AKP: వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడం తగదని పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అన్నారు. దీనికి నిరసనగా అనకాపల్లిలో వైసీపీ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన నిర్వహించారు. మహిళలను వేధిస్తున్న టీటీడీ ఛైర్మన్ నాయుడు పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ముత్యాల నాయుడు, మాజీ ఎంపీ డాక్టర్ బి వి సత్యవతి పాల్గొన్నారు.