• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కార్మికులతో కలిసి భోజనం చేసిన మంత్రి

SKLM: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గురువారం రణస్థలంలోని రెడ్డీస్ ల్యాబ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ల్యాబ్‌లో ఉన్న బాయిలర్స్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం కార్మికులతో కలిసి భోజనం చేశారు. ఈ మేరకు కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఈశ్వరరావు, RDO కె. సాయి ప్రత్యూష, తదితరులు పాల్గొన్నారు.

April 9, 2026 / 04:13 PM IST

రోడ్డు ప్రమాదం.. కారు, లారీ ఢీ..!

TPT: నాగలాపురం మండలం కొడియంబేడు వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై వైపు వెళ్తున్న కారు, లారీ వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. అయితే, కారులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

April 9, 2026 / 04:11 PM IST

అనుమానాస్పదంగా వృద్ధుడి మృతి

VSP: ఆనందపురం మండలం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన ఉన్న తోటలో చెట్టుకు ఉరివేసుకుని అనుమానాస్పదంగా ఓ వృద్ధుడు మృతి చెందాడు. మృతుడు పైల నారాయణ స్వామి(60)గా ఆనందపురం పోలీసులు గుర్తించారు. అతను ఓ ప్రైవేట్ పాఠశాలలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. పోలిసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

April 9, 2026 / 04:11 PM IST

టీ స్టాళ్లు, పాన్ షాపులపై ప్రత్యేక తనిఖీలు

సత్యసాయి: హిందూపురం పట్టణంలోని చిన్న మార్కెట్, సత్యనారాయణపేట, బోయపేట ప్రాంతాల్లో విద్యాసంస్థల సమీపంలో ఉన్న పెట్టి షాపులు, టీ స్టాళ్లు, పాన్ షాపులపై అధికారులు బృందం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు విఘాతం కలిగించే చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

April 9, 2026 / 04:06 PM IST

రేపు అమ్మవారి పునర్నిర్మాణ ప్రతిష్ట ఊరేగింపు

ప్రకాశం: కనిగిరిలో రేపు అమ్మవారిశాల నుంచి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పునర్నిర్మాణ ప్రతిష్ట ఊరేగింపు ఉంటుందని దేవస్థానం ఛైర్మన్ దేవకి శ్రీనివాసులు తెలిపారు. ఒంగోలు బస్టాండ్ నుంచి బయలుదేరి కనిగిరి పురవీధుల్లో ఊరేగింపుగా ఎమ్మెస్సార్ రోడ్డు ఆంధ్ర బ్యాంకు వీధీమీదగా అమ్మవారి శాల బజారుకు ఈ ఊరేగింపు ఉంటుందని తెలిపారు.

April 9, 2026 / 03:57 PM IST

హైవేపై ఆటో బోల్తా.. పలువురికి గాయాలు

NLR: వరికుంటపాడు సమీపంలో 565 జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో టైర్ పేలి బోల్తా పడిన ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. బోల్తాపడ్డ ఆటో మర్రిపాడు మండలం పొంగూరు నుంచి ఒంగోలుకు వెళ్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

April 9, 2026 / 03:50 PM IST

రాధాకృష్ణకు వ్యతిరేకంగా వైసీపీ నినాదాలు

ATP: ఏబీఎన్ రాధాకృష్ణ మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శింగనమలలో వైసీపీ శ్రేణులు గురువారం భారీ ర్యాలీ నిర్వహించాయి. బస్టాండ్ సర్కిల్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన నాయకులు, కార్యకర్తలు ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర మహిళలకు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

April 9, 2026 / 03:50 PM IST

గర్నిమిట్ట PHCలో పోషణ పక్వాడకు శ్రీకారం

అన్నమయ్య: కే.వీ.పల్లి మండలంలోని గర్నిమిట్ట PHCలో ఇవాళ్టి నుంచి 23 వరకు పోషణ పక్వాడ ప్రారంభమైంది. తల్లి-శిశు పోషణ, చిన్నారుల మెదడు ప్రారంభ దశ అభివృద్ధి, ఆట ఆధారిత విద్య, తల్లిదండ్రులు సమాజ పాత్రపై అవగాహన కల్పించారు. స్క్రీన్ టైమ్ తగ్గించి పిల్లలతో సమయం గడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, బాలింతలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

April 9, 2026 / 03:46 PM IST

సీఐటీయూ సభల కరపత్రాల విడుదల

KRNL: ఆదోని పట్టణంలోని సుందరయ్య భవనంలో సీఐటీయూ రాష్ట్ర మహాసభల కరపత్రాలను గోపాల్, తిప్పన్న, లక్ష్మన్న గురువారం విడుదల చేశారు. అంగన్వాడీ, ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు అమలు చేసి కార్మిక హక్కులను రక్షించాలని CITU నాయకులు కోరారు. సభలను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

April 9, 2026 / 03:41 PM IST

ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు.!

GNTR: వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు శ్రీ విఖనస శ్రీనివాస ట్రస్ట్ చలివేంద్రంను ఏర్పాటు చేసింది. స్థానిక బాలాజీ రావు పేటలోని తడికల మిల్లు సమీపంలో ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో గురువారం మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి గాను స్థానికులు ట్రస్ట్ సభ్యులను అభినందించారు. 

April 9, 2026 / 03:36 PM IST

పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కైలే

కృష్ణా: పామర్రులో ABN రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పోలీస్ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వైసీపీ కార్యాలయం నుంచి పీఎస్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

April 9, 2026 / 03:31 PM IST

చిప్పగిరిలో మాతృత్వ ఆరోగ్య శిబిరం

KRNL: చిప్పగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు.డా.అఫ్రోజ్ బేగం ఆధ్వర్యంలో గర్భిణీలకు రక్తపోటు,హీమోగ్లోబిన్ తదితర పరీక్షలు చేసి ఆరోగ్య స్థితిని పరిశీలించారు. గర్భధారణ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు,పోషకాహారంపై అవగాహన కల్పించారు.క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.

April 9, 2026 / 03:28 PM IST

సచివాలయం వద్ద చలివేంద్రం ఏర్పాటు

KDP: కలసపాడు మండలం ఎగువ తంబళ్లపల్లె సచివాలయం వద్ద పంచాయతీ సెక్రటరీ కవిత ఆధ్వర్యంలో గురువారం చలివేంద్రం ఏర్పాటు చేశారు.పెరుగుతున్న వేసవికాలం దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మంచినీరు అందించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకుడు ప్రహ్లాద రెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

April 9, 2026 / 03:24 PM IST

రేపు మార్కాపురానికి సినీ, జబర్దస్త్ ఆర్టిస్టులు

మార్కాపురంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో రేపు రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు, ఎలక్ట్రికల్ ప్రభను ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి జబర్దస్త్ ఆర్టిస్టులు తన్మై, దొరబాబు, శాంతి కుమార్, రైసింగ్ రాజ వస్తున్నారని నిర్వాహకులు తెలపారు.

April 9, 2026 / 03:24 PM IST

ఎన్యూమరేటర్‌లు, సూపర్వైజర్‌లకు శిక్షణ

PLD: నూజెండ్ల మండలంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం సెన్సస్-2027లో భాగంగా ఎన్యూమరేటర్‌లు, సూపర్వైజర్‌లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నూజెండ్ల ఎమ్మార్వో రమేశ్, ఏఎస్వో నాగశ్రీనివాసరావు ప్రారంభించారు. ఎన్యూమరేటర్‌లు 26 మంది, సూపర్వైజర్‌లు ఐదుగురు పాల్గొన్నారు.

April 9, 2026 / 03:21 PM IST