• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి’

E.G: APSRTC ఎంప్లాయిస్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జీ. చిరంజీవి విజయవాడ జోనల్ అధ్యక్షుడిగా ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా RJY డిపో ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు ఆయనను దుశ్శాలువాతో ఘనంగా సన్మానించి, మెమోంటో అందజేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని ఈ సందర్భంగా పలువురు కోరారు.

March 2, 2026 / 09:04 AM IST

నేటి నుంచి ఓపెన్ పరీక్షలు

నెల్లూరు జిల్లాలో నేటి నుంచి ఓపెన్ పరీక్షలు ప్రారంభిస్తున్నట్లు డీఈవో ఆర్. బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు నేటి నుంచి ఈనెల 13వ తేదీ వరకు, 10వ తరగతి విద్యార్థులకు 16 నుంచి 28వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఇంటర్‌కు 12, 10వ తరగతికి 15 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

March 2, 2026 / 09:04 AM IST

ఆలయంలో ప్రదోష కాల అభిషేకాలు.. నేడు గిరి ప్రదక్షిణ

కృష్ణా: యనమలకుదురు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో త్రయోదశి సందర్భంగా ప్రదోష కాల అభిషేకాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహానందీశ్వర స్వామివారికి జరిగిన ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాగా, ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు స్వామివారి గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.

March 2, 2026 / 09:03 AM IST

‘బాణసంచా తయారీ కేంద్రాలపై నిఘా పెట్టండి’

KKD: పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని బాణాసంచా తయారీ కేంద్రాలపై నిరంతరం నిఘా ఉంచాలని కాకినాడ MP తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆదేశించారు. ఆదివారం తహసీల్దార్లు, పోలీస్, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని సూచించారు.

March 2, 2026 / 09:02 AM IST

ఎర్రగొండపాలెం నూతన ఎస్సైగా దేవకుమార్

ప్రకాశం: ఎర్రగొండపాలెం మండల పోలీస్ స్టేషన్ నూతన SIగా దేవకుమార్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన SI చౌడయ్య జిల్లా VRకు బదిలీ కావడంతో ప్రకాశం జిల్లా SP హర్షవర్ధన్ రాజు దేవకుమార్ను ఇక్కడకు నియమించారు. బాధ్యతలు చేపట్టిన నూతన SIకి స్టేషన్ సిబ్బంది ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఎస్సై పేర్కొన్నారు.

March 2, 2026 / 08:56 AM IST

నేటి నుంచి ముఖ ఆధారిత హాజరు

AKP: ఉపాధి హామీ పథకం వేతనదారులకు సోమవారం నుంచి ముఖ ఆధారిత హాజరు అమలులోకి వచ్చింది. ఎస్ రాయవరం మండలం దార్లపూడిలో వేతనదారులకు ముఖ ఆధారిత హాజరు నమోదు చేశారు. మండలంలో పలు గ్రామాల్లో పనిచేస్తున్న 2,200 మందికి ముఖ ఆధారిత హాజరు వేసినట్లు ఏపీఓ ఎరకయ్య తెలిపారు. బినామీ మస్తర్లలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చిందన్నారు.

March 2, 2026 / 08:47 AM IST

జామి యల్లారమ్మ పండగలో పాల్గొన్న ఎమ్మెల్యే

SKLM: జామి యల్లారమ్మ పండగలో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరను అత్యంత వైభవంగా నిర్వహించిన ఉత్సవ కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే అభినందిస్తూ,వారి సేవలను కొనియాడారు. అనంతరం అమ్మవారి ఆలయం ప్రాంగణంలో సుమారు 10 వేల మంది భక్తులకోసం ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమంలో స్వయంగా పాల్గొని వడ్డించారు.

