SKLM: కొత్తూరు మండల ఉపాధి కార్యాలయం ఆవరణలో ఇవాళ ప్రజావేదిక జరగనుంది. రెండు వారాలుగా మండలంలోని 43 పంచాయతీల్లో సామాజిక తనిఖీలు పూర్తి చేసినట్లు ఏపీవో ప్రేమలత తెలిపారు. తనిఖీల్లో తేలిన అంశాలను బహిరంగంగా ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. అధికారులు, నాయకులు, ఉపాధి కూలీలు అంతా హాజరు కావాలని కోరారు.