విశాఖలో కార్డాన్ సెర్చ్

విశాఖ నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు కార్డాన్ సెర్చ్ ఆపరేషన్ గురువారం నిర్వహించారు. త్రీ టౌన్, పెందుర్తి స్టేషన్ల పరిధిలోని ఇళ్లను, వాహనాలను నిశితంగా తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా సరైన ధృవపత్రాలు లేని 23 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ చర్యలు నేరాల నియంత్రణకు దోహదపడతాయని పోలీసులు తెలిపారు.

April 16, 2026 / 04:11 PM IST

విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు

PPM: సీతానగరం మండలం జోగింపేట అంబేద్కర్ గురుకులంలో పిల్లలకు గురువారం ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా MLHP నవీన్ జ్వరం, జలుబు, దగ్గు, స్కిన్ ఎలర్జీ, హీమోగ్లోబిన్ వంటి పరీక్షలు చేశారు. అనంతరం అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. అలాగే, పిల్లలకు పౌష్టిక ఆహారం, నిద్ర, వ్యక్తిగత, మరుగుదొడ్ల పరిశుభ్రత, హ్యాండ్ వాషింగ్‌పై అవగాహన కల్పించారు.

April 16, 2026 / 04:11 PM IST

‘జన గణన భవిష్యత్ ప్రణాళికలకు పునాది’

VZM: జనగణన భవిష్యత్ ప్రణాళికలకు పునాది అని కలెక్టర్ రాం ప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం గంట్యాడ ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతున్న జనగణన శిక్షణను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డేటా సేకరణలో ఖచ్చితత్వం అవసరమని ప్రతి ఇంటి సమాచారం పూర్తిస్థాయిలో నమోదు చేయాలని సూచించారు. అలాగే, సెల్ఫ్ ఎన్యుమరేషన్ వినియోగంపై దిశా నిర్దేశం చేశారు.

April 16, 2026 / 04:11 PM IST

కందుకూరు పట్టణంలో ఎమ్మెల్యే క్షేత్రస్థాయి పర్యటన

NLR: కందుకూరు పట్టణంలోని 13వ వార్డు బండపాలెం, రామ్ నగర్, ఆనందపురం రోడ్డు ప్రాంతాల్లో ఎమ్మెల్యే నాగేశ్వరరావు గురువారం పర్యటించారు. మున్సిపల్ కమిషనర్ అనూష, పార్టీ నేతలతో కలిసి ఆయన రోడ్లు, కాలువలను పరిశీలించారు. కాలువల్లో మురుగునీరు నిల్వ ఉండడం, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆక్రమణలు, పూడిక వంటి సమస్యలను గమనించి, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

April 16, 2026 / 04:10 PM IST

‘నవీన సమాజానికి బాటలు వేసిన సంఘసంస్కర్త కందుకూరి’

E.G: కందుకూరి వీరేశలింగం పంతులు 178వ జయంతి వేడుకల్లో తూ.గో జిల్లా వాణిజ్య విభాగం ప్రెసిడెంట్ నల్లమిల్లి సుబ్బారావు హాజరయ్యారు. గురువారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. నవీన సమాజానికి బాటలు వేసిన సంఘసంస్కర్త, రచయిత కందుకూరి వీరేశలింగం అని కొనియాడారు. ఈ వేడుకల్లో కోడూరి శాంతారామ్, మాజీ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రెటరీ బూరగడ్డ పాల్గొన్నారు.

April 16, 2026 / 04:10 PM IST

‘విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించాలి’

AKP: విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు నిరంతరం శ్రమించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ సూచించారు. గురువారం కలెక్టరేట్లో ఇంటర్ ఫలితాలపై సమీక్ష నిర్వహించారు. ఫెయిల్ అయిన సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. తక్కువ ఉత్తీర్ణత నమోదైన కళాశాలల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు.

April 16, 2026 / 04:10 PM IST

మహిళల భద్రతపై అవగాహన

CTR: చిత్తూరులో మహిళల భద్రత, బాలికల రక్షణే ధ్యేయంగా శక్తి టీం ఆధ్వర్యంలో భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 500 మంది పాల్గొన్న ఈ సదస్సులో సోషల్ మీడియా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర సమయాల్లో శక్తి యాప్ ఎలా ప్రాణరక్షణగా నిలుస్తుందో ప్రత్యక్షంగా వివరించారు. మహిళలు తమ రక్షణ కోసం టెక్నాలజీని, పోలీసు వ్యవస్థను ధైర్యంగా వినియోగించుకోవాలన్నారు.

April 16, 2026 / 04:06 PM IST

శిలాఫలకాలపై ఎమ్మెల్యే కీలక నిర్ణయం

కృష్ణా: ప్రతి కార్యక్రమానికి శిలాఫలకాలు వేసే సంప్రదాయానికి స్వస్థి పలకాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో అధికారులకు సూచించారు. శంకుస్థాపనలను భూమి పూజ ద్వారాను, ప్రారంభోత్సవాలను రిబ్బన్ కటింగులతో ముగించాలని అధికారులకు సూచించారు. తాము ప్రజల సమస్యల పరిష్కారానికి పనిచేస్తున్నాము గానీ శిలాఫలకాలపై పేర్ల కోసం కాదని చెప్పుకొచ్చారు.

April 16, 2026 / 04:03 PM IST

శ్రీశైల అన్నదాన ప్రసాదానికి విరాళం అందజేత

NDL: ప్రకాశం జిల్లాకు చెందిన రావి నాగమణి, కుటుంబ సభ్యులు ఇవాళ శ్రీశైలంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద పథకానికి రూ.లక్ష విరాళం చెల్లించారు. ఈ మేరకు వారు స్థానిక అన్న ప్రసాదం విభాగం కార్యాలయానికి చేరుకుని సహాయ కార్యనిర్వహణాధికారి సతీశ్ మల్లిక్‌ను కలిసి విరాళం అందజేశారు. విరాళం చెల్లించిన దాతకు రసీదు, ప్రసాదాలు అందించి, శేష వస్త్రాలతో సన్మానించారు.

April 16, 2026 / 04:01 PM IST

ఎర్ర చెరువుకు నీటి విడుదల

KDP: రానున్న వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా మైదుకూరులోని ఎర్ర చెరువుకు అధికారులు నీటిని విడుదల చేశారు. గతంలో వేసవి కాలంలో నీటి కోసం ప్రజలు ట్యాంకర్ల వద్ద వేచి చూడాల్సి వచ్చేదన్నారు. అయితే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లలో పలుమార్లు నీటిని సరఫరా చేయడంతో, మున్సిపాలిటీలో ప్రస్తుతం నీటి కొరత లేదని అధికారులు తెలిపారు.

April 16, 2026 / 04:01 PM IST

పూడి శ్రీహరి అరెస్ట్‌ను ఖండించిన మాజీ ఎమ్మెల్యే

KRNL: వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ మీడియా వ్యవహారాలు చూస్తున్న పూడి శ్రీహరి అరెస్ట్‌ను మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఖండించారు. పత్తికొండలో ఇవాళ ఆమె మాట్లాడుతూ.. ఈ అరెస్ట్ కూటమి ప్రభుత్వ దుర్మార్గపు విధానాలకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ప్రజలకు ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తున్నారని, వెంటనే పూడి శ్రీహరిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

April 16, 2026 / 04:00 PM IST