కోనసీమ: పి.గన్నవరం మండలం పరిధిలో డొక్కా సీతమ్మ ఆక్విడెక్ట్ వద్ద నిర్వహించిన టైలర్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్టానిక్స్ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుట్టు మిషన్ సృష్టికర్త విలియమ్స్ హొవే విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టైలర్ల వృత్తి సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.
ATP: తాడిపత్రి మండలం ఆలూరు కోన రంగనాయక స్వామి ఆలయానికి వెళ్లే రహదారి సమస్యకు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి శాశ్వత పరిష్కారం చూపారు. గత కొన్ని ఏళ్లుగా సరైన రోడ్డు లేక భక్తులు, గ్రామస్థులు వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే వెంటనే స్పందించి, ఆలూరు నుంచి ఆలూరు కోన వరకు పూర్తిస్థాయి రహదారి నిర్మాణం చేయించారు.
సత్యసాయి: పరిగి మండలం కొడిగెనహల్లిలో 1 కోటి 80 లక్షల రూపాయలతో బీసీ బాలుర వసతి గృహ నూతన భవన నిర్మాణం కొరకు శనివారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత భూమి పూజ చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ప్రకాశం: మర్రిపూడి మండలం చీమట గ్రామానికి చెందిన గర్భిణీకి పురిటి నొప్పులు అధికమవడంతో కుటుంబీకులు అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. హుటాహుటిగా చేరుకున్న సిబ్బంది ఒంగోలు వైద్యశాలకు తరలిస్తుండగా చీమకుర్తి సమీపంలో నొప్పులు అధికమై పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు 108 సిబ్బంది శివ, సుభాని తెలిపారు. కుటుంబీకులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
TPT: తూకివాకం పంచాయితీ ఎస్.యన్.పురంలో కలెక్టర్ వెంకటేశ్వర్లు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేశారు. లబ్ధిదారుల సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేశామని చెప్పారు. ఇవాళ పింఛన్ తీసుకోనివారు సోమవారం కూడా పింఛన్ తీసుకోవచ్చని తెలిపారు.
AKP: ఎలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో రేపు సబ్ జూనియర్స్ బాలుర, బాలికల రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ కన్వీనర్ కొఠారు నరేష్ తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు పోటీలు ప్రారంభం అవుతాయన్నారు. 2010 అక్టోబర్ 1 తరువాత జన్మించిన వారు అర్హులుగా పేర్కొన్నారు.
KDP: అంగన్వాడీలకు వేసవి సెలవులు 15 నుంచి 30 రోజులకు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. జీతాలు పెంచాలని ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు రాష్ట్ర ఆర్థిక స్థితిని అర్థం చేసుకోవాలన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. త్వరలో దీనిపై కీలక అప్డేట్ వస్తుందన్నారు.
NDL: కోవెలకుంట్ల (M) కంపమల్ల గ్రామంలోని రాజ కాలనీలో మురుగు కాలువలు చెత్తాచెదారంతో నిండిపోయాయి. వ్యర్థాలు పేరుకుపోవడంతో మురుగునీరు ప్రవహించక నిలిచిపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది.ఈ కారణంగా దోమల బెడద పెరిగి రోగాలు వ్యాపించే ప్రమాదం ఉందని కాలనీవాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీరు రోడ్లపైకి చేరుతుండటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
KRNL: ఆలూరు నియోజకవర్గం మానేకుర్తి గ్రామపంచాయతీ పరిధిలోని అంగస్కల్ గ్రామంలో శ్రీమతి వైకుంఠం జ్యోతి ఆదేశాల మేరకు పింఛన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు దాదావళి,డీలర్ దేవేంద్ర, విద్యా కమిటీ ఛైర్మన్ ఉసేన్ చేతుల మీదిగా ఇవాళ పింఛన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు యంకప్ప, కార్యకర్తలు నగేష్, బూత్ ఇంచార్జీ మౌలాలి పాల్గొన్నారు.
NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంను శనివారం కోమటిరెడ్డి వెంకటరెడ్డి దర్శించారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు.
PDL: కృష్ణనదిలో ప్రయాణం చేసే పడవలకు ఫిట్నెస్ లేదని MPDO శ్రీనివాసరావు CI శ్రీనివాస్లు గత 3మాసాల క్రితమే, పడవలను సీజ్ చేశారు. మాదిపాడు, గింజుపల్లి, తాడువాయి, చామర్తి, KVపాలెం నది ప్రాంతంలో యధా విధంగా మళ్లీ పడవ ప్రయాణం సాగుతుందని స్థానిక ప్రజలు తెలిపారు. ఫిట్నెస్ లేకుండా పడవ ప్రయాణం కొనసాగడం, ప్రజల ప్రాణాలతో చెలగాట మాడటమేనని ప్రజలు మండిపడ్డారు.
GNTR: పిడుగురాళ్ల 7వ వార్డులో శనివారం ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఆదివారం సెలవు కావడంతో ప్రభుత్వం ఒక రోజు ముందుగానే పంపిణీ చేపట్టినట్లు ఆయన తెలిపారు. సచివాలయ సిబ్బంది ద్వారా ఎంతో పారదర్శకంగా, లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్లు చేరుస్తున్నామని పేర్కొన్నారు.
E.G: కోరుకొండ మండలం గాడాల గ్రామంలో శనివారం నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రూడా చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు. గ్రామానికి చెందిన లబ్ధిదారులకు పింఛన్ అందజేసి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు అండగా నిలబడటం తమ బాధ్యత అన్నారు.
ATP: తాడిపత్రిలోని చింతల వెంకటరమణస్వామి దేవస్థానాన్ని సందర్శించాలని అహోబిల మఠం పీఠాధిపతులు శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికులను ఆలయ అర్చకులు శ్రీ చింతలరాయన్ ఆహ్వానించారు. అహోబిలంలో పీఠాధిపతిని కలిసి స్వామివారి మర్యాద మాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుప్పావై సేవ కార్యక్రమ నిర్వహణ తీరుపై పీఠాధిపతితో చర్చించారు.
ప్రకాశం: కనిగిరి కేటీఆర్ టెక్నో స్కూల్ ప్రాంగణంలో వేంచేసియున్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం స్వామి వారికి పల్లకి సేవాకార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. దేవస్థానం అర్చకులు చోడా వీరభద్రస్వామి పూజలు నిర్వహించి భక్తులుకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు కుందూరు తిరుపతిరెడ్డి భక్తులు పాల్గొన్నారు.