E.G: రాజమండ్రి రూరల్ కొంతమూరులో నడి రోడ్డుపై మూగజీవులు సంచారం చేస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఆవులు ప్రమాదకరంగా నడిరోడ్డుపై తిష్ట వేయడంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఎయిర్పోర్ట్, కోరుకొండ ప్రధాన రహదారి కావడంతో నిత్యం వందలాది వాహనాలు తిరుగుతాయి. ఎటువంటి ప్రమాదాలు జరుగగా ముందే నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ATP: గార్లదిన్నె మండలంలో సింగరప్ప స్వామి తిరునాల సందర్భంగా ఈనెల 21, 22 తేదీల్లో రాష్ట్రస్థాయి రాతిదూలం లాగుడు పోటీలు జరుగుతాయని గ్రామస్తుల శుక్రవారం తెలిపారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. ఈనెల 21న న్యూ కేటగిరి విభాగానికి పోటీలు ఉండగా, 22న సీనియర్ కేటగిరి విభాగానికి పోటీలు జరుగుతాయన్నారు. గెలుపొందిన వారికి బహుమతులను అందజేస్తామన్నారు.
KKD: కాకినాడ కలెక్టరేట్లోని వికాస కార్యాలయంలో ఈనెల 23న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ) లచ్చారావు శుక్రవారం ప్రకటించారు.10th ఆపై చదివిన, 35 ఏళ్ల లోపు అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 9 గంటలకే వికాస కార్యాలయానికి చేరుకోవాలని సూచించారు.
TPT: పిచ్చాటూరు మండలంలోని జేబీఆర్ విద్యాసంస్థల్లో పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు “ఫీల్ ది థ్రిల్” నినాదంతో ఫేర్వెల్ వేడుకలు నిర్వహించారు. నాగలాపురం ఎస్సై సునీల్, ఎంఈవో-2 యుగంధర్ రాజు ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు ఆశీస్సులు అందించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులు అందజేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
TPT: సత్యవేడు మండలం మదనంబేడు గ్రామంలోని పునర్నిర్మిత శ్రీ అంకాలపరమేశ్వరి ఆలయంలో మహా కుంభాభిషేక వేడుకలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉదయం గణపతి పూజ, కంకణ ధారణ, యాగశాల కలశ స్థాపన నిర్వహించారు. సాయంత్రం వాస్తు పూజలు జరిపారు. మూడు రోజుల పాటు వేడుకలు కొనసాగనుండగా, ఆలయం దీపాలతో అలంకరించబడింది. భక్తులకు అన్నదానం కూడా నిర్వహిస్తున్నారు.
కడప జిల్లాలో మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడా జరగకుండా కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాధ్ ఆదేశించారు. జమ్మలమడుగు, పులివెందుల సబ్-డివిజన్ నేర సమీక్షా సమావేశాల్లో మహిళా భద్రత, సోషల్ మీడియా వేధింపులపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
VZM: ఎస్.కోట MLA కోళ్ల లలిత కుమారి శుక్రవారం వేపాడ, కొత్తవలస మండలాల్లో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ మేరకు ముందుగా ఆమె కొత్తవలసలో విజయ ఆంజనేయ విగ్రహ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సోంపురం గ్రామంలో గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి 5వ వార్షికోత్సవం, అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు.
మన్యం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జిల్లాలో గల విద్యా సంస్థల్లో బాల్యవివాహాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు బాలల సంరక్షణ అధికారి (NIC)ఎం.ఏ నాయుడు తెలిపారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. టౌన్లో గల డీవీఎం హైస్కూల్, బెలగాం గర్ల్స్ హై స్కూల్, పలు అంశాలపై అవగాహన కల్పించారు.
అల్లూరి జిల్లాలోని, గ్రామ పంచాయతీల్లో ఇంటింటా చెత్త సేకరణ కోసం స్వచ్ఛభారత్-స్వచ్ఛాంధ్రలో భాగంగా, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి 4 ఈ-ఆటోలు, 25 ట్రై సైకిళ్లు జిల్లాకు వచ్చాయని అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ శుక్రవారం తెలిపారు. ఐటీడీఏ కార్యాలయంలో ఆర్డీవో లోకేశ్వరరావు, స్వర్ణ గ్రామ-స్వర్ణ వార్డు శాఖ జిల్లా నోడల్ అధికారి పీఎస్ కుమార్తో కలిసి ప్రారంభించారు.
ప్రకాశం: పామూరులో శుక్రవారం వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. దర్శి మోటార్ వాహనాల తనిఖీ అధికారి రవికుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో పత్రాలు సరిగా లేని వాహనాలను పరిశీలించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడుపుతున్న ఐదు ఎలక్ట్రిక్ ఆటోలకు పెనాల్టీ విధించి సీజ్ చేశారు. ఎంవీఐ రవికుమార్ మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలన్నారు.
VSP: భారతీయ రైల్వే వాల్తేయిర్ డివిజన్ ఆధ్వర్యంలో వైశాఖి రైల్వే కాలనీలో నిర్మించిన అధికారుల కొత్త వసతి గృహాన్ని డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా, జ్యోత్స్న బోహ్రా శుక్రవారం ప్రారంభించారు. నివాస సముదాయంలో నాలుగు టైప్–వీ, ఒక టైప్–VI క్వార్టర్ యూనిట్లు నిర్మించగా, సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసింది.
TPT: తిరుపతి పట్టణ ప్రణాళిక విభాగంలో పెండింగ్లో ఉన్న కోర్టు కేసులను త్వరగా పరిష్కరించాలని కమిషనర్ N. మౌర్య, అధికారులను ఆదేశించారు. శుక్రవారం జరిగిన సమావేశంలో, B.P.S, L.R.S దరఖాస్తులపై కూడా చర్చించారు. అలాగే పిటిషన్ దారులు, న్యాయవాదులతో సంప్రదింపులు జరపాలని కమిషనర్ సూచించారు.
CTR: కార్వేటి నగరంలో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ శనివారం పర్యటిస్తారని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలు తెలిపింది. పర్యటనలో భాగంగా ఉదయం 10 గంటలకు కార్వేటినగరం పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో స్వచ్ఛ రథం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
కృష్ణా: పెనమలూరు బీసీ సెల్ అధ్యక్షుడు సంగేపు రంగారావు, ప్రధాన కార్యదర్శి వనకూరు విక్రమ్,కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీసీ సెల్ కమిటీ ఆధ్వర్యంలో అవసరమైన ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో చేరేలా కృషి చేయాలన్నారు.
KRNL: పేదల సంక్షేమానికి అత్యధికంగా నగదు బదిలీ పథకం విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత ఏపీ రాష్ట్రానికే దక్కుతుందని ఆదోని MLA పార్థసారథి ఇవాళ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడారు. సీఎం చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను తొలి ఏడాదిలోనే అమలు చేసి చూపించారన్నారు. గత YCP ప్రభుత్వంలో జల్ జీవన్ మిషన్ కింద రూ. 26 వేల కోట్లు వృథా చేశారన్నారు.