NTR: చందర్లపాడు మండలం ముప్పాళ్ల గురుకుల పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పాఠశాల పరిసరాలు, తరగతులను పరిశీలించి విద్యార్థినుల ప్రతిభను పరీక్షించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థినులను సన్మానించారు. క్యాంటీన్లో భోజనం పరిశీలించి విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. సంకల్పబలం ఉంటే ఏదైనా సాధ్యమని సూచించారు.
VZM: జామి మండలంలోని ఎంకె. వలస గ్రామంలో శనివారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామంలో రూ. 74 లక్షలతో నిర్మించే సీసీ రహదారులు, డ్రైన్ల పనులకు ప్రారంభోత్సవం చేశారు. మండలంలో 12 గ్రామాలకు ఎన్ఆర్జీఎస్ ద్వారా రు. 23 కోట్ల నిధులు విడుదలయ్యాయని మంత్రి కర...
VSP: ప్రకృతి కార్యాశాలల ద్వారా విజ్ఞానం పెంపొందించుకోవాలని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. సెయింట్ ఆన్స్ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో 400 మంది ఎన్సీసీ విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని విత్తనాల బంతులు తయారీ, మొక్కలు నాటడం, పశుపక్ష్యాదులకు నీరు అందించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు.
PPM: లోక్ సభలో NDA ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడం మోడీ వ్యతిరేక విధానాలకు చెంప పెట్టని పార్వతీపురం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బత్తిని మోహన్ తెలిపారు. రాహుల్ గాంధీనాయకత్వంలో విపక్షాలు బిల్లుని తిప్పి కొట్టడంతో మోడీ సర్కార్ కంగుతిన్నదని తెలిపారు. బీజేపీకి తగిన గుణపాఠం జరిగిందన్నారు.
ASR: పాడేరు మండలం సేరుబయలు గ్రామంలో శనివారం మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరితో కలిసి ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ పర్యటించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా ప్రధాన చెరువుకు జల హారతి ఇచ్చి, పూడికతీత పనులకు శంకుస్థాపన చేశారు. చెరువు చుట్టుపక్కల ప్రాంతంలో చెత్తాచెదారం వేరుచేసి చెరువు పరిసరాలను పరిశుభ్రంగా తయారు చేశారు. గ్రామస్తులతో కలిసి గ్రామంలో మొక్కలు నాటారు.
SKLM: టెక్కలి మండలం పరశురాంపురం గ్రామంలో పోషణ పక్వాడా కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీవో సవర సరస్వతి పాల్గొని, 0-6 సంవత్సరాల లోపు పిల్లలు మేధాభివృద్ధి 90% జరుగుతుందన్నారు. కనుక ప్యాకెట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ లాంటివి అస్సలు పెట్టకూడదు వాటికి బదులుగా పోషక విలువలతో కూడిన ఆహారాన్ని పిల్లలకు పెట్టాలని సూచించారు.
W.G: వరి సాగులో రైతులు యూరియా వాడకాన్ని తగ్గించాలని సహాయ వ్యవసాయ సంచాలకులు కే.శ్రీనివాసరావు సూచించారు. శనివారం మోగల్లు రైతు సేవా కేంద్రంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. అధిక ఎరువుల వినియోగంతో భూసారం దెబ్బతింటుందని హెచ్చరించారు. వేసవిలో సేకరించే మట్టి నమూనాల ఫలితాల ఆధారంగానే ఎరువులు వేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏవో సంధ్య, రైతులు పాల్గొన్నారు.
CTR: మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు మామిడి రైతుల పాలిట శాపంగా మారాయి. హార్ముజ్ జలసంధి దిగ్బంధం కారణంగా జిల్లా నుంచి విదేశాలకు వెళ్లాల్సిన మామిడి ఎగుమతులు నిలిచిపోయాయి. ఫిబ్రవరి నుంచే ప్రారంభం కావాల్సిన ఎగుమతులు యుద్ధం వల్ల నౌకలు సముద్రంలోనే నిలిచిపోవడంతో ఆగిపోయాయి. ఎగుమతులు జరగకపోతే కాయలను చెట్లకే వదిలేయాల్సిన దుస్థితి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
VSP: మహిళా బిల్లు ఆమోదం పొందకపోవడం కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధి లేని రాజకీయ డ్రామా అని భారత సమాజ్ డెవలప్ పార్టీ అధ్యక్షుడు చింతాడ సూర్యం విమర్శించారు. డీలిమిటేషన్ పేరుతో బిల్లును ఆలస్యం చేసి మహిళలను మోసం చేశారని ఆరోపించారు. పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ ప్రభుత్వం సమన్వయం చేయలేకపోయిందన్నారు.
VZM: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హార్టివిజన్ కార్యక్రమం ద్వారా ఎనిమిదివేల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అందుకు గాను అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వీసీ ద్వారా మండలాల్లో ఉన్న ఉద్యాన, వ్యవసాయ, విద్యుత్, రెవిన్యూ శాఖాధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
KRNL: రామదుర్గంలో బాల్య వివాహాల నిర్మూలన లక్ష్యంగా ఐసీడీఎస్ సీడీపీవో నరసమ్మ, సూపర్వైజర్ వీరమ్మ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శనివారం కళాకారుల పాటలు, నాటికల రూపంలో బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలను ప్రజలకు వివరించారు. చిన్న వయసులో వివాహాలు బాలికల ఆరోగ్యం, విద్యావకాశాలు, జీవిత భవిష్యత్తు ఎలా దెబ్బతీస్తాయో చాటి చెప్పారు.
ప్రకాశం: ఒంగోలులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ కింద రూ.1.20 కోట్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్ను అత్యంత వేగంగా పరిష్కరించింది. ప్రమాదంలో మరణించిన ఏపీ సచివాలయ ఉద్యోగి పొదిలి భార్గవనాథ్ కుటుంబానికి జిల్లా కలెక్టర్ రాజాబాబు శనివారం ఈ చెక్కును అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ ఇలాంటి ఇన్సూరెన్స్ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
NTR: జి.కొండూరుకు చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అంకెమ్ ఇందిరా ప్రియదర్శిని, పలువురు నాయకులతో కలిసి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైనందుకు ఆయనకు అభినందనలు తెలిపారు. మీ నాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉందని, మైలవరం నియోజకవర్గంలో పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగిందని కొనియాడారు.
PLD: ముప్పాళ్ల మండలం పలుదేవర్లపాడు గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ప్రత్యేక అధికారి కేవీ శివప్రసాద్ పాల్గొన్నారు. గ్రామ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని తెలిపారు. జల్ జీవన్ మిషన్ ద్వారా తాగునీరు, కాలువల మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరారు. కార్యక్రమంలో అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
KDP: సిద్ధవటం మండలం భాకరాపేటలోని మూడు రోడ్ల కూడలి వద్ద గల గంగమ్మ తల్లి జాతర రేపు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. అమ్మవారికి మహిళలు వేకువజామునే బోనాలు సమర్పిస్తారని వారు తెలిపారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం గంగమ్మ తల్లి అని వెల్లడించారు. అమ్మవారి జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.