సత్యసాయి: యువత భవిష్యత్తు, ప్రాణరక్షణే ప్రభుత్వ ప్రాధాన్యతని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పేర్కొన్నారు. మడకశిరలో “డ్రగ్స్ వద్దు – హెల్మెట్ ముద్దు” నినాదంతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ సతీష్ కుమార్, సినీ తారలు శ్రీవిష్ణు, హెబ్బా పటేల్ పాల్గొన్నారు. హెల్మెట్ ధరించకపోతే కుటుంబాలు రోడ్డున పడతాయని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.
కృష్ణా: పెనమలూరు మండలం తాడిగడప ఆర్టీసీ కాలనీలో రూ.1.50 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోరంకి ప్రజలు నన్ను నమ్మి మీ బిడ్డగా ప్రతి ఎన్నికలలో అండగా నిలబడి, గెలిపించినందుకు మీరు గర్వపడేలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు.
ప్రకాశం: తర్లుపాడు మండలం తుమ్మలచెరువు గ్రామంలోని ZP హై స్కూల్లో 3 దశాబ్దాల విద్యార్థులకు చెందిన విలువైన డాక్యుమెంట్స్ ఉన్న ఎలాంటి సెక్యూరిటీ లేదని విద్యాశాఖ అధికారులపై కాంగ్రెస్ మైనార్టీ ఛైర్మన్ డా. షేక్ మహబూబ్ వలి మండిపడ్డారు. సోమవారం జరిగిన గ్రీవెన్స్లో జేసీకి వినతి పత్రం ఇచ్చారు. స్కూలుకు సంబంధం లేని వ్యక్తులు పాఠశాలలో సంచరిస్తున్నారన్నారు.
SKLM: మందస మండలం హరి పురం రైల్వే స్టేషన్ సమీపంలో ఎస్సై కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో అనుమానాస్పదంగా ఉన్న ఓ వ్యక్తిని తనిఖీ చేయగా, అతని వద్ద నుంచి 2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు. గంజాయి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.
NDL: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల మొదటి రోజు శ్రీస్వామి అమ్మవార్లు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అలంకార మండపంలో ప్రత్యేక పూజలు అందుకున్న ఉత్సవమూర్తులకు వైభవంగా గ్రామోత్సవాన్ని జరిపించారు. గ్రామోత్సవం ముందు వివిధ కళారూపాల ప్రదర్శన భక్తులను ఎంతగానో అలరించింది.
TPT: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం మొత్తం 70,606 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 28,415 మంది తలనీలాలు సమర్పించగా, హుండీ ఆదాయం రూ. 4.39 కోట్లుగా నమోదైంది. ప్రస్తుతం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్మెంట్లు నిండిపోయి, శిలాతోరణం వెలుపల వరకు క్యూలైన్ కొనసాగుతోంది. ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతుంది.
NLR: బుచ్చి( M)లో రోడ్డు ప్రమాదాల నివారణకు సీఐ శ్రీనివాసరావు చర్యలు చేపట్టారు. పట్టణంలోని టోల్ ప్లాజా వద్ద దూరప్రాంతాలకు వెళ్లే వాహనాలను ఆపి డ్రైవర్లతో ఫేస్ వాష్ చేయించారు. వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి సమయంలో డ్రైవర్లకు నిద్రమత్తు వచ్చినట్లుగా అనిపిస్తే వాహనాలను పక్కన నిలిపి విశ్రాంతి తీసుకుని బయలుదేరి వెళ్లాలన్నారు.
ATP: జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అంపైరింగ్ పరీక్షలు ఈ నెల 18న నిర్వహిస్తున్నారు. అభ్యర్థుల వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలని కార్యదర్శి యుగంధర్ రెడ్డి తెలిపారు. ఆసక్తి ఉన్నవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఉత్తీర్ణులైన ఐదుగురిని రాష్ట్రస్థాయి పరీక్షలకు ఎంపిక చేస్తారు. ఏసీఏ నిర్వహించే పోటీలకు అంపైర్లుగా పనిచేసే అవకాశం వీరికి దక్కుతుంది.
AKP: మండల కేంద్రమైన పరవాడలో పైడిమాంబ అమ్మవారి నెల పండగను ఇవాళ నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తామన్నారు. భక్తులు పసుపు, కుంకుమ సమర్పించుకోవడానికి వీలుగా ఆలయ వద్ద ఏర్పాట్లు చేసామన్నారు. మధ్యాహ్నం ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు.
అన్నమయ్య: రాయచోటిలోని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో సోమవారం పల్లకి సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి సోమవారం జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా ఉత్సవ మూర్తులను పల్లకిలో ఉంచి ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు అర్చనలు, తీర్థప్రసాదాలు అందజేశారు.
PLD: వెల్దుర్తిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో రేపు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఆధ్వర్యంలో ‘ప్రజాదర్బార్’ నిర్వహించనున్నారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యేకు వివరించి, అర్జీలను సమర్పించవచ్చని కార్యాలయ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం పొందాలని వారు కోరారు.
బాపట్ల జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో డీఎంహెచ్వో విజయమ్మ శిశు మరణాలపై సమీక్షించారు. గర్భిణీలను మొదటి మూడు నెలల్లోనే గుర్తించి నమోదు చేయాలని, వారికి అవసరమైన వైద్యం సకాలంలో అందించాలని వైద్యాధికారులకు సూచించారు. హై రిస్క్ గర్భిణీలపై ప్రత్యేక శ్రద్ధతో పాటు కాన్పు తర్వాత శిశువులకు సమయానికి టీకాలు ఇవ్వాలని ఆదేశించారు.
GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మేనేజ్మెంట్ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్ల తాత్కాలిక సీనియారిటీ జాబితాను జిల్లా విద్యాశాఖ విడుదల చేసింది. జాబితా డీఈఓ అధికార వెబ్సైట్లో అందుబాటులో ఉందని తెలిపారు. అభ్యంతరాలు ఉన్న వారు ఆధారాలతో మార్చి 22లోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అప్పీల్ కమిటీకి సమర్పించాలని సూచించారు.
PPM: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి ఇవాళ మక్కువ మండలం వెంకటభైరిపురంలో పర్యటించనున్నారని మక్కువ MPDO ఎన్.అర్జునరావు తెలిపారు. సోమవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ.. వెంకటభైరిపురం గ్రామంలో నిర్వహించే గ్రామ ముస్తాబు కార్యక్రమంతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో కలెక్టర్ పాల్గొంటారని పేర్కొన్నారు.
కృష్ణా: తోట్లవల్లూరు మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న చేతి పంపులు, నీటి కుళాయిలు పనిచేయకపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవి కాలం ప్రారంభమై నీటి మట్టం తగ్గడంతో పలుచోట్ల నీరు రావడం లేదని ప్రజలు చెబుతున్నారు. గ్రామాల్లో ఉన్న చేతి పంపులను లెక్కించి, వాటికి వెంటనే మరమ్మతులు చేయించి ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.