• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలి’

VZM: మహిళా సాధికారత వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక పోలీసు వెల్ఫేర్ ఆంగ్ల పాఠశాల విద్యార్థినులకు స్వీయ రక్షణ మెళుకువలు బుధవారం నేర్పించారు. ఈ కార్యక్రమానికి ASP సౌమ్య లత హాజరై మాట్లాడారు. విద్యార్థినులు ఆత్మవిశ్వాసంతో స్వశక్తితోనే తమను తాము రక్షించుకోవాలని సూచించారు. ఈవ్ టీజింగ్, వేధింపులను ఎదుర్కొనే విధానాలు వివరించారు.

March 4, 2026 / 06:49 PM IST

శ్రీసిటీలో భద్రతా వారోత్సవాల ముగింపు

TPT: శ్రీసిటీలో 55వ జాతీయ భద్రతా వారోత్సవాల ముగింపు వేడుకలు బుధవారం నిర్వహించారు. పరిశ్రమల సిబ్బంది, ఉద్యోగులు, సమీప పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ సతీష్ కామత్ భద్రతా జెండా ఎగురవేసి ప్రతిజ్ఞ చేయించారు. మేనేజింగ్ డైరెక్టర్ డా. రవీంద్ర సన్నారెడ్డి భద్రతా ప్రమాణాల పాటింపు అత్యవసరమని పేర్కొన్నారు. వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.

March 4, 2026 / 06:47 PM IST

‘అటవీ ఆధారిత ద్రావణాల ప్రాముఖ్యత ఎంతో ఉంది’

ASR: హుకుంపేట మండలం బోడిగట్టులో బుధవారం రైతు సాధికార సంస్థ ఏపీసీఎన్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాబూరావు నాయుడు పర్యటించారు. అక్కడ నిర్వహిస్తున్న అటవీ చైతన్య ద్రావణం ప్రయోగ క్షేత్రం పరిశీలించారు. ఈ ద్రావణం వినియోగంతో పంటల పెరుగుదల, నేల సారవంతం, పెట్టుబడి ఖర్చు తగ్గుతుందని తెలిపారు. సహజ వ్యవసాయ పద్ధతుల్లో అటవీ ఆధారిత ద్రావణాల ప్రాముఖ్యత ఎంతో ఉందన్నారు.

March 4, 2026 / 06:47 PM IST

ముమ్మరంగా వాహన తనిఖీలు

AKP: నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ ఆధ్వర్యంలో గొలుగొండ మండలం చీడిగుమ్మల వద్ద బుధవారం వాహన తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనాలు, కార్లకు సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాహనదారులకు సూచించారు. అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ అప్పారావు, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

March 4, 2026 / 06:44 PM IST

బాల్య వివాహాలు చట్టరీత్య నేరం ఎస్సై సూర్య భగవాన్

ELR: అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా ఉంగుటూరు హైస్కూల్‌లో ICDS ఆధ్వర్యంలో బుధవారం కార్యక్రమం జరిగింది. విద్యార్థులకు సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ సేఫ్టీపై అవగాహన కల్పించారు. చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని అన్నారు. అంగన్వాడీ సూపర్‌వైజర్ శారద, హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు రవీంద్ర, అంగన్వాడి కార్యకర్తలు ఉన్నారు.

March 4, 2026 / 06:44 PM IST

వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకున్న మున్సిపల్ ఛైర్మన్

KDP: బద్వేల్ మున్సిపల్ ఛైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి కుటుంబ సమేతంగా బ్రహ్మంగారిమఠంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని బుధవారం దర్శించుకున్నారు. నూతన పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన వీర ధర్మజ వెంకటాద్రి స్వామిని, ఆయన సోదరుడు దత్తాత్రేయ స్వామిని ఘనంగా సన్మానించారు. పీఠాధిపతి హయాంలో మఠం మరింత అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించారు.

March 4, 2026 / 06:40 PM IST

అసాంఘిక కార్యకలాపాలపై డ్రోన్ నిఘా

సత్యసాయి: ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఆదేశాల మేరకు అసాంఘిక కార్యకలాపాలు, బహిరంగ మద్యం సేవించడంపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. బుధవారం పుట్టపర్తి రూరల్ పరిధిలోని బుగ్గపల్లి అటవీ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ నిర్వహించారు. ఆధునిక సాంకేతికతను వాడుతూ అనుమానాస్పద వ్యక్తుల సంచారం, అక్రమ కార్యకలాపాలను రికార్డు చేశారు.

