ASR: హుకుంపేట మండలం బోడిగట్టులో బుధవారం రైతు సాధికార సంస్థ ఏపీసీఎన్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాబూరావు నాయుడు పర్యటించారు. అక్కడ నిర్వహిస్తున్న అటవీ చైతన్య ద్రావణం ప్రయోగ క్షేత్రం పరిశీలించారు. ఈ ద్రావణం వినియోగంతో పంటల పెరుగుదల, నేల సారవంతం, పెట్టుబడి ఖర్చు తగ్గుతుందని తెలిపారు. సహజ వ్యవసాయ పద్ధతుల్లో అటవీ ఆధారిత ద్రావణాల ప్రాముఖ్యత ఎంతో ఉందన్నారు.