CTR: పెనుమూరు మండలంలో ఓ యువకుడు గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల మేరకు.. గుట్టకింద పల్లికి చెందిన రవి కుమారుడు దిలీప్ (26) గతంలో యాక్సిడెంట్ జరిగింది. దవడ గాయమై కోలుకోలేకపోతున్నాడు. ఇటీవల వ్యాపారాలు చేస్తే నష్టపోయాడు. ఈక్రమంలో జీవితంపై విరక్తి చెంది అమ్మమ్మ ఊరైన అట్టలవారిపల్లిలో ఉరేసుకున్నాడు.ఎస్ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేశారు.
NDL: పాణ్యం గ్రామానికి చెందిన మంగలి వెంకటసుబ్బయ్య (62) మృతదేహం శుక్రవారం గ్రామ శివారులోని చెరువులో లభ్యమైంది. నీటిలో శవం తేలుతుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు రామసుబ్బయ్య కుమారుడిగా గుర్తించారు.
CTR: జీడీనెల్లూరు మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు శనివారం పంపిణీ చేయునట్లు ఎంపీడీవో మనోహర్ గౌడ్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒకటో తేదీ ఆదివారం కావడంతో ముందు రోజే పంపిణీ చేస్తామన్నారు. మండలంలో 10,713 మంది లబ్ధిదారులకు రూ.46,01,4500 అందిస్తామన్నారు.
నెల్లూరు: వైసీపీ ప్రభుత్వంలో విధ్వంసం, అవినీతి తప్ప అభివృద్ధి శూన్యమని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ విమర్శించారు. కోవూరులోని జనసేన కార్యాలయంలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్వీర్యంతో పాటు, గంజాయి రవాణా చేసిందన్పనారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు.
కృష్ణా: మోపిదేవి మండలం కే.కొత్తపాలెంలో శుక్రవారం నూతన సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. గౌడపాలెంలో రూ.10.65 లక్షలు అంచనాతో 165 మీటర్లు పొడవైన్ అంతర్గత రహదారి నిర్మాణ పనులను సర్పంచ్ కొక్కిలిగడ్డ మాధవి శుక్రవారం ప్రారంభించారు. నాయకులు రావి రత్నగిరి, చందన రంగారావు, నాగాయతిప్ప సొసైటీ ఛైర్మన్ బల్లా సీతారామ ప్రసాద్, బాల కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
KRNL: ఏప్రిల్ 1 నుంచి ‘వికసిత్ భారత్ జి రామ్ జీ’ (VBG Ram Ji) నూతన చట్టం అమల్లోకి వస్తుందని పెద్దకడబూరు APO చంద్రశేఖర్ తెలిపారు. ఇవాళ MPDO కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. పనిదినాలను 100 నుంచి 125 రోజులకు పెంచినట్లు పేర్కొన్నారు. వేతనాల చెల్లింపు ఆలస్యమైతే వడ్డీతో కలిపి ఇస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు లక్ష్మన్న ఉన్నారు.
GNTR: వైద్య రంగంలో మాఫియా ఆగడాలకు వ్యతిరేకంగా రేపు డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టనున్నట్లు సీపీఐ నేతలు అరుణ్, అంజిబాబు తెలిపారు. శుక్రవారం కొత్తపేటలో మాట్లాడుతూ..పేదలపై వైద్య భారం పెరిగిపోయిందని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో మాఫియా ఆగడాలు మితిమీరాయని విమర్శించారు. కావున మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా రేపు ప్రజా సంఘాలు తమ గళాన్ని వినిపించాలని కోరారు.
ATP: రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ కోటేశ్వరరావుతో ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వడ్డే వెంకట్ తాడేపల్లిలో భేటీ అయ్యారు. జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధి, భవనాల మరమ్మతులు, నూతన పుస్తకాల కొనుగోలుకు నిధులు కేటాయించాలని కోరారు. పారదర్శకత కోసం సిబ్బందికి ఫేస్ రికగ్నైజేషన్ హాజరు విధానం అమలు చేయాలని ప్రతిపాదించారు.
KRNL: ఆదోని డివిజన్లో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయని DSF నేతలు ఇవాళ ఆరోపించారు. ప్రెస్మీట్లో రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ్, రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ.. తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిబంధనలు పాటించకపోతే గుర్తింపు రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.
అన్నమయ్య: ప్రజా సమస్యల పరిష్కారానికి ” ప్రజాదర్బార్” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు TDP పార్టీ రాజంపేట ఇన్ఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పేర్కొన్నారు. శుక్రవారం రాజంపేటలోని స్థానిక పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. చమర్తి మాట్లాడుతూ.. ప్రజాదర్బార్లో వచ్చిన ఫిర్యాదుల సమస్యలను ఆయా శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.
BPT: అధికారులు విధులకు పరిమితం కాకుండా నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో దివ్యాంగులు, ఎస్టీల ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘బాపట్ల సేవా సేతు’తో ప్రజల వద్దకే పాలన తెస్తున్నామన్నారు. తాగునీటి ఎద్దడిపై యాక్షన్ ప్లాన్, వృద్ధుల హక్కుల కరపత్రాలు విడుదల చేశారు.
ASR: రాకోట-బూసిబంధ గ్రామాల రహదారి దుస్థితి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. గత ప్రభుత్వంలో ప్రారంభమైన రహదారి పనులు గ్రావెల్ దశలోనే ఆగిపోవడంతో రహదారి గోతులమయంగా మారింది. స్వల్ప వర్షానికే బురదగా మారి ప్రయాణం ప్రాణాపాయంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
AKP: నాతవరంలో శుక్రవారం అడవిరాజులబాబు పండుగను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎస్సై తారకేశ్వరరావు కూడా రాజుబాబులను దర్శించుకున్నారు. సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనునట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
SKLM: నగర మున్సిపాలిటీ ఇంఛార్జ్ కమిషనర్గా పల్లి నల్లన్నయ్యను శుక్రవారం ప్రభుత్వం నియమించింది. కొద్ది రోజుల పాటు ఆయన ఇంచార్జ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. నేటి మధ్యాహ్నం ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. గతంలో కూడా శ్రీకాకుళం కమిషనర్ గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఈయన ప్రస్తుతం జీవీఎంసీ లో విధులు నిర్వర్తిస్తున్నారు.
SKLM: నగర మున్సిపాలిటీ ఇంఛార్జ్ కమిషనర్గా పల్లి నల్లన్నయ్యను శుక్రవారం ప్రభుత్వం నియమించింది. కొద్ది రోజుల పాటు ఆయన ఇంఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. నేటి మధ్యాహ్నం ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. గతంలో కూడా శ్రీకాకుళం కమిషనర్గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఈయన ప్రస్తుతం జీవీఎంసీలో విధులు నిర్వర్తిస్తున్నారు.