PPM: జిల్లాలో జనగణన-2027లో భాగంగా స్వీయ గణన నమోదు కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రభాకర రెడ్డి స్వయంగా తన ఇంటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ నెల 30 లోపు అందరూ సెల్ఫ్ ఎన్యుమరేషన్ పూర్తి చేయాలని సూచించారు. మొబైల్ ఫోన్ ద్వారా కుటుంబ వివరాలను నమోదు చేయవచ్చని తెలిపారు.
TPT: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయం మోడల్ కెరీర్ సెంటర్లో 18వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యాలయ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. 9 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లమా, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. దాదాపు 800 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలియజేశారు.
ATP: మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ అధినియం) పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న చారిత్రక ఘట్టానికి సాక్షులుగా నిలిచేందుకు ఎమ్మెల్యే పరిటాల సునీత ఢిల్లీ వెళ్లారు. ఇతర మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి ఆమె దేశ రాజధానికి చేరుకున్నారు. గురువారం ఉదయం ఎంపీ లావు కృష్ణదేవరాయలు నివాసంలో ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు ఆమె హాజరయ్యారు.
బాపట్ల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద పోలీసులు హెల్మెట్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం తగ్గుతుందని తెలిపారు. ట్రాఫిక్ నియమాలను పాటించాలని వాహనదారులకు సూచించారు.
SKLM: ఎచ్చెర్ల మండలం షేర్ మహమ్మద్ పురంలో గురువారం రీ సర్వే గ్రామసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మార్వో గోపాలరావు మాట్లాడుతూ.. రీ సర్వే ద్వారా రెవెన్యూ సమస్యలు పరిష్కరించబడతాయని తెలిపారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ మండల అధ్యక్షులు చౌదరి బాబ్జి, డీసీఎంఎస్ ఛైర్మన్ చౌదరి అవినాష్, తదితరులు పాల్గొన్నారు.
PLD: ఎడ్లపాడు మండలం వంకాయలపాడులో గురువారం ‘బడిబాట’ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జడ్పీ ఉన్నత పాఠశాలల ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామంలో పర్యటిస్తూ విద్యా ప్రాముఖ్యతను వివరించారు. బడి ఈడు పిల్లలందరినీ తప్పకుండా బడిలో చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
ప్రకాశం: గిద్దలూరు వైసీపీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కేపి నాగార్జున రెడ్డిని రాచర్ల నాయకులు గురువారం మార్కాపురంలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 19న జరగనున్న శ్రీ గంగమ్మ తల్లి పోతురాజు దేవస్థానం తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ఆ కార్యక్రమానికి రావాలని ఆహ్వాన పత్రికను అందించారు. ఆయన సానుకూలంగా స్పందించినట్లు గ్రామ నాయకులు వెల్లడించారు.
CTR: మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైసీపీ మద్దతు ఇస్తుందని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో గురువారం ఆయన మాట్లాడుతూ.. డీలిమిటేషన్ పై స్పష్టత రావాల్సి ఉందని ఆయన వెల్లడించారు. దీనిని పరిశీలించాల్సి ఉందని.. రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాత్రం వ్యతిరేకిస్తామని వెల్లడించారు.
SKLM: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందడంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. క్షతగాత్రులకు తక్షణం మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ASR: వరరామచంద్రపురం మండలం శబరి బ్రిడ్జ్ సమీపంలోని కమ్మరివాడ వద్ద గురువారం ఉదయం శబరి నది ఒడ్డున ఓ మృతదేహం కనిపించడం కలకలం రేపింది. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదని ఎస్సై సాధిక్ తెలిపారు.
అనకాపల్లి: నర్సీపట్నం ఫైర్ ఆఫీస్ వద్ద గురువారం నూతన అగ్నిమాపక వాహన సకటాన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సీపట్నంలో మరో నూతన అగ్నిమాపక వాహనం రావడం సంతోషంగా ఉందన్నారు. 9 మండలాల ప్రజలకు విశిష్ట సేవలు అందుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్ అప్పలస్వామి, ఫైర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ATP: ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఖాళీగా ఉన్న స్టాళ్లు, దుకాణాల కేటాయింపునకు APSRTC బహిరంగ టెండర్లు ఆహ్వానిస్తోంది. నిరుద్యోగులు, వ్యాపారులు సొంతంగా వ్యాపారం ప్రారంభించేందుకు ఇది మంచి అవకాశం. టీ స్టాళ్లు, జనరల్ స్టోర్స్, బుక్ స్టాల్స్ వంటి వాటికి ఇక్కడ ప్రాధాన్యం ఉంటుంది. ఆసక్తి గలవారు ధర్మవరం డిపో మేనేజర్ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.
కోనసీమ: ఆలమూరు మండలంలో నున్న పెదపళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా ఎం.సుదీప్తి గురువారం నియమితులయ్యారు. పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ విభాగంలో సూపర్ స్పెషాలిటీ డిగ్రీ ఆమె ఇటీవల పూర్తి చేసుకున్నారు. వైద్యుల నియామకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సుదీప్తిని స్థానిక వైద్యాధికారిగా నియమించింది. దీంతో ఆస్పత్రికి ఇద్దరు వైద్యుల భర్తీ జరిగినట్లయ్యింది.
నెల్లూరు జిల్లా నవాబుపేటలో ఏఎస్పీ దీక్ష ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి, పలువురికి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. అ సాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని ఆమె హెచ్చరించారు.
KDP: నగరంలో తాగునీటి సరఫరా సక్రమంగా కొనసాగేందుకు గురువారం నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ రామన్నపల్లి, వాటర్ గంటి పంపింగ్ హౌస్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పంపింగ్ కేంద్రాల్లో నిర్వహణ పనులు, యంత్రాల పనితీరును కమిషనర్ సమీక్షించారు.