• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

భూ ఆక్రమణలపై సీపీఎం నేతలు ఆందోళన

CTR: తిరుపతి రూరల్ మండలం గాంధీపురంలో భూ ఆక్రమణలపై సీపీఎం నేతలు ఆందోళన చేపట్టారు. సర్వే నంబర్ 13లో 32 కుటుంబాలకు చెందిన భూమిని రామసుబ్బారెడ్డి ఆక్రమించి కాంపౌండ్ నిర్మిస్తున్నాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈనెల 13న హతిరాంజీ మఠం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాలని పిలుపునిచ్చారు. భూమిని రక్షించి బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

April 10, 2026 / 07:12 PM IST

హెలిపాడ్ పరిశీలించిన కావలి మాజీ ఎమ్మెల్యే

NLR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 15వ తేదీన బోగోలు మండలం జువ్వల దీన్నే గ్రామంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇవాళ పరిశీలించారు. ఫిషింగ్ హార్బర్ సందర్శించడానికి మాజీ సీఎం వస్తున్నారని తెలియజేశారు.

April 10, 2026 / 07:04 PM IST

ఘనంగా ఏయూ శతాబ్ధి వేడుకలు

విశాఖలో ఆంధ్రయూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయని వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా బోధనేతర సిబ్బంది ఆధ్వర్యంలో క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలను ఇవాళ ప్రారంభించారు. ఉద్యోగుల సేవలు విశ్వవిద్యాలయ అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. ఇదే కార్యక్రమంలో ఉద్యోగి, చిత్రకారుడు మహ్మద్ గౌస్ చిత్ర ప్రదర్శనను ప్రారంభించారు.

April 10, 2026 / 07:01 PM IST

పిల్లలకు స్పానిష్ భాష కూడా నేర్పిస్తున్నాం: SP

ATP: అనంతపురం పోలీస్ కన్వెన్షన్ హాలులో పోలీస్ రక్షక్ ప్రీ-ప్రైమరీ స్కూల్ నాలుగో వార్షికోత్సవం ఘనంగా జరిగింది. పోలీసు పిల్లలకు మెరుగైన సౌకర్యాలతో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని SP జగదీష్ పేర్కొన్నారు. RDT సహకారంతో పిల్లలకు స్పానిష్ భాష కూడా నేర్పిస్తున్నామని, ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చే పోటీని తట్టుకునేలా విద్యా ప్రమాణాలు ఉన్నాయని తెలిపారు.

April 10, 2026 / 07:00 PM IST

కొమరోలులో చలివేంద్రం ప్రారంభించిన ఎస్సై

ప్రకాశం: కొమరోలు పట్టణంలోని ఆంజనేయస్వామి గుడి కూడలి వద్ద ఎస్సై నాగరాజు శుక్రవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాల మేరకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్సై తెలిపారు. అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో మట్టికుండల్లో చల్లటి నీటిని అందుబాటులో ఉంచామని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

April 10, 2026 / 06:49 PM IST

‘ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలి’

కోనసీమ: ‘కేడర్ విత్ లీడర్’ కార్యక్రమం రాజోలు టీడీపీ ఇన్‌ఛార్జ్ గొల్లపల్లి అమూల్య అధ్యక్షతన తాటిపాక జీఎస్ గార్డెన్స్‌లో నిర్వహించబడింది. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను పార్టీ నాయకులతో కలిసి స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ..  అర్జీలను త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రతీ కార్యకర్త పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు.

April 10, 2026 / 06:47 PM IST

అద్దంకిలో న్యాయవాదులు నిరసన

BPT: పీలేరుకు చెందిన న్యాయవాది పూజారి ఎల్లయ్యను దారుణంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం అద్దంకిలో ఆలిండియా లాయర్స్ యూనియన్, బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో న్యాయవాదులపై దాడులు, హత్యలు పెరిగిపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు.

April 10, 2026 / 06:46 PM IST

రైతులతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశం

NTR: పేదల సంక్షేమంతో పాటు పట్టణాన్ని అభివృద్ధి చేయడమే కూటమి ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. జీ. కొండూరు పీ.ఏ.సీ.ఎస్ (సొసైటీ)లో రైతులు, స్థానిక నాయకులతో ఎమ్మెల్యే శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సొసైటీ నుంచి రైతులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. జీ. కొండూరు గ్రామంలో అభివృద్ధి పనుల పురోగతి తెలుసుకున్నారు.

