PPM: సీతానగరం మండలంలోని నిడగల్లు గ్రామ పరిధిలో రెండు ప్రతిపాదిత క్వారీల నిర్వహణపై మంగళవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థుల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను ఆయన స్వయంగా స్వీకరించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ.. క్వారీ నిర్వహణలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలన్నారు.