NLR: మనుబోలు కండలేరు వద్ద కొంతకాలంగా తిరుగుతున్న 8 అడుగుల కొండచిలువను శనివారం రాత్రి గ్రామస్థులు కొట్టి చంపారు. ఈ కొండచిలువ తరచూ రోడ్డుపైకి వచ్చి వాహనదారులను భయాందోళనకు గురిచేస్తోందని స్థానికులు తెలిపారు. కండలేరు ప్రాంతంలో కొండచిలువ రావడం వల్ల భయాందోళనకు గురయ్యామని, అందుకే కర్రలతో కొట్టి చంపాల్సి వచ్చిందని గ్రామస్థులు పేర్కొన్నారు.