SKLM: మందస మండలం హరి పురం రైల్వే స్టేషన్ సమీపంలో ఎస్సై కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో అనుమానాస్పదంగా ఉన్న ఓ వ్యక్తిని తనిఖీ చేయగా, అతని వద్ద నుంచి 2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు. గంజాయి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.