ప్రకాశం: కనిగిరి వైసీపీ ఇంచార్జి దద్దాల నారాయణ యాదవ్ పార్టీ శ్రేణులకు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సీఎస్ పురంలో జరిగిన సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొని, ఐక్యతతో క్షేత్రస్థాయిలో చురుకుగా ఉండాలని సూచించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలని అన్నారు.