• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సోము వీర్రాజుపై దాడి హేయం

SKLM: ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై శాసన మండలిలో వైసీపీ సభ్యులు భౌతిక దాడికి పాల్పడటం హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలం అన్నారు. శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తిరుపతి లడ్డూ కల్తీ ఘటనపై చర్చ జరుగుతున్న సమయంలో దాడి జరగడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మారిందన్నారు.

February 27, 2026 / 12:57 PM IST

సీఐగా బాధ్యతలు చేపట్టిన మద్దయ్యచారి

తిరుపతి రూరల్ పరిధిలో నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని కొత్త సీఐ స్పష్టం చేశారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి మత్తును పూర్తిగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శుక్రవారం తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్‌లో మద్దయ్యచారి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

February 27, 2026 / 12:56 PM IST

శ్రీ పంచకం పోస్టల్ ఆవిష్కరణ

AKP: అనకాపల్లి బీజేపీ కార్యాలయంలో స్త్రీ పంచకం కార్యక్రమ పోస్టర్లు శుక్రవారం ఆవిష్కరించారు. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 6 నుంచి 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం జరగనున్నట్లు జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఇందులో మహిళా జనరల్ సెక్రటరీ రోహిణి తదితరులు పాల్గొన్నారు.

February 27, 2026 / 12:53 PM IST

రేపటి నుంచి స్వచ్ఛ రథంపై అవగాహన

KDP: సింహాద్రిపురం మండలంలోని గ్రామాల్లో ఈ నెల 28వ తేదీ నుంచి నెల రోజులపాటు స్వచ్ఛ రథంపై అవగాహన కల్పిస్తున్నట్లు ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం సింహాద్రిపురంలో స్వచ్ఛరథం కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తడి, పొడి చెత్తను సేకరించి ఇస్తే సరుకులు ఇవ్వడం జరుగుతుందన్నారు.

February 27, 2026 / 12:51 PM IST

భూ రీ సర్వే విషయంలో ఘర్షణ.. కేసు నమోదు

ATP: పెద్దవడుగూరు మండలం కొండూరు సమీపంలో భూ రీ-సర్వే విషయంలో ఇరు వర్గాల మధ్య మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో పరస్పరం ఇరు వర్గాలు రాళ్లు రవ్వుకున్నారు. ఈ ఘటనలో రామన్న అనే వ్యక్తికి గాయాలయ్యాయి. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

February 27, 2026 / 12:45 PM IST

మంత్రిని కలిసిన పాతపట్నం ఎమ్మెల్యే

SKLM: పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి నారా లోకేష్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. కొత్తూరులో డిగ్రీ కాలేజ్ మంజూరు చేయాలని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే క్రమబద్దీకరణ చేయాలని, వంశధార ప్రాజెక్టు నిర్వాసితులపై నమోదైన కేసులను మానవతా దృష్టితో ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు.

February 27, 2026 / 12:44 PM IST

విద్యార్థులకు సీపీఆర్ పై అవగాహన కార్యక్రమం

AKP: రోటరీ క్లబ్, ఎన్టీఆర్ వైద్యాలయం ఆధ్వర్యంలో గవరపాలెం జీవీఎంసీ చిన్న హైస్కూల్‌లో శుక్రవారం విద్యార్థులకు సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డా. పృద్వీ మాట్లాడుతూ.. హార్ట్ ఎటాక్ సమయంలో తక్షణ సీపీఆర్ ప్రాణరక్షకమని తెలిపారు. సీపీఆర్ చేయడం వల్ల గుండె మళ్లీ కొట్టుకొని మెదడుకు రక్తప్రసరణ జరుగుతుందని వివరించారు.

