• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ముగ్గురు టీచర్లకు అవార్డులు

నెల్లూరు: టీచర్స్ డే సందర్భంగా ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను ప్రకటించింది. బుచ్చిరెడ్డిపాలెం(M) పెనుబల్లి MPPSలో SGTగా పనిచేస్తున్న CH చెన్నయ్య, ఇందుకూరుపేట MKR ప్రభుత్వ జూ. కాలేజ్ లెక్చరర్ డొమిని రెడ్డి, అదే మండలంలోని నరసాపురం ZP హైస్కూల్ పీడీ ముజీర్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. విజయవాడలో వీళ్లు అవార్డులు అందుకుంటారు.

September 4, 2025 / 06:26 AM IST

అన్నప్రసాదం ట్రస్ట్‌కు గుంటూరు భక్తుడి విరాళం

TPT: గుంటూరుకు చెందిన అలపాటి సురేష్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10,11,111 విరాళంగా అందించారు. భక్తుల సేవార్థం అన్నప్రసాదం కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో ఈ విరాళాన్ని సమర్పించినట్లు తెలిపారు. ఆయన బుధవారం సాయంత్రం తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో టీటీడీ అదనపు ఈవోసీ‌హెచ్ వెంకయ్యచౌదరి వారికి అందజేశారు.

September 4, 2025 / 06:26 AM IST

CM చంద్రబాబును కలిసిన MLA దామచర్ల

ప్రకాశం: సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబును కలిసి ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై ఎమ్మెల్యే దామచర్ల కొద్దిసేపు మాట్లాడారు. ఎమ్మెల్యే వినతి పత్రం రూపంలో సీఎంకు అందజేయగా, నియోజకవర్గంలో అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

September 4, 2025 / 06:24 AM IST

రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపికైన ఉపాధ్యాయులు

BPT: రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు బుధవారం బాపట్ల జిల్లా నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. అద్దంకి మండలం తిమ్మాయపాలెం పాఠశాలలో పనిచేస్తున్న ప్రతాప్, అద్దంకి MPPS CV STREET పాఠశాల నుంచి M. ధనలక్ష్మి, సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెంలోని ZP హైస్కూల్ ఉపాధ్యాయురాలు కే. మోహన్ అంజలికి ఉత్తమ అవార్డులు లభించాయి.

September 4, 2025 / 06:20 AM IST

జిల్లాలో 22 మండలాల్లో వర్షం

ATP: జిల్లా వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కొనసాగుతున్నాయి. 22 మండలాల పరిధిలో 4.9 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. కళ్యాణదుర్గం 17.2, కంబదూరు 15.4, నార్పల 11.6, విడపనకల్లు 11.2, ఉరవకొండ 10.6, కుందుర్పి 10.2 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో తేలికపాటి వర్షం పడింది. సెప్టెంబర్ సాధారణ వర్షపాతం 110.9 మి.మీ కాగా ప్రస్తుతానికి 12.9 మి.మీ నమోదైంది.

September 4, 2025 / 06:20 AM IST

జిల్లాకు 1,923 మెట్రిక్ టన్నుల ఎరువులు

ATP: స్పిక్ కంపెనీ నుంచి 1,922.75 మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాకు సరఫరా కాగా, ఇందులో 904,5 మెట్రిక్ టన్నుల యూరియా ఉన్నట్లు రేక్ ఆఫీసర్, ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్ తెలిపారు. స్థానిక ప్రసన్నాయపల్లి రైల్వే స్టేషన్ రేక్ పాయింట్‌కు బుధవారం వ్యాగన్ల ద్వారా చేరిన ఎరువులు, యూరియాను పరిశీలించారు. 904.5 మెట్రిక్ టన్నుల యూరియా చేరిందన్నారు.

September 4, 2025 / 06:19 AM IST

డీఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు

గుంటూరు రేంజ్ పరిధిలో నలుగురు సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారిలో ఎం. వెంకట సుబ్బారావు, కె. వెంకటేశ్వర్లు, బెల్లం శ్రీనివాసరావు, చంద్రమౌళి ఉన్నారు. కాగా, రాష్ట్రంలో మొత్తం ఎనిమిది మంది సీఐలకు పదోన్నతి ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

September 4, 2025 / 06:18 AM IST

నేడు కొత్తపేట ఎమ్మెల్యే పర్యటన వివరాలు

కోనసీమ: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఇవాళ పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది వెల్లడించారు.  ఉదయం 9:00 గంటలకు రావులపాలెం క్యాంప్ కార్యాలయం వద్ద ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం వాడపాలెం లోని పార్టీ కార్యాలయంలో ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని తెలిపారు.

