• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘యువత చేతిలో గ్లోబల్ కంపెనీల ఆఫర్ లెటర్లు ఉండాలి’

ప్రకాశం: కంచికచర్ల మిక్ కాలేజీలో “డ్రగ్స్ పై దండయాత్ర” కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య యువతను డ్రగ్స్ నుంచి దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ యువత చేతిలో గంజాయి కాదని, గ్లోబల్ కంపెనీల ఆఫర్ లెటర్లు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

February 27, 2026 / 05:35 PM IST

విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ.2.52 లక్షలు

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శుక్రవారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.2,52,464 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 236 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 35 ద్విచక్ర వాహనాలకు పూజలు నిర్వహించారు అని, 2943 మంది అన్న ప్రసాదం స్వీకరించారని అన్నారు.

February 27, 2026 / 05:34 PM IST

ఎంపీని కలిసిన అంబటి మురళీకృష్ణ

GNTR: పొన్నూరు వైసీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ శుక్రవారం తాడేపల్లిలో ఆ పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో అనుబంధ విభాగాల కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలని, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని వైవీ సుబ్బారెడ్డి మురళీకృష్ణకు సూచించారు.

February 27, 2026 / 05:33 PM IST

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎంపీ

సత్యసాయి: పెనుకొండ మండలంలోని ఎంపీ కార్యాలయంలో ఎంపీ బీకే.పార్థసారథి శుక్రవారం 10 మంది లబ్ధిదారులకు రూ.7,65,970ల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి లబ్దిదారులకు సీఎం రిలీఫ్‌ అండ్‌ చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

February 27, 2026 / 05:30 PM IST

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో

VZM: ఎల్ కోట మండలం గొల్జాం, ఎల్‌కే‌ఎస్ పురంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీవో అల్లు సూర్యనారాయణ శుక్రవారం పరిశీలించారు. ఉపాధి కూలీల మష్టర్ షీట్‌ను తనిఖీ చేశారు. వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో ఉపాధి కూలీలు పనిచేసిన చోట ప్రత్యేక జాగ్రత్తలు వహించాలని సూచించారు. ప్రభుత్వ కొలతలను అనుసరించి పనిచేసే అధిక ఆదాయం పొందాలని కోరారు.

February 27, 2026 / 05:30 PM IST

వివిధ గ్రామాల్లో సంచార వైద్య సేవలు

PPM: సీతానగరం మండలంలో గుమ్మడివరం, అప్పయ్యపేట గ్రామాల్లో శుక్రవారం 104 వైద్య సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా డా. పావని గర్భిణీలకు, బాలింతలకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పరీక్షలు నిర్వహించి నెలకు సరిపడా మందులు పంపిణీ చేశారు. సంచార చికిత్స కార్యక్రమం పై ముందురోజు గ్రామస్తులకు తెలియజేయాలని సిబ్బందికి సూచించారు.

February 27, 2026 / 05:30 PM IST

ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య శాఖలపై కలెక్టర్ సమీక్ష

ATP: అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య శాఖలపై జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు, తల్లీబిడ్డల ఆరోగ్యం, పోషకాహార పంపిణీపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మెడికల్ ఆఫీసర్లు, సీడీపీఓలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించారు.

February 27, 2026 / 05:23 PM IST

ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి పనులు..!

NDL: ఆత్మకూరు పట్టణంలోని అర్బన్ కాలనీలో 15వ ఆర్థిక సంఘం నిధులతో రూ.15 లక్షల వ్యయంతో రహదారి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ షహబుదీన్ పాల్గొన్నారు. బుద్ధా రాజశేఖర్ రెడ్డి సహకారంతో ఇవాళ పట్టణంలోని అంతర్గత రహదారులను అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

February 27, 2026 / 05:22 PM IST

మున్సిపల్ హైస్కూల్‌లో పోక్సో, సైబర్ నేరాలపై అవగాహన

కడప: జిల్లా ఎస్‌పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్సిపల్ హైస్కూల్‌లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీ.ఐ జీ. ప్రసాద్ రావు విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. పోక్సో చట్టం, పిల్లల భద్రత, సైబర్ నేరాలు, రహదారి భద్రతపై అవగాహన కల్పించారు.

