• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ప్రజలతో నేరుగా మమేకం కావడం కోసమే ‘మన్ కి బాత్’

E.G: ప్రజలతో నేరుగా మమేకం కావడం కోసమే ప్రధాని మోడీ మన్ కి బాత్ కార్యక్రమాన్ని ప్రారంభించారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి శ్రీ రామారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో మాన్ కి బాత్ క్విజ్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శనివారం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి బహుమతులు అందించారు.

February 28, 2026 / 11:10 AM IST

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం

PLD: మాచవరం మండలం సింగరాయపాలెం తండా సమీపంలోని లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ వేడుకలు శనివారం ఘనంగా జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు కొండ దిగువన గల కళ్యాణ మండపంలో ఈ వేడుక నిర్వహించనున్నట్లు పిల్లుట్ల సర్పంచ్ శివపార్వతి సాంబశివరావు తెలిపారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.

February 28, 2026 / 11:08 AM IST

జిల్లా నూతన కార్యవర్గ నియమాకం..!

కర్నూలు: జిల్లా BJP కమిటీలో పలు కీలక పదవులకు కొత్త నియామకాలు చేపట్టారు. జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా దాసరి యువరాజు, మైనారిటీ మోర్చా అధ్యక్షుడిగా సయ్యద్ షహీన్‌ను నియమించారు. అధికార ప్రతినిధులుగా లోకేష్, దేశాయి గురురాజ స్వామి, బోయ బ్రహ్మయ్యలను ఎంపిక చేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు బాపురం రామకృష్ణ పిలుపునిచ్చారు.

February 28, 2026 / 11:08 AM IST

గండి క్షేత్రం ఆదాయ వివరాలు..!

KDP: చక్రాయపేట మండలంలోని గండిక్షేత్రం శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయానికి రూ.1.09 కోట్ల ఆదాయం సమకూరినట్లు డిప్యూటీ కమిషనర్ గురు ప్రసాద్ తెలిపారు. స్థానిక ఆలయం వద్ద శుక్రవారం తలనీలాలకు, కొబ్బరికాయల వేలం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గండి ఆలయ మాజీ చైర్మన్లు వెంకటస్వామి, భాస్కర్ పాల్గొన్నారు.

February 28, 2026 / 11:06 AM IST

బాలుడి పై కుక్క దాడి..!

ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలో శనివారం మూడు సంవత్సరాల బాలుడి పై కుక్క దాడి చేసింది. స్థానిక పాత బస్టాండ్ వద్ద ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడి పై వీధి కుక్క దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారు తల్లిదండ్రులు తెలపగా.. హుటాహుటిన చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు బాలుడికి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

February 28, 2026 / 11:05 AM IST

జిల్లాలో ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం

BPT: పాత బస్టాండ్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ తెలిపారు. పార్టీ బలోపేతానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని చెప్పారు. ఈరోజు మరియు ఆదివారం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు నమోదు కొనసాగుతుందని పేర్కొన్నారు.

February 28, 2026 / 11:04 AM IST

గుమ్మలక్ష్మి పురంలో ‘సమ్మర్ క్రాష్ ప్రోగ్రామ్’

PPM: గుమ్మలక్ష్మి పురంలో శనివారం స్దానిక పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో పలు కాలనీలలో ‘సమ్మర్‌ క్రాష్‌ ప్రోగ్రాం’ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రజకవీధి, చింతల గూడ, పెంకుటిల్లు కాలనీలలో చేతిపంపు మరమ్మతులు జరిపినట్లు సర్పంచ్‌ గౌరీశంకర్‌రావు పేర్కొన్నారు. గ్రామంలో ఎక్కడైనా బోర్లు పాడైపోయి ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వాటిని కూడా బాగు చేయిస్తామని తెలిపారు.

February 28, 2026 / 11:00 AM IST

ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి

VSP: రామ్‌నగర్‌లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇవాళ మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించి బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు సమస్యలపై వినతిపత్రాలు అందించగా, వాటిని సంబంధిత అధికారులకు పంపించి త్వరిత చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం మంత్రి రాంబిల్లి కార్యక్రమానికి బయలుదేరారు.