September 4, 2025 / 06:18 AM IST

పొన్నూరులో విజిలెన్స్ అధికారుల తనిఖీలు

GNTR: యూరియా, డీఏపీ ఎరువులు రైతులకు సక్రమంగా అందుతున్నాయా లేదా, అధిక ధరలకు అమ్ముతున్నారా, వేరే జిల్లాలకు తరలి వెళ్తున్నాయా అనే విషయాలపై పొన్నూరు మండలంలో విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు బుధవారం సంయుక్తంగా తనిఖీలు చేశారు. GDCMS – నిడుబ్రోలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు నిడుబ్రోలు, పెదపాలెం గ్రామాలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

September 4, 2025 / 06:16 AM IST

అక్రమ ఎరువుల నిల్వపై కేసు నమోదు

NDL: పాణ్యం మండలంలో అక్రమ ఎరువుల నిల్వపై కేసు నమోదు చేసినట్లు సీఐ కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం గడివేముల మండలం కరిమద్దెలలో ఆర్. బ్రహ్మానందంరెడ్డి ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. గడివేముల వ్యవసాయాధికారి పవన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఈ చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఎరువులను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.

September 4, 2025 / 06:14 AM IST

గూడూరులో ఉరేసుకుని మహిళ మృతి

KRNL: గూడూరు మండలం చనుగొండ్లకు చెందిన మంజుల (22) కడుపునొప్పితో బాధపడుతూ బుధవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గోనెగండ్లకు చెందిన మనోహర్‌తో వివాహమైన మంజులకు ఇద్దరు సంతానం ఉన్నారు. సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

September 4, 2025 / 06:12 AM IST

ఆర్యవైశ్యుల సమస్యలు లోకేష్ దృష్టికి

PLD: పల్నాడులో ఆర్యవైశ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి నారా లోకేష్‌కు రాష్ట్ర ఆర్యవైశ్య యువజన సంఘం అదనపు కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు దాచేపల్లి మాశెట్టి సాత్విక్ రామ్ వివరించారు. బుధవారం అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు కోసం నిర్వహించిన భూమి పూజ కార్యక్రమానికి హాజరైన మంత్రి లోకేశ్‌ను కలిసి వివిధ సమస్యలను తెలిపారు.

September 4, 2025 / 06:12 AM IST

జిల్లాలోని రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

ప్రకాశం: జిల్లాలోని రైల్వే ప్రయాణికులకు MP మాగుంట శ్రీనివాసులరెడ్డి శుభవార్త చెప్పారు. రైల్వే GMతో బుధవారం జరిగిన సమావేశంలో జిల్లాకు సంబంధించి పలు అంశాలపై ఎంపీ మాగుంట చర్చించారు. ఈ సందర్భంగా అమరావతి ఎక్స్‌ప్రెస్ రైలు దొనకొండ, కురిచేడు రైల్వే స్టేషన్‌లో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ దొనకొండ రైల్వే స్టేషన్‌లో నిలుపుదల చేసేందుకు GM అంగీకరించినట్లు MP తెలిపారు.

September 4, 2025 / 06:12 AM IST

విశాఖలో చంద్రబాబు పర్యటన వివరాలు

VSP: సీఎం నారా చంద్రబాబు ఈనెల 5న విశాఖ రానున్నారు. ఆరోజు ఉదయం 8.50కు ఉచ్చుకొండ హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి 9 గంటలకు హోటల్ రేడిషన్ బ్లూకి వెళ్తారు. ఉదయం 10 నుంచి 11:30 వరకు ACIAM అంతర్జాతీయ మీడియేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఋషికొండలో హెలిపాడ్ వద్దకు 11:35కు చేరుకుని, 11:40కు తిరుగుప్రయాణం అవుతారు.

September 4, 2025 / 06:08 AM IST

పైకప్పు పెచ్చులు ఊడిపడి.. విద్యార్థులకు గాయాలు

KRNL: ఆలూరు మండల ప్రాథమిక పాఠశాలలో బుధవారం తరగతి గదిలో పైకప్పు పెచ్చులు ఊడిపడటంతో నిత్య, జయశ్రీ, చరణ్, విఘ్నే అనే నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. పాఠశాల భవనం నాణ్యత లోపించడం వల్లే పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

September 4, 2025 / 06:08 AM IST