CTR: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి హుండీని ఈనెల 26వ తేదీన లెక్కించనున్నట్లు ఆలయ ఈవో పెంచల కిశోర్ తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ అధికారుల పర్యవేక్షణలో పారదర్శకంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. హుండీ లెక్కింపు ప్రక్రియలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.