• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

భీమవరంలో మహాత్మ పూలే జయంతి కార్యక్రమం

W.G: భీమవరం తహసిల్దార్ ఆఫీస్ ఆవరణలో విజ్ఞానవేదిక ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతి రావు పూలే జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పూలే సేవా సమితి అధ్యక్షులు M.V.R. అప్పాజీ మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన యోధుడు పూలే అన్నారు. షేక్ కాసిం, అల్లు శ్రీనివాస్, బాషా తదితరులు పాల్గొన్నారు.

April 11, 2026 / 01:25 PM IST

‘అణగారిన వర్గాల ఆశాజ్యోతికి ఘన నివాళి’

​PPM: పుస్తక పఠనమే సామాజిక మార్పుకు పునాది, మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో మార్పు సాధ్యం ఆని DRO కె.హేమలత అన్నారు. ఈ​కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ.. సమాజంలో సమానత్వం, చదువు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు, రచనలను చదవడం ద్వారానే సామాజిక మార్పు సాధ్యమవుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు.

April 11, 2026 / 01:25 PM IST

రాజ గోపుర పునః నిర్మాణానికి శంకుస్థాపన

W.G: నరసాపురం శ్రీ ఆదికేశవ స్వామి వారి దేవస్థాన రాజగోపుర పునః నిర్మాణ శంకుస్థాపన మహోత్సవం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామివారు ఆశీర్వచనాలు అందుకున్నారు. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారు ఈ పుణ్య కార్యానికి శంఖుస్థాపన చేశారు.

April 11, 2026 / 01:11 PM IST

పూలే జయంతి సందర్భంగా సీఎం ఘన నివాళులు

GNTR: సామాజిక విప్లవయోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాడేపల్లిలోని ఆయన నివాసంలో ఘనంగా నివాళులు అర్పించారు. మంత్రులతో కలిసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన పూలే ఆశయాలను కొనసాగించడం ప్రభుత్వ ధ్యేయమని సీఎం పేర్కొన్నారు.

April 11, 2026 / 01:11 PM IST

RTC బస్టాండును అందుబాటులోకి తెస్తాం:MLA

KDP: ప్రొద్దుటూరులోని నూతన ఆర్టీసీ బస్టాండును ప్రయాణికులకు త్వరగా అందుబాటులోకి తేవాలని సంబంధిత అధికారులను స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆదేశించారు. ఆయన శనివారం ఉదయం బస్టాండును పరిశీలించారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వాహనాల రాకపోకలకు వేరువేరుగా దారి ఏర్పాటు చేయాలన్నారు. అడ్డుగా ఉన్న డివైడర్లను తొలగించాలన్నారు.

April 11, 2026 / 01:10 PM IST

లోగిసలో సీసీ రోడ్లు ప్రారంభించిన మంత్రి

VZM: గజపతినగరం మండలంలోని లోగిస గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, కాలువలను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామంలో 114 లక్షలతో అంతర్గత సీసీ రోడ్లు, కాలువలు నిర్మించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ గోపాల రాజు పాల్గొన్నారు.

April 11, 2026 / 01:04 PM IST

అలిపిరిలో భారీగా డ్రోన్ కెమెరాల పట్టివేత

TPT: అలిపిరిలో డ్రోన్, స్పై కెమెరాల పట్టివేత 2026లో గణనీయంగా పెరిగింది. జనవరిలో 47 డ్రోన్లు, 13 స్పై కెమెరాలు, ఫిబ్రవరిలో 19 డ్రోన్లు, 14 స్పై కెమెరాలు, మార్చిలో 19 డ్రోన్లు, 14 స్పై కెమెరాలు పట్టుబడ్డాయి. ఏప్రిల్ 2026 వరకు 7 డ్రోన్లు, 9 స్పై కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద 243 డ్రోన్ కెమెరాలు, 94 స్పై కెమెరాలు పట్టుబడటం గమనార్హం.

