• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నేడు మంత్రి సవిత పర్యటన వివరాలు

సత్యసాయి: ధర్మవరంలోని చేనేత క్లస్టర్‌ని మంత్రి సవిత మంగళవారం 10 గంటలకు పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పెనుకొండలోని ఆర్అండ్‌బీ అతిథి గృహంలో అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు పెనుకొండలోని పార్టీ కార్యాలయంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేస్తారు. అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొంటారు.

March 17, 2026 / 07:29 AM IST

రాష్ట్ర అగ్నిమాపక సేవా పతకానికి ఎంపికయిన ఫైర్ మ్యాన్

తూ.గో: తాళ్లపూడి మండలం ప్రక్కిలంక గ్రామానికి చెందిన తమ్మినేని ఆనందరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అగ్నిమాపక సేవా పతకానికి ఎంపికయ్యారు. 2011లో భీమవరం అగ్నిమాపక కేంద్రంలో ఫైర్‌మెన్‌గా వృత్తి ప్రారంభించిన ఆయన, ప్రస్తుతం నిడదవోలు, కొవ్వూరు కేంద్రాల్లో విశిష్ఠ సేవలు అందిస్తున్నారు. ఈ సేవా మెడల్ లభించడం పట్ల స్థానికులు, తోటి సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

March 17, 2026 / 07:28 AM IST

పార్వతీపురం జిల్లాలో ఏనుగుల సంచారం

PPM: గరుగుబిల్లి మండలం తోటపల్లి పరిసర ప్రాంతాలలో ఉన్న పంట పొలాలలో ఏనుగులు గుంపు సోమవారం సాయంత్రం సంచరిస్తుండడంతో రైతులు ఆందోళన చెందారు. గత కొద్ది రోజులుగా గరుగుబిల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తూ పంటలను నాశనం చేస్తుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. తక్షణం ఏనుగుల గుంపును ఈ ప్రాంతాల నుంచి తరలించాలని అధికారులను రైతుల కోరుతున్నారు.

March 17, 2026 / 07:26 AM IST

రాగోలులో ‘పల్లె నిద్ర’ కార్యక్రమం

VZM: గుర్ల మండలం రాగోలు గ్రామంలో సోమవారం రాత్రి ఎస్సై నారాయణరావు ‘పల్లె నిద్ర’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చట్టాలపై స్థానికులకు అవగాహన కల్పించారు. సైబర్‌ క్రైమ్‌, సైబర్‌ ఫ్రాడ్స్‌, మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన, మహిళలపై జరిగే నేరాలు, ట్రాఫిక్‌ నియమాల గురించి వివరించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పోలీసులకు సహకరించాలని సూచించారు.

March 17, 2026 / 07:25 AM IST

​రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి

అన్నమయ్య: జిల్లా రామాపురం మండలం, నల్లగుట్టపల్లి బీసీ కాలనీలో సోమవారం రైతన్నా మీకోసం కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇంటింటికీ తిరిగి రైతులను కలిసి, అన్నదాత సుఖీభవ పథకం కింద అందుతున్న నిధుల గురించి ఆరా తీశారు.

March 17, 2026 / 07:25 AM IST

పీజీఆర్‌ఎస్‌లో అర్జీలు స్వీకరించిన కలెక్టర్

NTR: విజయవాడ కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సోమవారం ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో 88 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ప్రతి వినతిని సమగ్రంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు.

March 17, 2026 / 07:25 AM IST

నూకాంబిక జాతరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

AKP: నూకాంబిక అమ్మవారి జాతర సందర్భాన్ని పురస్కరించుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు స్థానిక ఆర్టీసీ డిపో మేనేజర్ హనుమశ్రీ తెలిపారు. భక్తుల సౌకర్యం కోసం విశాఖ నుంచి ఐదు, చోడవరం, మాడుగుల నుంచి మూడు, విజయనగరం, సబ్బవరం నుంచి మూడు బస్సులు వేస్తున్నట్లు తెలిపారు. అలాగే నర్సీపట్నం, పాయకరావుపేట, దేవరాపల్లి నుంచి ఒక్కొక్క బస్సు నడుపుతామన్నారు.