February 27, 2026 / 12:40 PM IST

‘మార్కాపురంలో ఉద్యోగులు ధర్నా’

ప్రకాశం మార్కాపురం APTF ఆధ్వర్యంలో ఉద్యోగులు పట్టణంలోని R&B కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ పిఆర్సి , ఐఆర్, యాప్ ల పని భారం తగ్గించి, రాష్ట్రస్థాయి విద్యారంగం ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

February 27, 2026 / 12:40 PM IST

తిమ్మాపురం వద్ద రోడ్డు ప్రమాదం

PLD: ఎడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. సొలస, మర్రిపాలెంకు చెందిన ఇస్మాయిల్, రమేష్ బైక్‌పై వెళ్తున్నారు. వారు రోడ్డు దాటుతుండగా గుంటూరు నుంచి వస్తున్న కారు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

February 27, 2026 / 12:37 PM IST

తిరుపతికి రూ.138 కోట్లు ఇవ్వండి: MLA

తిరుపతిలో 30ఏళ్ల క్రితం నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (UDG) సిస్టమ్ దెబ్బతిందని MLA శ్రీనివాసులు అసెంబ్లీలో ప్రస్తావించారు. తిరుపతిలో పాత 60KM డ్రైనేజీ బాగు చేసి కొత్తగా 125KMల మేర UDG నిర్మాణానికి రూ.152కోట్లు కావాలని, అలాగే 42వేల ఇళ్లకు కొత్తగా కనెక్షన్ ఇవ్వడానికి రూ.36కోట్లు అవసరం అని MLA కోరారు. ఇప్పటికే ప్రతిపాదనలు చేశామని తెలిపారు.

February 27, 2026 / 12:36 PM IST

మహోత్సవానికి భక్తులకు నీటి ట్యాంకర్లు ఏర్పాటు

KRNL: సొగనూరు గ్రామంలో జరగనున్న సుంకలమ్మ, మారెమ్మ అవ్వల దేవాలయం మహోత్సవానికి భక్తులకు ఇబ్బంది లేకుండా బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేకంగా మంచినీటి ట్యాంకర్లు ఏర్పాటు చేశారు. ఎంపీటీసీ మధుసూదన్ రెడ్డి విజ్ఞప్తిపై బుట్టా రేణుక, బుట్టా శివ నీలకంఠ వెంటనే స్పందించారు. ఈ సేవా కార్యక్రమంపై గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.

February 27, 2026 / 12:35 PM IST

రేపల్లెలో అనగాని ప్రజా దర్బార్

BPT: రేపల్లెలో శుక్రవారం ‘అనగాని ప్రజా దర్బార్’ కార్యక్రమం జరిగింది. ఇందులో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రజల వద్ద నుంచి సమస్యలతో కూడిన అర్జీలను స్వీకరించారు. ఈ సమస్యలన్నింటినీ మంత్రి అనగాని సత్యప్రసాద్ దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు. ఈ అర్జీలను వీలైనంత త్వరగా పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకుంటామని నాయకులు ప్రజలకు హామీ ఇచ్చారు.

February 27, 2026 / 12:30 PM IST

మంగళగిరి జనసేన కార్యాలయంలో ఆకతాయి వీరంగం

GNTR: మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలోకి శుక్రవారం ఓ అజ్ఞాత వ్యక్తి చొరబడ్డాడు. కార్యాలయ ప్రాంగణంలో ఉన్న కార్ల అద్దాలను అతడు ధ్వంసం చేశాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ ఆకతాయిని పట్టుకుని మంగళగిరి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హుటాహుటిన మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.

February 27, 2026 / 12:30 PM IST

కలంకారీ వస్త్రాలను పరిశీలించిన ఎమ్మెల్యేలు

కృష్ణా: అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేయగా కలంకారీ వస్త్రాలను శుక్రవారం ఎమ్మెల్యేలు కాగిత కృష్ణప్రసాద్, కుమార్ సందర్శించి వస్త్రాలను ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన కలంకారి పరిశ్రమ పెడనలో నియోజకవర్గంలో ఉండటం ఎంతో సంతోషంగా ఉందని కృష్ణ ప్రసాద్ అన్నారు. త్వరలో కలంకారి క్లస్టర్ పెడనలో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.

February 27, 2026 / 12:30 PM IST

ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ శ్యాంప్రసాద్

సత్యసాయి: ధర్మవరం మార్కెట్ యార్డులోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ శుక్రవారం తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి భద్రతా చర్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. గోడౌన్ వద్ద నిరంతరం పటిష్టమైన నిఘా ఉండాలని అధికారులను ఆదేశించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు.

February 27, 2026 / 12:30 PM IST