KDP: గత రాత్రి గాలివాన కారణంగా బ్రహ్మంసాగర్ సమీపంలో విద్యుత్ లైన్లు తెగిపోవడం, నందిపల్లె వద్ద వాటర్ పైప్లైన్ దెబ్బతినడంతో తాగునీటి సరఫరా అంతరాయం కలిగింది. మరమ్మతులు పూర్తి చేసినప్పటికీ పూర్తిస్థాయిలో నీటి సరఫరా అందుబాటులోకి రావడానికి మరో అర్ధ రోజు సమయం పడుతుందని బద్వేల్ మున్సిపల్ అధికారులు తెలిపారు.