April 11, 2026 / 12:47 PM IST

జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

VSP: పూలే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడని జిల్లా సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ఇవాళ గ్రీన్ పార్క్ వద్ద పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యతో అసమానతలు తొలగుతాయని విశ్వసించిన దూరదృష్టి గల నాయకుడని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

April 11, 2026 / 12:45 PM IST

ఈ నెల 25 నుంచి SVU సెమిస్టర్ పరీక్షలు

CTR: తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ(SVU) పరధిలో M.A, M.Com, M.Sc, M.Ed, MLisc నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 25వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ రాజమాణిక్యం ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు ఈనెల 13వ తేదీ లోపు వారి పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

April 11, 2026 / 12:42 PM IST

‘ఎండ తీవ్రతకు తగినంత విశ్రాంతి తీసుకోవాలి’

SKLM: మన ఊరు మన బాధ్యతలో అందరూ భాగం కావాలని, జేసీ పూర్వపు అధ్యక్షులు కోరాడ.రమేష్ కోరారు. జిల్లాలో జేసీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చలివేంద్రంలో పాల్గొని, బాటసారులకు ఉపసమనం కలిగించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని, వడదెబ్బలు తగలకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వీలైనంత ఎక్కువగా ద్రవ పదార్ధాలు తీసుకోవాలని కోరారు.

April 11, 2026 / 12:41 PM IST

ప్రొద్దుటూరులో మట్కా బీటర్లు అరెస్ట్

KDP: ప్రొద్దుటూరులోని స్థానిక మున్సిపల్ గ్రౌండ్‌లో శుక్రవారం సాయంత్రం మట్కా రాస్తున్న షేక్ మౌలాలి, సురేశ్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి మట్కా చీటీలు, రూ.3,100లు నగదు స్వాధీనం చేసుకున్నట్లు 3-టౌన్ సీఐ రామాంజనేయుడు తెలిపారు. క్రికెట్ బెట్టింగ్, మట్కా, గుట్కా, గ్యాంబ్లింగ్, గంజాయి,మాదకద్రవ్యాలు జోలికి వెళితే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.

April 11, 2026 / 12:40 PM IST

‘సమానత్వం కోసం పూలే కృషి స్ఫూర్తిదాయకం’

GNTR: బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మంత్రి సవిత పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహాత్మా పూలే సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణ కోసం చేసిన సేవలను మంత్రి సవిత స్మరించారు. ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

April 11, 2026 / 12:40 PM IST

గుమ్మలక్ష్మీపురంలో ధ్వజస్తంభ ప్రతిష్ట

PPM: గుమ్మలక్ష్మీపురంలో శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవం గ్రామ పెద్దలు, భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. పూజారుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు, వేదమంత్రోచ్చారణల మధ్య ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయం వద్ద భక్తులతో సందడి నెలకొంది. ఈ కార్యక్రమం అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.

April 11, 2026 / 12:37 PM IST

చీరాలలో పేదలకు అల్పాహారం పంపిణీ

BPT: చీరాల పట్టణంలో నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు, రిక్షా కార్మికులకు, భిక్షాటన చేస్తున్న వారికి ప్రతి నెల రెండవ శనివారం అల్పాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా సామాజిక కార్యకర్త ఆర్‌కే శీలంను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని పేదలకు స్వయంగా అల్పాహారం పంపిణీ చేసి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

April 11, 2026 / 12:33 PM IST

మాచర్లలో ఇండస్ట్రియల్ పార్క్‌కు శంకుస్థాపన

PLD: మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామ శివారులో MSR ఇండస్ట్రియల్ పార్క్ నూతన నిర్మాణాలకు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రాంతీయ అభివృద్ధికి ఇది ముఖ్యమైన మైలురాయిగా మారుతుందని, పరిశ్రమల స్థాపనతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

April 11, 2026 / 12:30 PM IST