March 2, 2026 / 08:47 AM IST

మహిళా భద్రతపై అవగాహన ర్యాలీ

GNTR: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం గుంటూరు ఈస్ట్ సబ్-డివిజన్ పరిధిలో మహిళా భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ.. సమాజంలో మహిళలకు గౌరవం ఇవ్వడం అందరి బాధ్యతని, అన్యాయం జరిగితే ధైర్యంగా స్పందించి పోలీసుల ‘శక్తి టీమ్’ సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

March 2, 2026 / 08:46 AM IST

కొండూరులో నేరాలపై గ్రామసభ

SS: జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆదేశాలతో, డీఎస్పీ కేవీ మహేష్ పర్యవేక్షణలో అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. హిందూపురం రూరల్ సీఐ జనార్ధన్ నేతృత్వంలో లేపాక్షి పరిధి కొండూరు గ్రామంలో ఎస్సై. నరేంద్ర, సిబ్బందితో గ్రామసభ నిర్వహించారు. ఆస్తి, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు, అనుమానాస్పద కార్యకలాపాలపై అవగాహన కల్పించారు.

March 2, 2026 / 08:45 AM IST

పొదిలిలో విస్తృతంగా వాహన తనిఖీలు

ప్రకాశం: పొదిలిలోని పలు ప్రాంతాల్లో SI రాజేశ్ ఆధ్వర్యంలో ఆదివారం పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ముఖ్య డ్రైవ్ చేపట్టి వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, హెల్మెట్ వినియోగంపై ఆరా తీశారు. ట్రిపుల్ రైడింగ్, మద్యం సేవించి వాహనం నడపడం వంటి ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని SI హెచ్చరించారు.

March 2, 2026 / 08:44 AM IST

తేనెటీగల దాడి .. 20 మందికి గాయాలు

CTR: వి.కోట మండల కేంద్రంలో ఆదివారం తేనెటీగల దాడిలో 20 మంది గాయపడ్డారు. వి.కోటకు చెందిన వెంకటరమణ కుటుంబ సభ్యులు స్థానిక మునీశ్వరస్వామి ఆలయం వద్ద మునిదేవర కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో చెట్టుపై ఉన్న తేనెటీగలు అగరబత్తుల పొగకు ఒక్కసారిగా రెచ్చిపోయి అక్కడున్న వారిపై దాడి చేశాయి. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

March 2, 2026 / 08:44 AM IST

గురుకుల పాఠశాలలో ప్రవేశ పరీక్షకు 214మంది హాజరు

W.G: తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతి, జూనియర్ ఇంటర్, ఐఐటీ-నీట్ తర్ఫీదు ఇచ్చే కళాశాలలో ప్రవేశానికి ఆదివారం పరీక్ష నిర్వహించారు. ఐదవ తరగతికి 66మందికి గాను 49 మంది, జూనియర్ ఇంటర్ లో 95 మందికి గాను 89, ఐఐటీ-నీట్ 81మందికి గాను 76మంది మొత్తం 214మంది హాజరైనట్టు ప్రిన్సిపల్ ఎం. దుర్గారావు వివరించారు.

March 2, 2026 / 08:42 AM IST

పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా జాయింట్ సెక్రటరీగా మున్నీర్

కోనసీమ: జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా మామిడికుదురు మొగలికుదురుకు చెందిన అబ్దుల్ మున్నీర్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అమలాపురంలోని పెన్షనర్స్ భవనంలో ఆదివారం జరిగిన ఈ సమావేశంలో తనను జాయింట్ సెక్రటరీగా ఎన్నుకొన్నట్లు ఆయన తెలిపారు. సంఘం అభివృద్ధికి పెన్షనర్స్ సంక్షేమం కొరకు తన వంతు కృషి చేస్తానని మున్నీర్ పేర్కొన్నారు.

March 2, 2026 / 08:40 AM IST

ప్రత్యేక అలంకరణతో పాతపట్నం నీలమని అమ్మవారు

SKLM: నియోజకవర్గ కేంద్రం పాతపట్నం ప్రధాన రహదారి పక్కన కొలువైయున్న శ్రీ పాతపట్నం నీలమణి అమ్మవారు చతుర్దశి సోమవారం ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించేందుకు వందలాదిమంది భక్తులు తెల్లవారుజామున దర్శించి ప్రత్యేక పూజలు చేపట్టారు. దేవదాయ శాఖ పరిశీలనలో కార్యక్రమాలు జరిగాయి.

March 2, 2026 / 08:40 AM IST

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

TPT: తిరుపతి కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అధికారులు అర్జీలు స్వీకరించి, ప్రజల సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. జిల్లా వాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

March 2, 2026 / 08:38 AM IST