April 10, 2026 / 06:45 PM IST

అన్నా క్యాంటీన్‌ను సందర్శించిన బీజేపీ నాయకులు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు అందిస్తున్న 5 రూపాయలకే భోజనం నాణ్యత ప్రమాణాలను ఇవాళ తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యదర్శి రవి శంకర్ రాజమండ్రిలో ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. అద్భుతమైన రుచులతో నిరుపేదల కడుపు నింపుతున్న అన్నా క్యాంటీన్ పథకంలో భోజనం రుచి చూసి ప్రజలకు అందిస్తున్న ఆహారం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు.

April 10, 2026 / 06:44 PM IST

రేపు అమరావతి మండలంలో విద్యుత్ కోత

PLD: విద్యుత్ లైన్‌ల మరమ్మతుల కారణంగా రేపు శనివారం మండలంలో విద్యుత్ కోత జరుగుతుందని ఏఈ రవికిరణ్ తెలిపారు. ఈదురు గాలులు అకాల వర్షం కారణంగా కొన్ని ప్రదేశాల్లో లైన్‌లు మరమ్మతులకు వచ్చాయని, పరిశీలన చేపడుతున్నామన్నారు. కరెంటు తీగల కింద పెరిగిన చెట్లను తొలగించనున్నట్లు చెప్పుకొచ్చారు. విద్యుత్ వినియోగదారులు ఈ అసౌకర్యాన్ని గమనించాలని పేర్కొన్నారు.

April 10, 2026 / 06:41 PM IST

లా విద్యార్థులకు ఐజీపీ రవికృష్ణ సూచనలు

GNTR: గుంటూరు జేసీ లా కాలేజీలో జరిగిన కార్యక్రమంలో ఐజీపీ ఏకే రవికృష్ణ NDPS చట్టంపై అవగాహన పెంచాలని పిలుపునిచ్చారు. లా విద్యార్థులు సమాజ మార్పుకు దోహద పడాలని సూచించారు. డ్రగ్స్ జాతీయ భద్రతకు ముప్పని హెచ్చరించారు. ‘Legal Literacy Camps’ ద్వారా ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంచాలని తెలిపారు.

April 10, 2026 / 06:40 PM IST

కోడూరుపాడులో బయోగ్యాస్ ప్లాంట్ ప్రారంభం

కృష్ణా: బాపులపాడు మండలం కోడూరుపాడు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి మూడవ విడత నాలుగు నెలల బోనస్‌గా రూ.2,19,122ను ఛైర్మన్ చలసాని ఆంజనేయులు శుక్రవారం పంపిణీ చేశారు. అనంతరం కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో పాడి రైతు ఇంట్లో బయోగ్యాస్ ప్లాంట్‌ను ప్రారంభించారు. పశు వ్యర్థాల నుంచి శక్తి ఉత్పత్తి చేయడమే లక్ష్యమని చలసాని ఆంజనేయులు తెలిపారు.

April 10, 2026 / 06:36 PM IST

ప్రజల నుంచి వినతులు స్వీకరించిన జిల్లా అధ్యక్షుడు

KDP: జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలు ఇచ్చిన అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని కోరారు.

April 10, 2026 / 06:36 PM IST

‘ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి’

CTR: కల్లూరు ఎస్సై జయరామయ్య పులిచెర్ల మండలంలో ఆటో డ్రైవర్లకు శుక్రవారం అవగాహన కల్పించారు. వాహనాలకు సంబంధించిన రికార్డులు తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు. తప్పనిసరిగా వాహనాలు నడిపేటప్పుడు యూనిఫామ్ ధరించాలన్నారు. ప్రయాణికులతో మర్యాదగా నడుచుకోవాలన్నారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఓవర్ లోడ్ తగదన్నారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవన్నారు.

April 10, 2026 / 06:35 PM IST

ప్రతీ ఇంటికి సంక్షేమ ఫలాలు: MLA

NDL: కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయడం కార్యకర్తల బాధ్యత అని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వేల్పనూరులో అధికారులు, పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. పరస్పర సమన్వయంతో పనిచేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులందరూ 100 శాతం విజయం సాధించేలా కృషి చేయాలని ఆయన కోరారు.

April 10, 2026 / 06:29 PM IST