March 4, 2026 / 06:30 PM IST

సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

NDL: సంజామల మండల పరిధిలోని ముదిగేడులో రూ.20 లక్షల నిధులతో బుధవారం నూతన సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సహకారంతో టీడీపీ నేత రాజగోపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ లక్ష్మీదేవి నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఎస్సీ కాలనీ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నూతన రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు.

March 4, 2026 / 06:30 PM IST

మద్యం బార్లకు లాటరీ

W.G: భీమవరం కలెక్టరేట్‌లో బుధవారం రెండు మద్యం బార్లను జనరల్ కేటగిరీలో లాటరీ పద్ధతి జేసీ రాహుల్ కుమార్ రెడ్డి ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. తణుకు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఒక మద్యం బార్‌కు ఎం.దానారావు ఒక్కొరే నాలుగు దరఖాస్తులు వేయడంతో వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

March 4, 2026 / 06:27 PM IST

UPDATE: యువకుడు దారుణ హత్య..!

CTR: తుమ్మిందపాళ్యంలో ఇవాళ ఓ యువకుడు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన వివరాలను పోలీసుల వెల్లడించారు. ఢిల్లీ బాబు వద్ద సాయికుమార్ రూ. 2 లక్షలు అప్పు తీసుకుని తిరిగి చెల్లించలేదు. అప్పు ఇవ్వలేదని అడిగే క్రమంలో ఏర్పడిన గొడవలో ఢిల్లీ బాబు సాయికుమార్‌ను నాటు తుపాకితో కాల్చాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

March 4, 2026 / 06:25 PM IST

‘అధిక దిగుబడులకు సస్యరక్షణ పాటించాలి’

రైతులు సాగుచేస్తున్న వేరుశెనగ పంటలో అధిక దిగుబడులు రావాలంటే సస్యరక్షణ, ఎరువుల యాజమాన్య పద్దతులు పాటించాలని రాగోల్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త పి.ఉదయ్‌బాబు అన్నారు. కోటబొమ్మాలి మండలం చిట్టేవలస, తిలారు గ్రామాల్లోని రైతులకు వేరుశెనగ పంటపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టెక్కలి ఏడీఏ కె. జగన్మోహన్‌రావు పాల్గొన్నారు.

March 4, 2026 / 06:25 PM IST

విశాఖకు ఐటీ వెల్లువ

VSP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతోందని, నగరానికి కంపెనీలు క్యూ కడుతున్నాయని ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఉపాధి కోసం యువత బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వలస వెళ్లాల్సి వచ్చేదన్నారు. కానీ నేడు ఆ పరిస్థితి మారుతోందని ఆయన పేర్కొన్నారు.

March 4, 2026 / 06:25 PM IST

రామాయపట్నం పోర్టు నిర్వాసితుల కాలనీ ప్రారంభం

NLR: రామాయపట్నం పోర్టు నిర్వాసితుల కోసం గుడ్లూరు మండలం కర్లపాలెంలో R&R కాలనీ నిర్మించారు. దీనిని మంత్రి BC జనార్ధన్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. రూ.40 కోట్లతో ఈ కాలనీ నిర్మాణం జరిగింది. పోర్టు నిర్వాసితులకు ఈ కాలనీలో పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, MLA ఇంటూరి నాగేశ్వరరావు, కలెక్టర్ రాజాబాబు తదితరులు పాల్గొన్నారు.

March 4, 2026 / 06:24 PM IST

కడపలో కల్తీ పాలు నివారణపై అవగాహన

కడప నగరంలోని డీఎల్టీసీ కాలేజీలో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ రామచంద్ర ఆధ్వర్యంలో కల్తీ పాలు, ఆహార పదార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యూరియా, డిటర్జెంట్ వంటి రసాయనాలతో పాలు కల్తీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కల్తీ ఆహార పదార్థాల తయారీపై సమాచారం ఉంటే 08645-2410295, 9440379755 నంబర్లకు తెలియజేయాలని అధికారులు కోరారు.

March 4, 2026 / 06:22 PM IST

శ్రామిక భవనం పూర్తి చేయాలి: భరత్

E.G: రాజమండ్రి క్వారీ ఏరియాలో నిర్మాణంలో ఉన్న శ్రామిక భవనాన్ని వెంటనే పూర్తి చేసి కార్మికులకు అప్పగించాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ హెచ్చరించారు. బుధవారం గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ కార్యవర్గ ప్రమాణస్వీకారంలో పాల్గొన్న ఆయన, గత ప్రభుత్వంలో 1800 గజాల స్థలం, రూ.1 కోటి నిధులు మంజూరైనా పనులు పూర్తికాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

March 4, 2026 / 06:20 PM IST