ASR: ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియంను త్వరితగతిన పూర్తి చేయాలని ఐటీడీఏ పీవో శ్రీపూజ అధికారులను ఆదేశించారు. గురువారం చింతపల్లి మండలం లంబసింగిలో నిర్మాణంలో ఉన్న ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియంను సందర్శించారు. మ్యూజియం నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు. నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి కార్మికుల సంఖ్య పెంచాలన్నారు.
ELR: దెందులూరు మండలం కొవ్వలికి చెందిన భగవాన్ సత్తుపల్లి వెళ్లేందుకు గురువారం బస్ ఎక్కే సమయంలో జేబులో ఉన్న రూ.50,000 పోగొట్టుకున్నారు. వెంటనే ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, సిఐ అశోక్ కుమార్, ఎస్ఐ మధు వెంకట రాజా వెంటనే స్పందించి సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించారు. పోలీసుల వేగవంతమైన చర్యలతో కేవలం గంటలోనే నగదు తిరిగి అందజేశారు.
NTR: దేశీయ గోవుల నుంచి ఉత్పత్తి అయ్యే A2 పాలు, నెయ్యి ద్వారా పాడి రైతులు మంచి ఆదాయాన్ని పొందవచ్చని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. గురువారం వత్సవాయి మండలం, కంభంపాడులోని చేకూరి రమేష్బాబుకు చెందిన సాయిశ్రీనివాస గోశాలను సందర్శించారు. దేశీ జాతి ఆవుల నుంచి వచ్చే A2 పాలు, వాటితో తయారు చేసే నెయ్యి, పెరుగు వంటి పాల ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాం...
VZM: మహిళా సాధికారితకు సమానత్వమే పునాది అని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి పేర్కొన్నారు. 2026 సంవత్సరానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ పురస్కారాన్ని స్వప్న హైందవికి ఏపీ గ్రంథాలయ సంఘం జిల్లా శాఖ అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్, పెనుగొండ కామరాజుతో కలిసి ఓ స్కూల్లో ప్రదానం చేశారు. జననియే జగతికి ఆధారం పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
VZM: మహిళా సాధికారితకు సమానత్వమే పునాది అని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి పేర్కొన్నారు. 2026 సంవత్సరానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ పురస్కారాన్ని స్వప్న హైందవికి ఏపీ గ్రంథాలయ సంఘం జిల్లా శాఖ అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్, పెనుగొండ కామరాజుతో కలిసి ఓ స్కూల్లో ప్రదానం చేశారు. జననియే జగతికి ఆధారం పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
VZM: మహిళా సాధికారత వారోత్సవాల సందర్భంగా జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో మహిళల భద్రత, హక్కులపై ప్రత్యేక వీడియోలు ప్రదర్శించి అవగాహన కల్పిస్తున్నట్లు ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మహిళలపై జరిగే నేరాలను అరికట్టడంలో సమాజంలోని ప్రతి ఒక్కరి పాత్ర కీలకమన్నారు. అలాగే, విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే మహిళల పట్ల గౌరవ భావన పెంపొందించాలన్నారు.
AKP: సంపద కేంద్రాలను సక్రమంగా నిర్వహిస్తే పంచాయతీలకు ఆదాయం సమకూర్తుందని ఎస్ రాయవరం డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ అన్నారు. గురువారం కర్రివానిపాలెంలో సంపద కేంద్రాన్ని సందర్శించారు. ప్రతి గ్రామానికి స్వచ్ఛ రథం షెడ్యూల్ ప్రకారం వస్తుందన్నారు. స్వచ్చ రథం పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
కృష్ణా: ప్రసిద్ధ నాట్యకేంద్రంగా గుర్తింపు పొందిన కూచిపూడి గ్రామంను సాంస్కృతిక వారసత్వ సంపద కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలని కలెక్టర్ డి.కే. బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి మునిరత్నం నాయుడుతో కలిసి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
GNTR: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు బీఆర్ స్టేడియంలో మార్చి 7న భారీ అథ్లెటిక్స్ లీగ్ నిర్వహిస్తున్నట్లు మై భారత్ జిల్లా ఉపసంచాలకులు కిరణ్మయి దేవిరెడ్డి, డీఎస్డీఓ పఠాన్ ఆఫ్రోజ్ ఖాన్ గురువారం తెలిపారు. అండర్-13, 13-18, 18 ఏళ్లకు పైబడిన విభాగాల్లో 100, 200, 400 మీటర్ల పరుగుపందేలు నిర్వహించనున్నామని వారు వెల్లడించారు.
