SKLM: అరసవల్లి సూర్యనారాయణ స్వామి మూల విరాటు పై తొలి సూర్యకిరణాలు స్పృశించే అద్భుత ఘట్టం ఈ నెల 9, 10 తేదీల్లో ఆవిష్కృతం కానుందని ఆలయ ఈవో ప్రసాద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్తరాయణ, దక్షిణాయణ కాల మార్పుల్లో భాగంగా ఆలయ గర్భాలయంలో కొలువైన ఆదిత్యుని పాదాలపై నేరుగా తొలి సూర్యకిరణాలు తాకనున్నాయి అని తెలిపారు.
VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గురువారం అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబునాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన పార్లమెంట్ పరిధిలో పలు రకాల అభివృద్ధి కార్యకలాపాలు, మౌలిక సదుపాయాల గురించి చర్చించినట్లు ఆయన తెలిపారు. అలాగే ముస్లిం సోదరుల సమస్యలను కూడ సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లుగా ఆయన తెలిపారు.
SKLM: మహిళలు అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్, డయల్ 112 సేవలను వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లాలోని ఆదిత్య కళాశాలలో మహిళా దినోత్సవం వారోత్సవాల సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్నారు. మహిళల భద్రతకు పోలీస్ శాఖ ప్రాధాన్యత ఇస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వివేకానంద, పోలీసు సిబ్బంది ఉన్నారు.
AKP: గొర్రెలు, మేకల్లో పారుడు వ్యాధి నివారణకు టీకాలు వేయించాలని పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ చిట్టినాయుడు సూచించారు. చీడికాడ మండలం జైతవరం గ్రామంలో గురువారం గొర్రెలు, మేకలకు పారుడు వ్యాధి నివారణకు టీకాలు వేశారు. గొర్రెలు, మేకల ఆరోగ్యంపై పెంపకం దార్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వాటికి వ్యాధులు సోకితే సకాలంలో చికిత్స చేయించాలన్నారు.
PPM: అద్దె బస్సుల డ్రైవర్లు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు CITU జిల్లా కార్యదర్శి ఎస్.వై నాయుడు మాట్లాడుతూ.. గురువారం రాత్రి ఓనర్లకు, డ్రైవర్ ప్రతినిధులకు జరిగిన చర్చలు విజయవంతం అయ్యాయని తెలిపారు. డ్రైవర్లకు జీతాలు పెంచడానికి, ప్రమాదాలు జరిగినప్పుడు ఓనర్లు బాధ్యత వహించడానికి, పండగ బోనస్ ఇవ్వడానికి ఓనర్లు సమ్మతించడంతో సమ్మె విరమించామన్నారు.
VSP: జీవీఎంసీ 50వ వార్డు సాయిరాం నగర్లో గురువారం సాయంత్రం వైసీపీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. 50వ వార్డు కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్ పాల్గొని పలు సూచనలు చేశారు. పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ అధికారం చేపట్టేందుకు కృషి చేయాలన్నారు.
అన్నమయ్య: రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరద రాజుల రెడ్డి గారు, గిద్దలూరు ఎమ్మెల్యే ఎం. అశోక్ రెడ్డి గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శాఖలకు సంబంధించిన పలు అంశాలు, ప్రాంతీయ అభివృద్ధి మరియు ప్రజా సమస్యలపై మంత్రితో చర్చించినట్లు తెలిపారు.
