SKLM: పాతపట్నం మండలం కాగువాడ మహాత్మా జ్యోతిబాపులే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందిస్తున్న మెనూ, విద్య, వసతిపై ఆరా తీశారు. సిబ్బంది మెనూలో పెరుగుకు బదులుగా మజ్జిగ పెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు అడిగినంత భోజనం వడ్డించాలని సూచించారు.
W.G: పోడూరు మండలం చింతలగరువు పాఠశాలలో రాయప్రోలు సుబ్బారావు జయంతిని హెచ్.ఎం కొల్లాబత్తుల సూర్య కుమార్ నేతృత్వంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సుబ్బారావు నవ్యకవితా పితామహుడుగా పేరు గాంచారు అన్నారు. ఈ సందర్బంగా రాయప్రోలు సుబ్బారావు రచించిన ‘ఏ దేశమేగినా’ అభినయ గేయాన్ని విద్యార్థులు ప్రదర్శించి నివాళులర్పించారు.
కోనసీమ: అయినవిల్లి(మం) వీరవల్లిపాలెం చివర కోటిపల్లి రేవు వద్ద అంబాజీపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పశువైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పశుసంవర్ధక రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిదన్నారు. రైతుల జీవనోపాధికి పశువుల ఆరోగ్యం ఎంతో ముఖ్యమైనదని పేర్కొన్నారు.
బాపట్ల జిల్లా రేపల్లె మండలం చెన్నుపల్లివారిపాలెంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు పైప్లైన్ పనులను టీడీపీ నేత అనగాని శివప్రసాద్ ప్రారంభించారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ASR: ప్రమాదాలకు గురవుతున్న కాఫీ, మిరియాల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఇన్సూరెన్స్ కల్పించాలని జాతీయ కాఫీ రైతు సంఘం నాయకులు జి చినబాబు డిమాండ్ చేశారు. మంగళవారం అరకులోయలో ఆయన మాట్లాడుతూ.. మిరియాల కోతకు తీసుకువెళ్తూన్న నిచ్చెనకు విద్యుత్ వైర్లు తగలడంతో మృతి చెందిన కిల్లో బలరాం(49) కుంటుంబానికి 10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని అన్నారు.
అనంతపురం నగర అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంత్ కుమార్ నుంచి అన్ని శాఖల అధికారులతో కలిసి పెండింగ్ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నగరంలో చేపట్టవలసిన మౌలిక సదుపాయాల కల్పన, సుందరీకరణ పనులపై సుదీర్ఘంగా చర్చించారు.
E.G: రాజమండ్రి రూరల్(మం) బొమ్మూరులోని వైసీపీ కార్యాలయం వద్ద జిల్లా వైసీపీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మంగళవారం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని ముఖ్య అతిథులుగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వజ్ర భాస్కర్ రెడ్డి విచ్చేశారు. ఈ మేరకు డిజిటలైజేషన్ ప్రక్రియ గురించి, దాని విధి విధానాలు పూర్తి వివరించారు.
KRNL: పెద్దకడబూరు మండలంలోని చిన్నతుంబళం సొసైటీ ఆవరణలో మంగళవారం మంత్రాలయం టీడీపీ ఇంఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు కంటి ఆసుపత్రి వైద్యులు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షులు గవిగట్టు మల్లికార్జున, సొసైటీ ఛైర్మన్ నరసప్ప, సీఈవో నరసింహమూర్తి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. వైద్యులు అనూష రోగులకు కంటి పరీక్షలు నిర్వహించారు.
KDP: రాష్ట్ర ప్రభుత్వం డీఆర్వోలను బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కడప డీఆర్వోగా ఉన్న విశ్వేశ్వర నాయుడు విశాఖపట్నంకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అనంతపురం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జునుడు రానున్నారు. అలాగే ప్రభుత్వం ఆర్డీవోలను కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కడప ఆర్డీవోగా మురళి రానున్నారు.
ASR: పాడేరు మండలం సుకూరుపుట్టు, డి.గొందూరు గ్రామాల్లో మంగళవారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొని గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పశు సంరక్షణ వ్యవసాయానికి అనుబంధమైందని, పశుసంపద రైతుకు ముఖ్య ఆధారమని తెలిపారు.
NTR: నందిగామలో ట్రాఫిక్ పోలీసులు మంగళవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్ లేకుండా, లైసెన్స్ లేకుండా, త్రిబుల్ రైడింగ్ చేస్తూ అధిక వేగంతో వెళ్తున్న విద్యార్థులను ఆపి ట్రాఫిక్ ఎస్సై నరేష్ కౌన్సెలింగ్ ఇచ్చారు. పరీక్షల అనంతరం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు. తల్లిదండ్రుల కష్టం గుర్తుంచుకుని బాధ్యతగా ఉండాలని సూచించారు.
AKP: మహిళలు స్వయం సమృద్ధి సాధించి వారి కాళ్ళ మీద వారు నిలబడాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ లక్ష్మి సూచించారు. మంగళవారం పరవాడ మండలం మంత్రి పాలెం గ్రామంలో మిషన్ శక్తి ప్రోగ్రాం నిర్వహించారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ వారి కుటుంబాలను ముందుకు నడిపించాలన్నారు.
PPM: రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. సాలూరు మండలంలోని మామిడిపల్లి గ్రామంలో రైతన్న మీ కోసం కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికీ వెళ్లి అన్నదాత సుఖీభవ పథకాన్ని వివరించారు. వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకొని రైతులు ఆర్థికంగా ఎదగాలని సూచించారు.
SS: నల్లమాడ(మం) సుబ్బరాయనపల్లి మినీ అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులకు అందుతున్న పౌష్టికాహార నాణ్యతను స్వయంగా రుచి చూసి పరిశీలించారు. విద్యార్థులకు రుచికరమైన భోజనంతో పాటు నాణ్యమైన విద్యను అందించాలని అంగన్వాడీ కార్యకర్త విజయకుమారికి సూచించారు.
ATP: సింగనమల(మం) సకలంచెరువులోని ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే బండారు శ్రావణి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు, బోధనా విధానం, మధ్యాహ్న భోజన పథకం అమలు, తదితర అంశాలను పరిశీలించారు. ఎమ్మెల్యే కాసేపు టీచర్గా మారి విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పారు. పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలన్నారు.