VZM: కొత్తవలస మండల సమాఖ్య కార్యాలయంలో ఏపీఎం వెంకటరమణ ఆద్వర్యంలో గ్రామ సంఘ జెండర్ కమిటీల శిక్షణ గురువారం నిర్వహించారు. లింగ అసమానతలు హింస, వివక్షపై అవగాహన ఉండాలని సూచించారు. సమాజంలో మహిళ ఆర్థిక సహకారాలు, తదితర అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య లక్ష్మీ ప్రసన్న, తదితరులు పాల్గొన్నారు.
KDP: సిద్ధవటం మండలం పి.కొత్తపల్లి PHC పరిధిలోని జంగాలపల్లి గ్రామంలో గురువారం డా. రంగ లక్ష్మీ ఆధ్వర్యంలో క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా CHO లక్ష్మీ నరసమ్మ మాట్లాడుతూ.. 2 వారాలు నుంచి,దగ్గు,జ్వరము,అలసట బరువు తగ్గడం రాత్రిపూట చెమటలు ఆకలి మందగించడం వంటి లక్షణాలు ఉన్న పేషెంట్లు స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో పరీక్షలు చేయించుకోవాలన్నారు.
ASR: పెరటికోళ్ల పెంపకం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి జయరాజు రైతులకు సూచించారు. గురువారం పాడేరు ఎంపీడీవో కార్యాలయంలో సమగ్ర పెరటికోళ్ల యూనిట్ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పెరటికోళ్ల యూనిట్లలో జీవ భద్రతా చర్యలు పాటించాలని సూచించారు. సరైన ఆహార నియమాలు అనుసరించి, కోళ్ల ఆరోగ్యం కాపాడుకోవడం ద్వారా అధిక ఆదాయం పొందవచ్చన్నారు.
W.G: ఉండి మండలంలో పలు గ్రామాల్లో కిసాన్ మోర్చా గ్రామ కమిటీలను ఏర్పాటు కోసం జిల్లా కిసాన్ మోర్చా ప్రెసిడెంట్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 5 గురు సభ్యులతో కమిటీలు వేశామన్నారు .మండల అధ్యక్షులు యర్రా విక్రమ్, సెక్రటరీ మడిచర్ల సూర్యప్రకాష్ ,డొక్కు వెంకటేశ్వర రావు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ELR: జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజి రుణ లక్ష్యాలను ఈనెలాఖులోగా పూర్తిగా సాధించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ గౌతమీ సమావేశపు హాలులో గురువారం స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజి, స్త్రీ నిధి రుణాలు, యూనిట్ల స్థాపన పలు అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఇంతవరకు 1242.48 కోట్ల రూపాయలు మంజూరు చేసారని అన్నారు.
ASR: భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా, సాంకేతికతతో రీ-సర్వే నిర్వహించి, ఎలాంటి తప్పులు లేకుండా సరిహద్దులను ఖరారు చేసినట్లు ఆర్డీవో లోకేశ్వరరావు తెలిపారు. గురువారం పాడేరు మండలంలో రైతులకు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. గతంలో ఉన్న పుస్తకాలతో పోలిస్తే, ఇప్పుడు అందజేస్తున్న రాజముద్ర కలిగిన పాసు పుస్తకాలు రైతులకు భూమిపై పూర్తి హక్కు, భద్రతను కల్పిస్తాయన్నారు.