March 17, 2026 / 07:24 AM IST

సూళ్లూరుపేట హెడ్ కానిస్టేబుల్‌కు సేవా పతకం

TPT: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సేవా పతకాల్లో సూళ్లూరుపేట హెడ్ కానిస్టేబుల్ షేక్ ఖాజా హుస్సేన్ ఎంపికయ్యారు. పోలీస్ శాఖలో ఆయన అందించిన ఉత్తమ సేవలకు గుర్తింపుగా ఈ పతకం లభించింది. ఈ పతకాన్ని ఉగాది వేడుకల సందర్భంగా ప్రభుత్వం అందజేయనుంది. సేవా పతకం సాధించిన ఖాజా హుస్సేన్‌ను పలువురు పోలీస్ అధికారులు అభినందించారు.

March 17, 2026 / 07:21 AM IST

అలర్ట్: జిల్లాకు వర్ష సూచన

KRNL: కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మంగళవారం వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. జిల్లాలోని పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందందని పేర్కొంది. పిడుగుపాటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించింది.

March 17, 2026 / 07:21 AM IST

ఇళ్ల నిర్మాణాల్లో ఆలస్యం వద్దు: కలెక్టర్

బాపట్లలో సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ డా. వి.వినోద్ కుమార్ MGNREGS, గృహ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. పనుల్లో వెనుకబడిన మండలాల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. PMAY ఇళ్ల నిర్మాణాలను ఉగాది నాటికి పురోగతిలోకి తీసుకురావాలని, పనులు ప్రారంభించని లబ్ధిదారులకు నోటీసులు జారీ చేయాలని తెలిపారు.

March 17, 2026 / 07:19 AM IST

జిల్లాలో 1,901 మందికి HPV వాక్సినేషన్ పూర్తి

చిత్తూరు జిల్లాలో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్(HPV) వాక్సికేషన్ కార్యక్రమం సోమవారం నాటికి 1,901 మంది బాలికలకు వాక్సిన్ వేసినట్లు అధికారులు తెలిపారు. క్యాన్సర్ మహమ్మారిని కట్టడి చేయడానికి ఈ టీకా కార్యక్రమాన్ని ఈనెల 10వ తేదీన ప్రారంభించారు. జిల్లాలో 10,999 మంది బాలికలు అర్హులుగా గుర్తించగా, వారి కోసం మొదటి దశలో 6,045 సింగిల్ డోస్ వైల్స్ వచ్చాయి.

March 17, 2026 / 07:18 AM IST

నేడు మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం

E.G: మండపేట పురపాలక సంఘం కౌన్సిల్ అత్యవసర సమావేశం ఇవాళ ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు పురపాలక సంఘం ఛైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి సోమవారం పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అజెండాలోని 41 అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

March 17, 2026 / 07:14 AM IST

పేకాట స్థావరంపై దాడి.. 12 మంది అరెస్ట్

PLD: కారంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒప్పిచర్ల శివారులో సాగుతున్న పేకాట స్థావరంపై సోమవారం రాత్రి నరసరావుపేట ప్రత్యేక పోలీసు బృందం మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.1.90 లక్షల నగదుతో పాటు 9 బైకులు, 14 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

March 17, 2026 / 07:14 AM IST

ఈనెల 18 నుంచి దివ్యాంగులకు ఫ్రీబస్: డీఎం

కోనసీమ: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 18 నుంచి ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని అమలు చేస్తున్నట్లు రావులపాలెం డిపో మేనేజర్ కుమార్ తెలిపారు. 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు, ప్రస్తుతం ‘స్త్రీ శక్తి’ పథకం వర్తించే అన్ని బస్సు సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. అయితే, స్త్రీ శక్తి వర్తించని బస్సుల్లో 50 శాతం ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందన్నారు.

March 17, 2026 / 07:13 AM IST

‘ఈనెల 28న జడ్పీ సర్వసభ్య సమావేశం’

VSP: ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 28వ తేదీన నిర్వహించనున్నట్లు జడ్పీసీఈవో నారాయణమూర్తి తెలిపారు. జడ్పీ ఛైర్‌పర్సన్ సుభద్ర అధ్యక్షతన విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ సమావేశం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి అనకాపల్లి, అల్లూరి, విశాఖ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

March 17, 2026 / 07:12 AM IST