• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నియోజకవర్గ అభివృద్ధికి కృషి

AKP: మాడుగుల నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. శనివారం మాడుగుల మండలం ఎం.కోడూరులో సమావేశం నిర్వహించారు. గ్రామ సమస్యలను పరిశీలించి ప్రతి సమస్యను పరిష్కరిస్తామని, బస్సులు ఆగే ఏర్పాట్లు, అసంపూర్తి కుళాయి పనులు పూర్తి చేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

February 28, 2026 / 04:30 PM IST

తిరునాళ్ల మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

NTR: కొత్తనాగులూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ బాల ఆరేటమ్మ తల్లి తిరునాళ్ళ మహోత్సవంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో దేవతామూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

February 28, 2026 / 04:29 PM IST

‘ఇంటి పన్ను చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించండి’

ELR: ఉంగుటూరు మండలంలో ఇంటి పన్ను, కుళాయి పన్నులు వసూళ్లను పంచాయితీ అభివృద్ధి అధికారులు వేగవంతమయ్యాయని డిప్యూటీ ఎంపీడీవో జీ. రమేష్ బాబు అన్నారు. శనివారం ఆయన ఉంగుటూరులో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వసూలు చేస్తున్న ఇంటి పన్ను, కుళాయి పన్నును పరిశీలించారు. ఇంటి పనులను చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఆయన ప్రజలను కోరారు.

February 28, 2026 / 04:28 PM IST

రైలు ఢీకొని వృద్ధురాలు మృతి.!

ELR: రైలు ఢీకొనడంతో ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన సీతంపేట రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. దెందులూరు-భీమడోలు మధ్య పట్టాలు దాటుతున్న వృద్ధురాలిని రైలు ఢీకొట్టినట్లు రైల్వే పోలీసులు దృవీకరించారు. మృతురాలు 70 నుంచి 75 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉంటుందని తెలిపారు. వివరాలు తెలిసినవారు రైల్వే హెచ్‌సీ ప్రసాద్‌ను సంప్రదించాలని కోరారు.

February 28, 2026 / 04:27 PM IST

అంబేద్కర్ నూతన కాంశ్య విగ్రహ ఏర్పాట్ల పరిశీలన

కనిగిరిలోని ఒంగోలు బస్టాండ్ వద్ద ఏర్పాటు చేస్తున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నూతన కాంశ్య విగ్రహ పనులను కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి పరిశీలించారు. విగ్రహ స్థాపన పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవ చేయడం మనందరి బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

February 28, 2026 / 04:24 PM IST

వాసవ్య మహిళా మండలి వృత్తి శిక్షణ సర్టిఫికెట్ల పంపిణీ

KKD: పిఠాపురం పురపాలక సంఘం మెప్మా ఆఫీసులో వాసవ్యమహిళా మండలి ఆధ్వర్యంలో సోలార్ పీవీ టెక్నాలజికల్ ట్రైనింగ్ జరిగింది. 14 రోజుల పాటు మహిళలకు ఉచిత శిక్షణ ఇచ్చారు. ఈ కోర్సు పూర్తయిన వారికి వాసవ్య మహిళా మండలి ప్రెసిడెంట్ కీర్తి 50 మందికి సర్టిఫికెట్స్, కిట్స్ అందించారు. ఈ కార్యక్రమంలో CMM వేంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

February 28, 2026 / 04:17 PM IST

ఆకివీడులో ఫోక్సో కేసు నమోదు

W.G: ఆకివీడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఫోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. సమతా నగర్ ప్రాంతానికి చెందిన పాల మరియమ్మ కుమార్తె(మైనర్ బాలిక)ను అదే ప్రాంతానికి చెందిన బోనాల రాము పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు శారీరకంగా కలిసినట్లు ఎస్సై తెలిపారు. పెళ్లికి నిరాకరించడంతో తల్లిపాల మరియమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో రాముపై ఫోక్సో కేసు నమోదు చేశారు.

February 28, 2026 / 04:17 PM IST

పోలీస్ శాఖకి ఆయన చేసిన సేవలు ప్రశంసనీయం

చిత్తూరు ఎస్పీ తుషార్ దూడి ఆదేశాల మేరకు పూతలపట్టు పోలీస్ స్టేషన్ నుంచి పదవీ విరమణ పొందిన ASI శేఖర్‌ను పోలీసులు సత్కరించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ S.R. రాజశేఖర రాజు, AR అదనపు ఎస్పీ దేవదాస్, ఆయన 39 సంవత్సరాల అంకితభావం, క్రమశిక్షణతో కూడిన సేవను ప్రశంసించారు. ఆయన నిబద్ధత, త్యాగాన్ని ప్రశంసించి ఆయన చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపారు.

