VZM: ఈనెల 19న శ్రీ మన్నార్ రాజగోపాలస్వామి దేవాలయంలో నిర్వహించనున్న ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించాలని DRO సి.హెచ్. సత్తిబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్లో సమీక్ష నిర్వహించారు. నాదస్వరం, వేదపండితుల ఆశీర్వచనం, పంచాంగ శ్రవణం, పండిత సత్కారం, ప్రసాదాల పంపిణీ వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు.
PLD: దుర్గి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, మౌలిక సదుపాయాలు, వంటశాల, మధ్యాహ్న భోజన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, వారి సమస్యలను తెలుసుకున్నారు.
E.G: రాజమండ్రి నగర కమిషనర్ రాహుల్ మీనాను రూడా ఛైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దివాన్ చెరువులో పలు అభివృద్ధి పనులు కోసం కమిషనర్తో చర్చించారు. స్థానిక ప్రజల అవసరాల మేరకు మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దివాన్ చెరువు గ్రామస్తులు పాల్గొన్నారు.
కోనసీమ: అమలాపురం మున్సిపల్ కార్యాలయంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని బీజేపీ నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పీ. శ్రీనివాస్ పారిశుద్ధ్య కార్మికులను శాలువాలతో సత్కరించి, మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ పాల్గొన్నారు.
W.G: షాపులు, వాణిజ్య సంస్థలు 24 గంటలు తెరిచి ఉంచాలని కూటమి ప్రభుత్వం ఇచ్చిన జీవోని రద్దు చేయాలని CITU జిల్లా కార్యదర్శి పీ.వీ. ప్రతాప్ డిమాండ్ చేశారు. సోమవారం తణుకు గణేష్ సెంటర్ వద్ద CITU ఆధ్వర్యంలో షాపులు, వాణిజ్య సంస్థలు 24 గంటలు తెరిచి ఉండాలనే జీవో నం.5ని వ్యతిరేకంగా నిరసన ధర్నా చేశారు. కార్మికుల హక్కుల కాలరాస్తున్న జీవోని రద్దు చేయాలన్నారు.
KDP: నంద్యాల మండల పరిషత్ కార్యాలయం సమావేశ భవనంలో మంగళవారం పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై ఎంపీటీసీలకు, గ్రామ వార్డు మెంబర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. నంద్యాల ఎంపీడీవో సుగుణశ్రీ, ఎంపీపీ శెట్టి ప్రభాకర్లు మాట్లాడుతూ.. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై ప్రజా ప్రతినిధులకు అవగాహన అవసరమన్నారు.
CTR: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కెమిస్ట్రీ -1 పరీక్ష మంగళవారం వెదురుకుప్పం (M) చవటగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రశాంతంగా జరిగింది. ప్రిన్సిపల్ నిర్మలా కుమారి మాట్లాడుతూ.. 143 మంది విద్యార్థులలో 139 మంది హాజరయ్యారని, నలుగురు గైర్హాజరైనట్లు తెలిపారు. ఎస్ఐ నవీన్ బాబు సిబ్బందితో కలిసి భద్రతా చర్యలు చేపట్టారు.
KRNL: సి. బెళగల్ మండలం గుండ్రేవుల గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ బజారిగౌడ్ (75) అనారోగ్యంతో మంగళవారం మరణించారు. కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని సందర్శించి, నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కూటమి టీడీపీ నాయకులు పాల్గొని అంత్యక్రియలు నిర్వహించారు.
ELR: జంగారెడ్డి గూడెం ట్రాన్స్పోర్ట్ ఆఫీసుల్లో మంగవారం పోలీసులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఏఎస్పీ సుస్మితా రామనాథన్ ఆధ్వర్యంలో ఈ సోదాలు నిర్వహించారు. ప్రతి ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో లోపల, వెలుపల తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వీటి దృశ్యాలను కనీసం 30 రోజుల పాటు భద్ర పరచాలన్నారు. అనుమానాస్పద పార్సిల్లు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
KDP: చెన్నూరు జిల్లా పరిషత్ ప్రాథమిక బాలుర ఉన్నత పాఠశాలలో కమలాపురం ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణ చైతన్యరెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులతో కూడా మాట్లాడి పాఠశాల పరిస్థితులపై వివరాలు సేకరించారు. విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
అన్నమయ్య: చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్వగృహంలో మంగళవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు, వినతులను స్వయంగా విని తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు ప్రజలు పాల్గొన్నారు.
VZM: శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈనెల 19న (గురువారం) ఉగాది పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. స్థానిక శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి ఆలయంలో జిల్లా స్థాయి ఉగాది వేడుకలు నిర్వహిస్తామన్నారు. ఇందుకు కావలసిన ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
VZM: గరివిడి మండలం ఎం.దుగ్గివలస పాఠశాలను మంగళవారం ఎమ్మెల్యే కళా వెంకటరావు తనిఖీ చేశారు. ఇందులో భాగంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని పరిశీలించారు. సిబ్బందిని భోజన నాణ్యత, పరిశుభ్రత, వంట విధానం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
SKLM: గ్రామాల అభివృద్ధికి వార్డు సభ్యులు పునాదులుగా నిలవాలని ఎంపీపీ దీప అన్నారు. బూర్జ ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం వార్డు సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామాల అభివృద్ధికి వార్డ్ మెంబర్లు కీలక పాత్ర పోషించాలని ఎంపీపీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తిరుపతిరావు, ఏపీ మార్క్ఫెడ్ డైరెక్టర్ రామకృష్ణ నాయుడు, వార్డ్ మెంబర్లు పాల్గొన్నారు.
బాపట్ల జిల్లాలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ అందజేశారు. ఫిబ్రవరి 2026లో సుమారు రూ. 40.20 లక్షల విలువైన 201 మొబైల్ ఫోన్లను ప్రత్యేక బృందం తిరిగి స్వాధీనం చేసుకుంది. అలాగే గత మూడు నెలల్లో మొత్తం రూ.1.61 కోట్ల విలువైన 806 ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు.