NLR: రైతులకు గిట్టుబాట ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. మనుబోలులో ఇవాళ ఆయన పర్యటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. మిల్లర్లతో సోమిరెడ్డి మిలాఖత్ అయి దోచుకుంటున్నారని ఆరోపించారు.