E.G: దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. బుధవారం కోరుకొండ బస్టాండ్ వద్ద దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 40 శాతం వైకల్యం దాటిన దివ్యాంగులకు ‘దివ్యాంగ శక్తి’ పథకం వర్తిస్తుందని వెల్లడించారు.
PLD: ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని వినుకొండలో బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండ్లో జరిగిన ఈ కార్యక్రమంలో వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొని పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివ్యాంగులతో కలిసి బస్సులో స్వయంగా ప్రయాణిస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
తిరుపతి జిల్లాలో కిరణ్ కుమార్ అలియాస్ అగ్గిపెట్టె మచ్చ అదృశ్యం అయ్యాడు. చిగురువాడ పంచాయతీ కొత్తూరు YSR కాలనీకి చెందిన కిరణ్ ఈనెల 16 నుంచి కనిపించడం లేదని అతని అక్క సుజాత తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒక ఫోన్ కాల్ రావడంతో బయటకు వెళ్లిన కిరణ్,ఆ తర్వాత తిరిగి రాలేదని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
VZM గజపతినగరం మండలంలోని బంగారమ్మపేట గ్రామంలో బుధవారం పామాయిల్ తోటలో అగ్ని ప్రమాదం జరిగింది. పల్ల చంద్రరావుకు చెందిన 30 ఎకరాల పామాయిల్ తోటలో ఐదు ఎకరాల పామ్ ఆయిల్ తోటలోని డ్రిప్ ఇరిగేషన్ పైపులు కాలిపోయాయి. సుమారు లక్ష రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. అగ్నిమాపక కేంద్రం అధికారి రవి ప్రసాద్ సిబ్బందితో వెళ్లి మంటలను ఆర్పి వేశారు.
KKD: పిఠాపురం RTC కాంప్లెక్స్లో కూటమి నాయకులు ‘దివ్యాంగుల శక్తి’ పథకం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా DCCB బ్యాంక్ ఛైర్మన్ తుమ్మల రామస్వామి, Ex.MLA దొరబాబు, ఇతర కూటమి నాయకులు పాల్గొని, రిబ్బన్ కట్ చేసి దివ్యాంగుల ఉచిత బస్సును ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం దివ్యాంగులకు కల్పించిన ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
NLR: ఉదయగిరి ఆర్టీసీ డిపోలో బుధవారం ‘దివ్యాంగ శక్తి’ పథకంను ప్రారంభించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలానీ డిపో మేనేజర్ రమేశ్ కుమార్ తెలిపారు. ఈ పథకం ద్వారా 300 మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ పథకాన్ని జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
KRNL: ఆదోని మండలం చాగి గ్రామంలో బుధవారం ప్రమీల (23) అనే యువతి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. భీమప్ప, నాగలక్ష్మి దంపతుల మూడో కుమార్తె అయిన ఈమె, బీ-ఫార్మసీ పూర్తి చేసి ఆదోనిలోని ఒక మెడికల్ షాపులో పనిచేస్తోంది. ఈ క్రమంలో బలవన్మరణానికి పాల్పడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మార్కాపురం పురపాలక సంఘం ప్రత్యేక అధికారిగా, ఆర్డీవో పెంచల ప్రభాకర్ బుధవారం తన చాంబర్లో బాధ్యతలు చేపట్టారు. సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ ఆదేశాలను సమర్థవంతంగా అమలుపరుస్తానని, మార్కాపురం పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ సిబ్బంది ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రకాశం: యర్రగొండపాలెం ఆర్టీసీ బస్టాండ్లో బుధవారం దివ్యాంగ శక్తి పథకాన్ని టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగులు సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. దివ్యాంగులకు బస్సులో ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం కోసం ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మకమైన పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎరిక్షన్ బాబు తెలిపారు.
ప్రకాశం: కనిగిరిలోని ఆర్టీసీ డిపోలో దివ్యాంగులకు ప్రభుత్వం కల్పించిన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి బుధవారం ప్రారంభించారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం లాగానే దివ్యాంగులకు కూడా ప్రభుత్వం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
GNTR: AISF రాష్ట్ర సమితి సభ్యురాలిగా, రాష్ట్ర యువజన వేదిక కో-ఆర్డినేటర్గా జి. అంజలి మంగళవారం నియమితులయ్యారు. విశాఖపట్నంలో జరిగిన AISF రాష్ట్ర సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అంజలి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ AISF మహిళా కార్యదర్శిగా ఉన్నారు. అంజలిని AISF, ANU ఇంఛార్జ్ పాలం నాసరయ్య, తదితరులు అభినందించారు.
VSP: సేవలకు ప్రతిరూపం బ్రహ్మకుమారీస్ అని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ అన్నారు. బుధవారం డాబాగార్డెన్స్ ప్రెస్ క్లబ్లో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకలలో అయిన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… బ్రహ్మకుమారీస్ సమాజ సేవలో ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామ్ రాజు పాల్గొన్నారు.
SKLM: లావేరు మండలం సుభద్రాపురంలో ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ఎమ్మెల్యే ఈశ్వరావు జెండా ఊపి ఈ పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఈ పథకం ద్వారా దివ్యాంగ సోదర సోదరీమణులకు సహాయం చేయాలని భావించారని తెలిపారు. అలాగే, సహాయకులకు 50% టిక్కెట్ రాయితీ కల్పించారన్నారు.
ASR: గంజాయి నివారణకు చేపడుతున్న ఆపరేషన్ వజ్రప్రహర్లో భాగంగా జీకే వీధి, కొయ్యూరు మండలాల పోలీసులు సంయుక్తంగా సరిహద్దు గ్రామాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అన్నవరం, కన్నవరం ప్రాంతాల్లో జీకే విధి సీఐ సుధాకర్ నేతృత్వంలో రెండు మండలాల ఎస్సైలు బుధవారం ఇంటింటికి వెళ్లి తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 50 లీటర్ల సారా, పులుపు లభ్యమైనట్లు ఎస్సై సురేష్ తెలిపారు.
AKP: సీఎం చంద్రబాబు ఈనెల 23న నక్కపల్లిలో పర్యటించనున్నట్లు ఎస్ రాయవరం మండల టీడీపీ అధ్యక్షుడు అమలకంటి అబద్ధం తెలిపారు. సీఎం పర్యటనకు జన సమీకరణపై బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు నాయకుల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. మండలం నుంచి సీఎం పర్యటనకు వచ్చే వారి కోసం 40 బస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.