VZM: విభిన్న ప్రతిభావంతులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు ఉద్దేశించిన ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని స్థానిక RTC ఆవరణలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ సేధు మాధవన్, ఎమ్మెల్యే అధితి గజపతిరాజు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.