E.G: బిక్కవోలు మండలం మెళ్లూరు గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారిగా ఎంపీడీవో శ్రీనివాస్ శనివారం బాధ్యతలు చేపట్టారు. పాలకమండలి పదవీకాలం ముగియడంతో ఆయనను నియమించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు చినబాబులు, శ్రీనివాస్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగుదలకు, తాగునీటి సరఫరాకు ప్రత్యేక చర్యలు తీసుకుంటానని ఎంపీడీవో పేర్కొన్నారు