CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలోని వీరాంజనేయ స్వామి ఆలయంలో మార్చి 27న శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 11.57 నుంచి 12.46 వరకు అభిజిత్ లగ్నంలో కార్యక్రమం జరుగుతుందన్నారు. భక్తులు ముందుగా పేర్లను నమోదు చేసుకుని రూ.300 టికెట్ తీసుకోవాలని ఈవో పెంచల కిశోర్ సూచించారు.