NDL: నిషేధిత వస్తువులను శ్రీశైలం ఆలయ ప్రాంగణంలోకి తీసుకువస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎస్వో శ్రీనివాసరావు హెచ్చరించారు. ఆలయ సమీపంలోని టోల్గేట్ వద్ద వాహనాలను ఆయన గురువారం తనిఖీ చేశారు. ఎటువంటి మత్తు పదార్థాలను తీసుకు రావద్దని సూచించారు. ఆలయ ప్రాంగణంలోకి అన్యమత ప్రచార వస్తువులను తీసుకువస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
కడప: YCP నుంచి TDPలోకి రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి. ఇటీవల ముగ్గురు కార్పొరేటర్లు TDPలో చేరగా తాజాగా మరో కార్పొరేటర్ చేరారు. కడప MLA మాధవి రెడ్డి,TDP పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో 5వ డివిజన్ కార్పొరేటర్ బండి జయమ్మతోపాటు, డివిజన్ ఇంఛార్జ్ బండి ప్రసాద్ పార్టీ మారారు. CM చంద్రబాబు వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ATP: బుక్కరాయసముద్రం పంచాయతీ పరిధిలోని దేవరకొండ వద్ద దుండగులు గృహిణి మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును అపహరించారు. బాధితురాలు ప్రమీల తన భర్త శివయ్యతో కలిసి ద్విచక్రవాహనంలో పి.కొత్తపల్లికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దారిలో ఇద్దరు వ్యక్తులు చిరునామా అడుగుతున్నట్లు నటించి వాహనాన్ని ఆపారు. అదును చూసి ప్రమీల మెడలోని గొలుసు తెంచుకుని పరారయ్యారు.
అన్నమయ్య: రామసముద్రం కేజీ బీవీలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ మస్తాన్బీ తెలిపారు. మార్చి 12 నుంచి ఏప్రిల్ 1 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ఆరులో 40, 7లో 5, తొమ్మిదో తరగతిలో ఒక సీటు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సీఈ సీలో 40 సీట్లు ఉన్నట్లు చెప్పారు.
KRNL: హాలహర్వి పోలీస్ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 47 వాహనాలను బహిరంగ వేలం గురువారం నిర్వహించారు. ఈ వేలంలో 2 కార్లు, 1 ఆటో, 42 ద్విచక్ర వాహనాలను వేలం వేయగా, మొత్తం రూ. 5.25 లక్షలు GSTతో సహా ఆదాయం ఎస్ఐ ఈశ్వరరావు తెలిపారు. వేలంలో 2 కార్లు అమ్ముడుపోలేదు. ఈ వేలంపాటలో ఎక్సైజ్ సూపర్డెంట్ కర్నూల్ రామకృష్ణారెడ్డి, అయ్యస్వామి, నాయక్, అశోక్ పాల్గొన్నారు.
GNTR: ఈ నెల 8న అమరావతిలోని పరేడ్ గ్రౌండ్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరగనుంది.సీఎం చంద్రబాబు పాల్గొనే ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధి కోసం 36 ఎంఓయులు చేసుకోవడంతో పాటు, 4 ఎన్ఆర్ఎల్ఎం క్లస్టర్లు ప్రారంభించనున్నారు.అలాగే డ్వాక్రా సంఘాలకు చెక్కులు, అర్హులైన మహిళలకు వాహనాలను పంపిణీ చేయనున్నట్లు మంత్రులు సవిత, గుమ్మడి సంధ్యారాణి గురువారం వెల్లడించారు.
AKP: అక్రమంగా నిల్వ చేసిన 100 టేకు దుంగలను ఫారెస్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. మాకవరపాలెం మండలంలోని సీతన్నఆగ్రహారం వెళ్లే రహదారి పక్కన ఉన్న తోటల్లో టేకు దుంగలు నిల్వ చేసినట్టు అందిన సమాచారంతో గురువారం తనిఖీలు చేసి వీటిని స్వాధీనం చేసుకున్నారు. అపరాధ రుసుము విధిస్తామని ఫారెస్ట్ బీట్ అధికారి మోహనరావు తెలిపారు.
PPM: కురుపాం MLA తోయక జగదీశ్వరీ గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును విజయవాడలో ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పలు సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులను పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు కావడంతో రైతుల అభివృద్ధికు మరిన్ని రాయితీలను అందించాలని కోరనట్లు ఆమె తెలిపారు.