SKLM: సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలకు ఆర్థిక భరోసా కలుగుతుందని ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్నారు. ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన 12 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ నిధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అన్నమయ్య: అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని, ఆయన చూపిన మార్గంలో నడవడం మనందరి కర్తవ్యం అని మదనపల్లె వైఎస్సార్సీపీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా మదనపల్లె టౌన్లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
KRNL: మంత్రాలయం సీఐ రామానుజులు ఆధ్వర్యంలో మాధవరం ఎస్సై విజయ్ కుమార్ సిబ్బందితో కలిసి ఇవాళ సింగరాజనహళ్లి గ్రామం వెలుపల ఖాళీ స్థలంలో పేకాట జూదం ఆడుతున్న గ్యాంగ్పై దాడి చేశారు. అందర్-బహార్ ఆటలో పాల్గొంటున్న 10 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1,41,000 నగదు, 52 పేకముక్కలు, 6 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు.
GNTR: తెనాలి పట్టణ పరిధిలోని సీబీఎన్ కాలనీలో ట్యాంకు వద్ద పైపు లైన్ లీకు ఏర్పడిన కారణంగా సోమవారం పలు వార్డుల్లో మంచినీటి సరఫరా నిలిచిపోతుందని కమిషనర్ రామ అప్పలనాయుడు తెలిపారు. పట్టణంలోని 21, 22, 23 వార్డులకు ఉదయం నుంచి మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
KDP: జిల్లాలో బస్సు దగ్ధం ఘటనపై రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. ఘటనపై సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. డ్రైవర్ అప్రమత్తత వల్ల ప్రయాణికులు సురక్షితంగా బయటపడినట్లు మంత్రి తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
TPT: నాయుడుపేట వైసీపీ కార్యాలయంలో డాక్టర్ బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ ఛైర్మన్ తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి, జిల్లా నాయకులు మద్దాల సోమశేఖర్ రెడ్డి, మండల అధ్యక్షులు ఒట్టూరు కిషోర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
ATP: గుత్తిలోని బైబిల్ మిషన్ చర్చి (స్వస్థతశాల) క్రైస్తవ భక్తులతో కిక్కిరిసిపోయింది. బైబిల్ మిషన్ చర్చిలో పాస్టర్ రెవరెండ్ అద్భుత కుమార్, మణి కుమారి ఆధ్వర్యంలో ఆదివారం ఈస్టర్ వేడుకలను అత్యంత ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాయలసీమలోని ఆయా ప్రాంతాలకు చెందిన క్రైస్తవులు భారీగా తరలివచ్చారు. దీంతో చర్చి జనసంద్రంగా మారింది.
VSP: సృజన-2026 సాంకేతిక చర్చ వేదికలో విద్యార్థుల సృజనాత్మకత, పరిశోధనా దృక్పథం దేశ భవిష్యత్తుకు కీలకమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీయన్ మాధవ్ అన్నారు. ఆదివారం విశాఖలో ఏబీవీపీ, ఏఐసీటీటఈ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థుల ఆవిష్కరణలను పరిశీలించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.
నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (PGRS), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. https://Meekosam.ap.gov.in వెబ్ సైట్ లో అర్జీలు సమర్పించవచ్చని, 1100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
SKLM: మందసలోని పెద్ద కేసుపురంలో ఆదివారం పిడుగుపాటుకు తల్లి, కుమార్తె మృతి చెందారు. గ్రామానికి చెందిన కృష్ణవేణి (35), కుమార్తె చిన్ని (15) జీడీ తోటలో పనులు చేస్తున్నారు. సాయంత్రం వాతావరణంలో మార్పులు చోటుచేసుకొని బలమైన ఈదురు గాలులు వీచాయి. ఈ క్రమంలో పెద్ద శబ్దంతో పిడుగు అకస్మాత్తుగా వారు పనిచేస్తున్న తోటలో పడగా అక్కడికక్కడే మరణించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ASR: అడ్డతీగల మండలం కొనలోవ గ్రామంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో నాలుగు ఇళ్లు పూర్తిగా దగ్ధమైన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి ఆదివారం సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అన్ని విధాలు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
AKP: జగ్జీవన్ రామ్ పేరుతో నిర్మించే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయాలని సీపీఐ పాయకరావుపేట మండల కార్యదర్శి వి. అర్జున్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక శబరి కాలనీలో జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు భూసేకరణకు రూ.1,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయగా బడ్జెట్లో రూ. 600 కోట్లు కేటాయించారన్నారు.
E.G: ప్రతి ఇంటి ముందు సాధారణంగా మహిళలు ముగ్గులు వేస్తారు. ఈ ముగ్గులతో సాంప్రదాయ వాతావరణాన్ని సృష్టించడమే కాకుండా, భారతీయ సంప్రదాయాల పట్ల గౌరవాన్ని తెలియజేస్తుంది. అమరాతి చట్టబద్దత బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన సందర్భంగా ఆదివారం అనపర్తి నియోజకవర్గం రామవరంలో “మన రాజధాని మన అమరావతి” అంటూ మహిళనె ముగ్గులు వేశారు. ఎంతోమంది ఈ ముగ్గును ఆసక్తిగా తిలకించారు.
KRNL: ఆదోని పట్టణంలో సాయి జ్యోతి నేత్రదాన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. పట్టణంలోని పండిట్ నెహ్రూ గౌడ రాజగోపాల్ భవనం ముందు ఆదివారం ఉదయం ఈ చలివేంద్రాన్ని ప్రారంభించారు. గత 10 సంవత్సరాలుగా ఫౌండేషన్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు శ్రీధర్, విశ్వనాథ్, బీజేపీ నాయకులు మరియాని చెన్నబసప్ప తెలిపారు.
PLD: ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక ఆర్సీఎం చర్చి ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది. జీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు ఈ శిబిరాన్ని సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. పల్లెల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు.