W.G: 2029 ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే గంగమ్మ తల్లి జాతరలో పాట్టెళ్ల తలలు నరికినట్లు ప్రజలను నరికేస్తాం అంటున్న వైసీపీ నినాదాలు వారి రాక్షసత్వానికి పరాకాష్ట అని మంత్రి రామానాయుడు ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2019లో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అవినీతి పాలనతో దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని దివాలా తీసారని విమర్శించారు.
W.G: 2027లో జరగనున్న పుష్కరాల సన్నాహకలపై భీమవరంలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఘాట్ల అభివృద్ధి, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా, రహదారి మరమ్మతులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా తాత్కాలిక మరుగుదొడ్లు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
BPT: కారంచేడు-పర్చూరు రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కారంచేడు నుండి పర్చూరు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రైవేటు వాహనంలో చీరాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
ప్రకాశం జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి సోమవారం అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు, విద్యార్థులకు తాగునీరు, రవాణా సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
కృష్ణా: మిత్రుడు తీసుకెళ్లిన ఫోన్ తిరిగి అందకపోవడంతో ఏర్పడిన మానసిక ఒత్తిడి ఓ యువకుడి ప్రాణాలను తీసింది. పోలీసుల సమాచారం మేరకు NTR (D) చందర్లపాడు(M) చింతలపాడుకి చెందిన బత్తుల నరసింహారావు (19) కొంతకాలంగా పునాదిపాడులో అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నాడు. ఇటీవల వణుకూరు చెందిన స్నేహితుడు అతని ఫోన్ తీసుకెళ్లగా, పలుమార్లు కోరినా స్పందన లేకపోవడంతో సూసైడ్ చేసుకున్నాడు.
ATP: పాఠశాలలకు హోలీ పండుగ సెలవు మంగళవారమే ఉంటుందని జిల్లా విద్యాశాఖాధికారి ప్రసాద్ బాబు ప్రకటించారు. గతంలో మార్చి 4న సెలవుగా ప్రకటించినప్పటికీ, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మార్చి 3నే సెలవు అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. బుధవారం నుంచి పాఠశాలలు యథాతథంగా పనిచేస్తాయని ఆయన తెలిపారు.
NLR: ఆటోనగర్లో అగ్ని ప్రమాద ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వేదాయపాలెం సీఐ శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. యజమానులు తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించాలని సూచించారు. నిబంధనలు పాటించకపోవడం వల్ల ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తామని తెలిపారు.
నెల్లూరు నగరంలో బహిరంగంగా మద్యం సేవించే ప్రాంతాలపై ఏఎస్పీ దీక్ష ఐపీఎస్ సోమవారం దాడులు నిర్వహించారు. చిన్నబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పరమేశ్వరి ఆలయ సమీపంలోని ఒక దాబాలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన 22 ద్విచక్ర వాహనాలు సీజ్ చేసినట్లు ఆమె వెల్లడించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
TPT: శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాద్ ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం అందింది. హైదరాబాద్కు చెందిన దాత బత్తల ఇషాన్ మహాదేవ్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలోని దాతల విభాగంలో అధికారికి చెక్కును అందజేశారు. భక్తుల ఆరోగ్య సేవల కోసం ఈ విరాళాన్ని వినియోగించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
కోనసీమ: రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ నేటి పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది వెల్లడించారు. ఉదయం 9.30 గంటలలకు మాజీ లోకసభ స్పీకర్, దివంగత GMC.బాలయోగి వర్ధంతి సందర్భంగా దిండి Y జంక్షన్లో ఆయన విగ్రహానికి ఘన నివాళి అర్పిస్తారు. 10.30 గంటలకు చింతలపల్లి గ్రామంలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు.
KRNL: కోసిగి సుంకులమ్మ అవ్వ దేవర సందర్భంగా మండలంలోని జంపాపురంలో ఈ నెల 4, 5 తేదీల్లో రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ జరగనుంది. ఈ మేరకు నిర్వాహకులు లోకేష్, హనుమంతు, బసప్ప నాయుడు, శంఖర్, శేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల జట్లు మంగళవారం సాయంత్రంలోపు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
సత్యసాయి: పుట్టపర్తిలో ఈ నెల 5వ తేదీన జరగాల్సిన దివ్యాంగుల మూడు చక్రాల స్కూటర్ల అర్హత ఎంపిక శిబిరం అనివార్య కారణాల వల్ల తాత్కాలికంగా రద్దు చేయబడింది. దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులు ఈ మార్పును గమనించాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సూచించారు. తదుపరి తేదీని ప్రకటించే వరకు ఎవరూ పుట్టపర్తికి రావద్దని ఆయన కోరారు.
ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయాన్ని మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా మూసి వేస్తున్నట్లు ఆలయ ఈవో విజయరాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇవాళ తెల్లవారుజామున 6.30 గంటల లోపల ఆలయంలో స్వామివారికి పూజలు చేసి మూసివేసి బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు ఆలయాన్ని శుద్ధి, సంప్రోక్షణ చేసి స్వామివారిని భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు.
TPT: మార్చి 5వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కమిషనర్ ఎన్. మౌర్య తెలిపారు. జీవకోనలోని విశ్వం స్కూల్లో ఉదయం 9 గంటల నుంచి ఈమేళా జరుగనుంది. హైస్కూల్ టీచర్, ప్రి-ప్రైమరీ టీచర్, హాస్టల్ వార్డెన్, పీఆర్వో, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగనున్నాయి. వయస్సు 18-35 ఏళ్లు. వేతనం రూ.15,000 నుంచి రూ.50,000 వరకు ఉంటుంది.
TPT: చంద్రగ్రహణం నేపథ్యంలో తిరుపతి జిల్లాలలోని పలు ఆలయాలను మంగళవారం మూసివేయనున్నారు. TTD ఆధ్వర్యంలోని తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు కపిలతీర్థం, శ్రీనివాసమంగాపురం, తిరుచానూరు, అప్పలాయగుంట,సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయాలను ఉదయం 9 గంటలకు మూసి, రాత్రి 7.30 గంటలకు తెరిచి శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే శ్రీకాళహస్తి ఆలయం మాత్రం యథావిధిగా తెరిచి ఉంచుతారు.