ELR: చింతలపూడిలో మంగళవారం అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఈ కార్యక్రమానికి హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేవలం రాజ్యాంగ రచయితగా మాత్రమే కాకుండా, విద్యాభ్యాసంలోను, దళితుల సంక్షేమం కోసం పాటుపడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ATP: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ నాయకులు, దళిత సోదరులతో కలిసి కేక్ కట్ చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని ఎమ్మెల్యే కొనియాడారు.
E.G: ఉండ్రాజవరం మండలం పసలపూడి గ్రామంలో 135వ బి.ఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్ సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ ఎం.రామకృష్ణ పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. రాజ్యాంగం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల వారికి సమన్యాయం చేశారని వారు కొనియాడారు.
BPT: భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చీరాల ముక్కోణపు సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, చీరాల ఎమ్మెల్యే మద్దలూరు మాలకొండయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ.. ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.
NLR: అంబేద్కర్ జయంతి సందర్భంగా కంపసముద్రానికి చెందిన తెలుగు ఉపాధ్యాయుడు శివశంకర్ అంబేద్కర్ ఫొటోను దారంతో తయారు చేశారు. ఆయన ఆకులపై పలు చిత్రాలను, తాళపత్ర గ్రంథాలను రచించే కళతో పాటు దారంతో చిత్రాలు తయారు చేసే ఏకైక కళాకారుడు కూడా కావడం విశేషం. అంబేడ్కర్ జయంతి సందర్భంగా వారి చిత్రాన్ని గీసి అబ్బురపరిచారు.
SKLM: నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి పోలాకి మండలం పోలాకి గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ అయ్యప్పస్వామి జన్మదినం సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ మేరకు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందజేశారు. నియోజకవర్గం ప్రజలకు స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఎమ్మెల్యే ప్రార్థించారు.
KRNL: అంబేడ్కర్ ఆశయాలను అనుసరిస్తూ సామాజిక న్యాయం సాధనలో ముందుకు సాగాలని ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి అన్నారు. ఇవాళ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆలూరులోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలతో ఘన నివాళులర్పించారు. దేవుడు జన్మనిస్తే.. అంబేడ్కర్ జీవించే హక్కును కల్పించారని స్పష్టం చేశారు. అంబేడ్కర్ ఆశయాలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.
GNTR: తెనాలిలోని చెంచుపేట కేంద్రంగా సాగుతున్న న్యూడ్ వీడియో కాల్స్ దందా కలకలం రేపుతోంది. ఓ యాప్ వేదికగా నగదు చెల్లించిన వారికి మహిళలతో నగ్నంగా వీడియో కాల్స్ చేయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ వ్యవహారంలో చెంచుపేటకు చెందిన ఇద్దరు మహిళలను పోలీసులు రహస్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ అశ్లీల దందా వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.
KDP: మెగా డీఎస్సీ 2025లో స్పోర్ట్స్ కోట ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు ఈ నెల 15న తిరుపతిలో సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శంషుద్దీన్ మంగళవారం తెలిపారు. కొత్తగా నియామకమైన ఉపాధ్యాయులు ఉదయం 9 గంటలకు డీఎన్జీవో/డీఎస్ఏ కార్యాలయం, తిరుపతిలో తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. విద్యా శాఖ మంత్రి ప్రత్యేక సందేశం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
VSP: అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆరిలోవలో అంబేద్కర్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. మాజీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ రాజ్యాంగ శిల్పిగా బడుగు బలహీన వర్గాలకు మార్గదర్శకుడని, యువత ఆయన ఆలోచనలు అనుసరించాలని పేర్కొన్నారు.
సత్యసాయి: కదిరి రూరల్ మండలం ఎగువపల్లి హరిజనవాడకు చెందిన వై.హరి ప్రమాదవశాత్తు మరణించడంపై ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ విచారం వ్యక్తం చేశారు. కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మృతుడి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిరుపేద కుటుంబానికి జరిగిన ఈ నష్టం తీరనిదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
E.G: భారత రాజ్యాంగ రూపకర్త బీ.ఆర్ అంబేద్కర్ 136వ జయంతి సందర్భంగా కడియం మండలం వేమగిరిలో ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి కందుల దుర్గేష్ ఇవాళ పూలమాల వేసి నివాళులుర్పించారు. సమానత్వం, సామాజిక న్యాయం, విద్యా ప్రాధాన్యత వంటి విలువలను సమాజానికి అందించిన అంబేద్కర్ ఆలోచనలు తరతరాలకు స్ఫూర్తిదాయకం అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు.
NDL: ఆళ్లగడ్డ రూరల్ సీఐ బీవీ రమణ, ఎస్సై వరప్రసాద్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాతగా దేశానికి అంబేద్కర్ చేసిన సేవలు అనన్య సామాన్యమని కొనియాడారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన సాగించిన పోరాటం ప్రతి ఒక్కరికి ఆదర్శమని పేర్కొన్నారు. విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని నమ్మిన మహానీయుడని తెలిపారు.
కోనసీమ: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మొక్కజొన్న రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ కామన ప్రభాకరరావు ఆరోపించారు. సోమవారం మండపేటలో అయన మాట్లాడుతూ.. ప్రభుత్వం క్వింటాలుకు రూ.2400 మద్దతు ధర ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం మార్కెట్లో కేవలం రూ.1700 మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నమయ్య: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 2026–27 సంవత్సరానికి క్రీడా అకాడమీలలో ప్రవేశాలకు అర్హులైన క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడాధికారి చంద్రశేఖర్ తెలిపారు. వాలీబాల్, కబడ్డీ, అథ్లెటిక్స్ వంటి క్రీడల్లో ఏప్రిల్ 26 నుంచి ఎంపికలు ప్రారంభం కానున్నాయి. 15 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు అర్హులని ఆయన పేర్కొన్నారు.