February 28, 2026 / 11:00 AM IST

అవ్వ, తాతలకు అండగా కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే

TPT: అవ్వ తాతలకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తోందని గూడూరు ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్ పేర్కొన్నారు. శనివారం ఆయన గూడూరు మండలం గాంధీనగర్‌లో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లను లబ్ధిదారులకు అందించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లను 4000 రూపాయలకు పెంచి అందజేస్తుందన్నారు.

February 28, 2026 / 11:00 AM IST

రేపు బాలికల గురుకులంలో ప్రవేశాలకు పరీక్షలు

VZM: వంగరలోని మడ్డువలస BR అంబేద్కర్‌ బాలికల గురుకులంలో ప్రవేశాలకు రేపు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ రాధిక శనివారం తెలిపారు. ఈ మేరకు ఉదయం 9:30 నుంచి 11 వరకు 5 వ తరగతి, 12 నుంచి 1:30 వరకు ఇంటర్మీడియట్‌కు పరీక్షలు జరుగుతాయన్నారు. ఫస్ట్‌ ఇయర్‌ MPCకి 50, బైపీసీకి 40 సీట్లు కేటాయించామని విద్యార్ధులు పరీక్షా కేంద్రానికి ముందుగానే చేరాలన్నారు.

February 28, 2026 / 11:00 AM IST

మోహిని అవతారంలో దర్శనమిచ్చిన శ్రీవారు

CTR: పుంగనూరులో శ్రీకళ్యాణ వేంకటరమణ స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 5వ రోజు శనివారం ఉదయం మోహిని అవతారంలో శ్రీనివాసుడు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. భక్తులు శ్రీవారిని దర్శించగా మహిళలు కర్పూర హారతులు పట్టారు. ఇవాళ సాయంత్రం గరుడసేవ జరగనుంది. ఇందుకు సంబంధించి టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది.

February 28, 2026 / 10:56 AM IST

పింఛన్ల పంపిణీలో టీడీపీ అధ్యక్షుడు

CTR: గుడిపల్లె మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు షణ్ముఖ రెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం శనివారం పాల్గొన్నారు. ఇచ్చిన హామీ మేరకు పెంచిన పింఛన్ మొత్తాన్ని ప్రతినెల కూటమి ప్రభుత్వం క్రమం తప్పకుండా పంపిణీ చేస్తున్నట్టు వారు తెలిపారు. లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.

February 28, 2026 / 10:55 AM IST

లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసిన ఎమ్మెల్యే

కోనసీమ: అమలాపురం మండలంలోని పాలగుమ్మి గ్రామంలో లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఎన్టీఆర్ భరోసా పథకం పెన్షన్లను శనివారం అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతినెలా సకాలంలో లబ్ధిదారులకు ప్రభుత్వం పెన్షన్లు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.

February 28, 2026 / 10:50 AM IST

చిన్నారి కుటుంబానికి రూ.10 లక్షల చెక్కు పంపిణీ

E.G: రాజానగరం మండలం స్వరూపనగర్ లో కల్తీ పాలు తాగి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన ఇసనపల్లి అర్చన కుమారుడు మనోహర్ కుటుంబాన్ని MLA బత్తుల బలరామకృష్ణ శనివారం పరామర్శించారు. అనంతరం కుటుంబానికి సీఎం చంద్రబాబు CMRF నుంచి మంజూరు చేసిన రూ.10 లక్షల చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. బాధిత కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

February 28, 2026 / 10:50 AM IST

పంట పొలాలలో వ్యర్థాల దహనంపై గ్రామస్తుల ఆందోళన

ATP: శింగనమల మండలం వెస్ట్ నరసాపురంలో ఓ ప్రైవేట్ కంపెనీ తీరుపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయటి ప్రాంతాల నుంచి వ్యర్థాలను తీసుకొచ్చి పంట పొలాల్లో దహనం చేస్తుండటంతో విషపూరిత పొగ వెలువడుతోంది. దీనివల్ల శ్వాసకోస ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలన్నారు.

February 28, 2026 / 10:49 AM IST