• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జిల్లాలో జేబుదొంగలు అరెస్ట్

GNTR: తాడేపల్లి మండలం ఉండవల్లిలో జేబుదొంగతనాలకు పాల్పడుతున్న విష్ణు, విక్టర్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దివ్యాంగ శక్తి పథకం బస్సు యాత్రలో పలువురి జేబులు కత్తిరించినట్లు గుర్తించారు. నిందితులపై ఉమ్మడి గుంటూరు జిల్లాలో 8 కేసులు, రాష్ట్రవ్యాప్తంగా మరో 6 కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రూ.75,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వీరేంద్ర తెలిపారు.

March 27, 2026 / 11:29 AM IST

డోన్ న్యాయవాది వ్యాఖ్యలపై వివాదం

NDL: డోన్ న్యాయవాది కృష్ణప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పోలీసులను అవమానించేలా మాట్లాడారనే ఆరోపణలపై ప్రజలు, సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇవాళ MRPS జిల్లా ఉపాధ్యక్షుడు నాగన్న స్పందిస్తూ.. బాధ్యతాయుత వృత్తిలో ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని వెల్లడించారు. పోలీసులు ప్రజల రక్షణకే ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

March 27, 2026 / 11:22 AM IST

సీఎంను కలిసిన టీడీపీ నేత

KRNL: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకుడిని జిల్లా మాజీ అధ్యక్షులు తిక్కారెడ్డి అమరావతిలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా నెలకొన్న వివిధ సమస్యలపై చర్చించారు. జిల్లాలోని రాజకీయ పరిస్థితుల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల గురించి చర్చించారు.

March 27, 2026 / 11:19 AM IST

లేవిడిలో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం పీ.లేవిడి గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శ్రీరాములవారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు.

March 27, 2026 / 11:16 AM IST

ప్రారంభమైన రాములోరి కళ్యాణం

PLD: రొంపిచర్లలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎస్బీఐ బ్యాంక్ సమీపంలోని రామాలయం వద్ద సీతారామ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. గ్రామస్థులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. సీతారామ స్వామి వారి ఉత్సవ విగ్రహాలను గ్రామంలో ఊరేగింపుగా కళ్యాణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

March 27, 2026 / 11:14 AM IST

ప్రశాంతంగా శ్రీరామనవమి జరుపుకోవాలి: ఎస్పీ

తిరుపతి జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవాలని ఎస్పీ సుబ్బరాయుడు సూచించారు. జిల్లా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబ వ్యవస్థ, సత్యం, ధర్మానికి రామాయణం ఆదర్శమన్నారు. వేడుకల్లో ఎటువంటి ఇబ్బంది తలెత్తినా వెంటనే 112కు సమాచారం ఇవ్వాలని కోరారు.

March 27, 2026 / 11:14 AM IST

తిరుమల శ్రీవారి సేవలో ఎమ్మెల్యే

TPT: సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్ కనకమేడల రవీంద్ర కుమార్, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చారు. వేర్వేరుగా శుక్రవారం వేకువజామున శ్రీవారిని అభిషేక సేవలో దర్శించుకున్నారు. అనంతరం వీరికి ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనంతో తీర్థప్రసాదాలను అందజేశారు.

March 27, 2026 / 11:13 AM IST

సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న మంత్రి

అన్నమయ్య:  శ్రీ రామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాల సమర్పణ కోసం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తమ స్వగ్రామం బోరెడ్డిగారిపల్లె నుంచి శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి భక్తిశ్రద్ధలతో బయలుదేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ సీతారాముల ఆశీస్సులు లభించి ప్రజలు సుఖశాంతులతో జీవించాలని కోరారు.