February 28, 2026 / 04:16 PM IST

కంభంలో పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ప్రకాశం: కంభం పట్టణంలోని స్థానిక అర్బన్ కాలనీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్చి 1 ఆదివారం కావడంతో ఒకరోజు ముందే పెన్షన్లను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.

February 28, 2026 / 04:13 PM IST

అర్హులందరికీ పింఛన్లు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

E.G: ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద సామాజిక భద్రతా పింఛన్లు అర్హులైన వారందరికీ అందిస్తున్నామని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. శనివారం కోలమూరులో కొత్తగా మంజూరైన నూతన పింఛన్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే భార్యకు పింఛన్ ఇచ్చే విధానాన్ని వైసీపీ ప్రభుత్వం విస్మరించిందన్నారు.

February 28, 2026 / 04:13 PM IST

‘కర్నూలులో CMRF చెక్కులు పంపిణి’

KRNL: CMRF పేద రోగులకు ఆర్థిక భరోసా ఇస్తుందని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. కర్నూలులో ఎంపీ బైరెడ్డి శబరి కార్యాలయంలో శనివారం CMRF చెక్కులను బాధితులకు అందజేశారు. వివిధ మండలాలకు చెందిన ఐదుగురికి మొత్తం రూ.3 లక్షలకుపైగా సహాయం అందింది. లబ్ధిదారులు సీఎం చంద్రబాబు ఎంపీ శబరికి కృతజ్ఞతలు తెలిపారు.

February 28, 2026 / 04:11 PM IST

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

సత్యసాయి: పరిగి మండలం కోడిగేనహళ్లి గ్రామంలో పరిగి మండలానికి చెందిన 11 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.6,88,868 విలువైన చెక్కులను మంత్రి సవిత శనివారం అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆపదలో ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. అవసరమైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

February 28, 2026 / 04:06 PM IST

మూడు రోజుల్లో త్రాగునీటి సమస్యకు పరిష్కారం

AKP: టిడ్కో కాలనీలో తాగునీటి సమస్య లేకుండా చూస్తామని యలమంచిలి మున్సిపల్ డిప్యూటీ డీఈఈ కనకరాజు అన్నారు. పట్టణంలో రాంనగర్ సమీపంలో గల టిడ్కో కాలనీలో సీ1 బ్లాక్లో మంచినీటి సమస్యపై ఫిర్యాదు రావడంతో శనివారం పర్యటించారు. శుద్ధ వాటర్ కారణంగా పైపులు జాము అయ్యాయని, మూడు రోజుల్లో ఈ పనులు చేయించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.

February 28, 2026 / 04:05 PM IST

‘స్కూల్ విద్యార్థుల ప్రయాణ భద్రతే ముఖ్యం

PPM: విద్యార్థుల భద్రతే ముఖ్యం అని ఎంవీఐ వేణుగోపాలరావు తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు, ఏఎస్పీ మనీషా రెడ్డి ఉత్తర్వులతో శనివారం స్కూల్ బస్సు డ్రైవర్లకు పాలకొండలో అవగాహన కల్పించారు. విద్యార్థుల ప్రాణాలు తమ చేతుల్లో ఉన్నాయని డ్రైవర్లకు భాద్యతాయుతంగా వ్యవహరించాలని ఎంవీఐ సూచించారు. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు కారణమవుతుందని ఎంవిఐ హెచ్చరించారు.

February 28, 2026 / 04:05 PM IST

కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

TPT: తిరుపతి నగరంలోని పెద్దకాపు లేఅవుట్‌లో విషాదం నెలకొంది. కేవీపల్లె మండలం నూతన కాలువ గ్రామం దిన్నెవడ్డేపల్లికి చెందిన చెంచయ్య(40) నూతన భవన నిర్మాణ పనులకు వచ్చాడు. ఈ క్రమంలో కరెంట్ షాక్ తగిలింది. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. మృతదేహాన్ని రుయా ఆసుపత్రికి తరలించారు. ఈస్ట్ ఎస్సై రామస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 28, 2026 / 04:02 PM IST