VZM: అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ పార్లమెంటు ఉభయసభలలో బిల్లు ఆమోదం పొందడంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు హర్దాతిరేకాలు వ్యక్తం చేశారు.ఈ మేరకు శనివారం రాత్రి గజపతినగరంలోని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నివాసం వద్ద కొవ్వొత్తులతో దీపాలు వెలిగించి ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన టీడీపి నాయకులు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.
అన్నమయ్య: గాలివీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులకు హాజరు కాకుండా గైర్హాజరు అయిన డాక్టర్ రఫీని డీఎంహెచ్ సస్పెండ్ చేశారు. ఇటీవల కలెక్టర్ నిశాంత్ తనిఖీలో ఆయన ఆస్పత్రిలో లేకపోవడం, అటెండెన్స్లో సంతకం చేసి వెళ్లిపోవడం గుర్తించారు. ఈ నేపథ్యంలో విచారణ అనంతరం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయగా, విధుల్లో నిర్లక్ష్యం చూపిన ఉద్యోగి మనోజ్కు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.
ప్రకాశం: కనిగిరి వైసీపీ ఇంచార్జి దద్దాల నారాయణ యాదవ్ పార్టీ శ్రేణులకు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సీఎస్ పురంలో జరిగిన సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొని, ఐక్యతతో క్షేత్రస్థాయిలో చురుకుగా ఉండాలని సూచించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలని అన్నారు.
NDL: ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కొలిమిగుండ్ల సీఐ రమేశ్ బాబు ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఆన్లైన్, ఆఫ్-లైన్ బెట్టింగ్లపై నిఘా ఉంచామని తెలిపారు. బెట్టింగ్ వలలో చిక్కుకుని లక్షలాది రూపాయలు అప్పులు చేసి, ఎంతో మంది యువత ప్రాణాలు కోల్పోయిన ఘటనలను గుర్తుచేశారు. నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.
GNTR: జిల్లా సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన బడ్జెట్ అవుట్రీచ్ ఈవెంట్-2026-27లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి నియోజకవర్గానికి అవసరాల మేరకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తామని తెలిపారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
VSP: గాజువాకలో ఇటీవలే నేవీ ఉద్యోగి రవీంద్ర చేతిలో దారుణహత్యకు గురైన మౌనిక హత్య కేసును జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయాలని శనివారం పెద్దఎత్తున మహిళ సంఘాలు, దళిత ప్రజాసంఘాలు నిరసన చేపట్టారు. దోషులను కఠినంగా శిక్షించాలంటే జ్యుడీషియల్ ఎంక్వైరీ జరిపి, మౌనికకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
KRNL: టీడీపీ మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి శనివారం మంత్రి నారా లోకేశ్ను కలిశారు. కర్ణాటక రాష్ట్రం సిందనూరు తాలూకాలో సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవం, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కాంస్య విగ్ర ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను రాఘవేంద్ర రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
ATP. రాష్ట్ర రాజధాని అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత లభించడంపై ఎమ్మెల్యే బండారు శ్రావణి హర్షం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ కూటమి నేతలతో కలిసి ఆమె దీపాలు వెలిగించి వేడుకలు జరిపారు. ఇది ప్రజా ప్రభుత్వం సాధించిన విజయం అని కొనియాడారు. రాజధానిపై వైసీపీ నేతలు విషం కక్కడం మానాలని హితవు పలికారు.
ప్రకాశం: దోర్నాల మండలం జమ్మి దోర్నాల క్రాస్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందాడు. మృతుడిది దోర్నాల మండలం చిన్న గుడిపాడు గ్రామానికి చెందిన ఒంటేరు ఆవులయ్యగా గుర్తించారు. మృతుడు మతిస్థిమితంలేక తిరుగుతుంటాడని సమాచారం. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
NLR: మనుబోలు కండలేరు వద్ద కొంతకాలంగా తిరుగుతున్న 8 అడుగుల కొండచిలువను శనివారం రాత్రి గ్రామస్థులు కొట్టి చంపారు. ఈ కొండచిలువ తరచూ రోడ్డుపైకి వచ్చి వాహనదారులను భయాందోళనకు గురిచేస్తోందని స్థానికులు తెలిపారు. కండలేరు ప్రాంతంలో కొండచిలువ రావడం వల్ల భయాందోళనకు గురయ్యామని, అందుకే కర్రలతో కొట్టి చంపాల్సి వచ్చిందని గ్రామస్థులు పేర్కొన్నారు.
E.G: తుని మండలం తలుపులమ్మ లోవ దేవస్థానంలో అమ్మ వారి వార్షిక జాతర మహోత్సవాలు ఏప్రిల్ 5 నుంచి 17 వరకు జరుగుతాయని ఈవో విశ్వనాథరాజు తెలిపారు. ఆదివారం లోవ కొత్తూరు నుంచి గరగలను తీసుకువచ్చి పుట్టుదార వద్ద శుద్ధి, పూజలు చేయనున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు
E.G: బిక్కవోలు మండలం మెళ్లూరు గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారిగా ఎంపీడీవో శ్రీనివాస్ శనివారం బాధ్యతలు చేపట్టారు. పాలకమండలి పదవీకాలం ముగియడంతో ఆయనను నియమించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు చినబాబులు, శ్రీనివాస్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగుదలకు, తాగునీటి సరఫరాకు ప్రత్యేక చర్యలు తీసుకుంటానని ఎంపీడీవో పేర్కొన్నారు
VZM: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడంపై రాజం MLA కొండ్రు మురళీమోహన్ హర్షం వెలిబుచ్చారు.ఈ సందర్భంగా తన నివాసంలో సతీసమేతంగా దీపాలు వెలిగించి ఆనందం వ్యక్తం చేసారు.అయన మాట్లాడుతూ ఇది రైతుల త్యాగాలతో సాధించుకున్న ప్రజా విజయమని, ఐదు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరిందని అన్నారు.CM చంద్రబాబు అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దుతారన్నారు.
PPM: జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కార వేదిక హాలులో ఆదివారం భారత మాజీ ఉపప్రధాని డా.బాబూ జర్టీవన్ రామ్ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. దీనిపై శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, పట్డణ మెయిన్ రోడ్డులోని బాబు జర్టీవన్ రామ్ విగ్రహానికి అధికారులు, ప్రజాప్రతినిధులు నివాళులర్పిస్తారని తెలుపారు.
AKP: ఎలమంచిలి పట్టణం జలాల వీధిలో కొండపల్లి రంగయ్యమ్మ అనే వృద్దురాలిపై శనివారం కోతులు దాడి చేశాయి. ఈ దాడిలో ఆమె చేతికి గాయం అయింది. గత కొంతకాలంగా ఎలమంచిలి పట్టణంలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. కోతులతో పుర ప్రజలు పలు అవస్థలు పడుతున్నారు. నేరుగా ఇళ్లల్లోకి చొరబడి వస్తువులను చిందరవందర చేస్తూ పాడు చేస్తున్నాయి.