February 27, 2026 / 05:21 PM IST

ఉండవల్లిలో సమావేశానికి మంత్రి హాజరు..!

KRNL: ఉండవల్లి నివాసంలో కృష్ణానది ఒడ్డున నిర్వహించిన విందు సమావేశానికి కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ హాజరయ్యారు. నారా లోకేష్ ఆత్మీయంగా అందరినీ పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు. మహిళలకు మంగళగిరి పట్టుచీరలు అందజేశారు.

February 27, 2026 / 05:21 PM IST

RTC డిపోలను పరిశీలించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

SKLM: జిల్లా కేంద్రంలో ఉన్న 1,2 APSRTC డిపోలను జోన్-1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి. విజయగీత శుక్రవారం సందర్శించారు. కాంప్లెక్స్‌లో ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలను మెరుగ్గా అందజేయాలని డిపో అధికారులకు ఆదేశించారు. 2 డిపోల్లో ఉన్న అన్ని సెక్షన్లను తనిఖీ చేసి సిబ్బంది అందరితో గేట్ మీటింగ్ నిర్వహించారు. బస్సులు కండిషన్లో ఉంచాలన్నారు.

February 27, 2026 / 05:20 PM IST

గ్రహణం కారణంగా సేవలు నిలిపివేత

అన్నమయ్య: మార్చి 3న జరిగే చంద్రగ్రహణం సందర్భంగా రాయచోటి శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. గ్రహణ మోక్షానంతరం ఆలయ శుద్ధి, విశేష అభిషేకం అనంతరం భక్తులకు దర్శనం, తీర్థప్రసాదం అందజేయబడుతుందని ఛైర్మన్ తిరుమల మనోజ్ కుమార్, ఈఓ డి.వి. రమణారెడ్డి వెల్లడించారు.

February 27, 2026 / 05:20 PM IST

సివి రామన్ స్కూల్లో స్టీమ్ ఎక్స్‌పో ప్రదర్శన

W.G: భీమవరం సర్ సివి రామన్ స్కూల్లో సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన స్టీమ్ ఎక్స్‌పో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ కె. రామచంద్ర రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని సృజనాత్మకతను పదును పెట్టేంటెందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహద పడతాయిని అన్నారు. వేణుగోపాల్ రావు, సరిత, సుబ్రమణ్యం, రంగసాయి, పార్వతిదేవి, తదితరులు పాల్గొన్నారు.

February 27, 2026 / 05:17 PM IST

ఒక్కరోజు ముందుగానే పింఛన్ ఇస్తాం: ఎంపీడీవో

అన్నమయ్య: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉంగుటూరు మండలంలో శనివారమే పింఛన్ల పంపిణీ చేస్తున్నట్లు ఎంపీడీఓ మనోజ్ తెలిపారు. ఆ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో ఒక్కరోజు ముందుగానే పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. మండలంలోని 11,203మంది లబ్ధిదారులకు రూ.4 కోట్ల,92 లక్షల 56 వేల 500 లు అందచేస్తామన్నారు. శనివారం ఉదయం 7గంటల నుంచే ఇస్తామన్నార.

February 27, 2026 / 05:16 PM IST

క్రియాశీలక సభ్యత్వంతో జనసైనికులకు భరోసా: రామయ్య

KDP: దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కల్పించని విధంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వంతో కార్యకర్తలకు భరోసా కల్పిస్తోందని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పేర్కొన్నారు. శుక్రవారం సిద్దవటం మండలం ఉప్పరపల్లెలో జనసేన సభ్యత్వ కార్యక్రమాన్ని రామయ్య ప్రారంభించారు. రామయ్య మాట్లాడుతూ.. సామాజిక న్యాయ సాధనలో జనసేన పార్టీ కట్టుబడి ఉందన్నారు.

February 27, 2026 / 05:16 PM IST