March 27, 2026 / 11:10 AM IST

బుచ్చిరెడ్డిపాలెంలో వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం

NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా రెండవ రోజు ధ్వజారోహణ కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ధ్వజపటం ఎగరవేసి సకల దేవతలను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరావు, ఎస్సై సంతోష్ రెడ్డి సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

March 27, 2026 / 11:10 AM IST

జాలారిపేటలో మంచినీటి బోరు ప్రారంభం

AKP: పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం శివారు జాలరిపేటలో మంచినీటి బోరును గ్రామ సర్పంచ్ చింతకాయల సుజాత, ఎంపీటీసీ అర్జిల్లి దేవి శుక్రవారం ప్రారంభించారు. తాగునీటి ఎద్దడి నివారణ కోసం మండల పరిషత్ నిధి నుంచి మంచినీటి బోరు వేయించినట్లు పేర్కొన్నారు. వేసవికాలం దృష్ట్యా తాగునీటిని పొదుపుగా వాడాలని సూచించారు.

March 27, 2026 / 11:09 AM IST

చెన్నై వెళ్తున్నారా.. జాగ్రత్త..?

CTR: చిత్తూరు, తిరుపతి జిల్లాలకు తమిళనాడు సరిహద్దుగా ఉంటుంది. మనవాళ్లు చాలామంది బంగారు ఆభరణాలు, పట్టుచీరలు, ఇతర వ్యాపారాలు, ఆసుపత్రుల నిమిత్తం చెన్నై, వేలూరు, కంచి తదితర ప్రాంతాలకు వెళ్తుంటారు. ప్రస్తుతం అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడంతో రూ.50వేలకు పైగా నగదు, విలువైన ఆభరణాలు తీసుకెళ్తే తగిన పేపర్లు చూపించాలి. లేకపోతే సీజ్ చేస్తారు.

March 27, 2026 / 11:05 AM IST

అడవిలో అపురూప రామాలయం

E.G: సీతానగరం, పురోషోతగ్రామల సమీపంలో పురాతన శ్రీసీతారామలక్ష్మణ ఆలయం ఉంది. అడవుల మధ్య కొండలపై ఉన్న ఈ ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడి కోనేరులో నీరు ఎంతో తియ్యగా ఉండటం విశేషం. పూర్వం ఇక్కడ సీతారాములు నివసించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయాలన్న ప్రభుత్వం మరింత అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు.

March 27, 2026 / 11:00 AM IST

గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వపై కఠిన చర్యలు: జేసీ

ATP: జిల్లాలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరా, వినియోగదారుల బుకింగ్‌లపై జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ సమీక్ష నిర్వహించారు. చమురు కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి సిలిండర్ల సరఫరాలో బ్యాక్‌లాగ్ లేకుండా చూడాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటికే టాస్క్‌ఫోర్స్ బృందాలు దాడులు నిర్వహించి, అక్రమంగా నిల్వ ఉంచిన 204 సిలిండర్లను సీజ్ చేసి 16 కేసులు నమోదు చేశారని అన్నారు.

March 27, 2026 / 11:00 AM IST

భద్రాచలం నుంచి అమలాపురంకు ప్రత్యేక బస్సులు: DM

కోనసీమ: శ్రీరామనవమి సందర్భంగా అమలాపురం ఆర్టీసీ బస్టాండ్ నుంచి భద్రాచలంకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ శర్మ తెలిపారు. కళ్యాణం ముగిసిన తర్వాత భద్రాచలం నుంచి మధ్యాహ్నం 1:30 నుంచి రాత్రి 8:30 గంటల వరకు వివిధ సమయాలలో పలు బస్సులు నడుస్తాయని తెలిపారు. ఇందులో ఇంద్ర ఏసి సర్వీస్ బస్సు కూడా అందుబాటులో ఉంటుందన్నారు.

March 27, 2026 / 11:00 AM IST

బిడ్డను బతికించాలని ప్రభుత్వాన్నికోరిన తల్లిదండ్రులు

VZM: రాజాం (M) బొద్దాం గ్రామానికి చెందిన 15 ఏళ్ల చిన్నారి పత్తిరి వైష్ణవి బోన్ మారోతో ఆసుపత్రి పాలైంది. పదో తరగతి పరీక్షలు రాయాల్సిన వైష్ణవి ప్రస్తుతం ఆసుపత్రిలో ఉంది. చికిత్స నిమిత్తం రూ. 20 లక్షలు అవసరమని వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు ఇద్దరూ రోజువారి కూలీలు కావడంతో ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

March 27, 2026 / 10:56 AM IST