నందమూరి తారకరత్న ఆరోగ్యం క్రిటికల్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన్ను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి ప్రత్యేక వైద్యుల బృందంతో చికిత్స చేయిస్తున్నారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మరికొన్ని రోజులు చికిత్స అందించాలని వైద్యులు తెలిపినట్టు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ నిన్నటి నుంచి తారకరత్నతోనే ఉన్నారు. ఇవాళ కూడా ఇంకా బెంగళూరులోనే ఉన్నారు. న...
దేశమంతా గణతంత్ర వేడుకల్లో మునిగి ఉంటే ఆంధ్రప్రదేశ్ లోని మాచర్లలో మాత్రం రౌడీల్లాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవర్తించారు. పాఠశాలలో విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేసే విషయంలో మొదలైన వివాదం పరస్పరం వీధి రౌడీల్లా దాడులు చేసుకునే స్థాయికి చేరింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాల మధ్య జరిగిన గొడవ పాఠశాలలో ఉద్రిక్తతకు దారి తీసింది. బాహాబాహీకి దిగడంతో విద్యార్థులు భయాందోళనలతో ఇళ...
బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో తారకరత్నకు చికిత్స జరుగుతోంది. డాక్టర్లు ప్రస్తుతం ఐసీయూలో తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు. ఎమర్జెన్సీ చికిత్సలో భాగంగా ఎక్మో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. 48 గంటల పాటు ఎక్మో చికిత్స అందించనున్నారు. కుప్పం హాస్పిటల్ నుండి నిన్న అర్ధరాత్రి తారకరత్నను బెంగళూరుకు తరలించారు. ఇక్కడ ఎక్మో చికిత్సను అందించే మూడు హాస్పిటల్లలో నారాయణ హృదయాలయ ఆస్పత్రి ఒకటి. చంద్రబ...
వైఎస్ వివేక హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు వెళ్తూ వైఎస్ విజయలక్ష్మితో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఆమెను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం కోఠిలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లి అధికారుల విచారణకు హాజరుకానున్నారు. వైఎస్ వివేక హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి పాత్ర ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో ఈరోజు సీబీఐ విచారణకు హాజరుకున్నారు. అవినాశ్ స్టేట్ మెంట్...
నందమూరి తారకరత్నను కుప్పం పీఈస్ హాస్పిటల్ నుండి వైద్యులు బెంగుళూరుకు తరలించారు. రెండు ప్రత్యేక అంబులెన్స్ లో తారకరత్నను నారాయణ హృదయాలయ హాస్పిటల్ సిబ్బంది తరలించింది. అత్యధునిక పరికరాలుతో కూడిన అంబులెన్స్ లో తరలించారు. నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న తీవ్ర అస్వస్థకు గురై, సొమ్మసిల్లి పడిపోయిన విషయం తెలిసిందే. అనంతరం అతనిని ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు మెరుగైన చికిత్స క...
ఇండియా పోస్ట్ దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 40,889 జీడీఎస్, బీపీఎం, ఏబీపీఎం పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మొత్తం నోటిఫికేషన్ లో ఏపీకి సంబంధించి 2,480 పోస్టులు, తెలంగాణ నుంచి 1266 పోస్టులు ఉన్నాయి. మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష సబ్జెక్టులతో పదో తరగతిపాసైన వారు ఈ పోస్టుకు అర్హులు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ...
నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కుప్పం బహిరంగ సభలో టిడిపి ఏపీ అధ్యక్షులు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. యువత భవిష్యత్తు కోసమే లోకేష్ యువగళం అన్నారు. లోకేష్ దమ్మున్న మగాడు అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు, యువత భవిష్యత్తును కాపాడేందుకు లోకేష్ తొలి అడుగు వేశారన్నారు. రాష్ట్ర చరిత్రలో ఈ రోజు ప్రత్యేకంగా నిలిచిపోతుందన్నారు. అధికారం కోసమైతే లోకేష్ 400రోజులు 4వేల ...
తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. నేడు శ్రీ వేంకటేశ్వర స్వామివారు సప్త వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో స్వామివారు భక్తులకు కనిపించనున్నారు. మలయప్పస్వామిని దర్శించుకునేందుకు భక్తులు కిక్కిరిసిపోయారు. భక్తులు గ్యాలరీల్లో ఉండి వాహన సేవలను తిలకించేందుకు టీటీడీ అధికారులు ప్రత్యేకంగా షెడ్లను ఏర్పాటు చేశారు. అలాగే అన్న ప్రసాదాలు, పాలు, నీటిని టీటీ...
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నేడు సీబీఐ ముందు ఎంపీ అవినాష్ రెడ్డి హాజరుకాబోతున్నారు. వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. దీనిలో భాగంగా వైఎస్సార్ సీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ రెండు సార్లు నోటీసులు జారీచేసింది. దర్యాప్తునకు హాజరుకావాలంటూ సూచించింది. ఈ క్రమంలో వివేకా హత్య కేసులో ఇవాళ సీబీఐ ముందు కడప ఎంపీ మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయానికి రానున్నారు...
దేశ భవిష్యత్తు కోసమే బీఅర్ఎస్ తో ముందుకు వచ్చినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. డ్రాగన్ దేశం చైనా కంటే మన సంపద ఎక్కువ అని, కానీ అమెరికా, చైనా దేశాలు ఇప్పుడు అభివృద్ధిలో ఏ స్థాయిలో ఉన్నాయో చూస్తూనే ఉన్నాం అన్నారు. స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏళ్ల తర్వాత కూడా దేశంలో తాగేందుకు మంచినీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో పూర్తి స్థాయిలో సాగునీరు అందడం లేదన్...
నేడు రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యభగవానుడి నిజరూప దర్శనాన్ని చూసేందుకు అరసవల్లికి భక్తులు తరలివచ్చారు. శుక్రవారం రాత్రే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. సూర్యభగవానుడి దర్శనం కోసం విచ్చేసే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనం కోసం క్యూలలో భక్తులు గంటల సేప...
సొంత నియోజకవర్గం సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. తాజాగా గణతంత్ర దినోత్సవం నాడు సొంత పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రిని చెప్పుతో కొడతానని సంచలన వ్యాఖ్యలు చేసింది. పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేశామని.. ఇప్పుడు తమ కూతురును చదివించుకోలేమని పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేసింది. జగన్ అధికారంలోకి రావడంతో ఎలాంటి ప్రయోజనం లే...
యువగళం పేరుతో టీడీపీ యువనేత నారా లోకేశ్ ఈరోజు నుంచి ఏపీలో పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. ఇవాళ ప్రారంభమైన పాదయాత్రలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో పాదయాత్ర ప్రారంభం అయిన తర్వాత లోకేశ్ తో పాటు పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ...
నెలన్నర ముందు వివాహ మండపం బుక్ చేసుకుంటే తీరా పెళ్లి సమయం వచ్చేసరికి మండపం నిర్వాహకులు షాకిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఉండడంతో తాము మండపం ఇవ్వలేమని తేల్చి చెప్పారు. దీంతో హడావుడిగా వెంటనే వేరే మండపం కోసం కాబోయే దంపతులు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది. సీఎం జగన్ పర్యటన తమ చావుకొచ్చిందని ఆ కుటుంబసభ్యులు వాపోయారు. ఈ సంఘటన ఏపీలోని విశాఖపట్టణంలో జరిగింది. దీనికి సంబంధించిన ...
‘యువగళం’ పేరిట కుప్పం నుంచి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జనాల తాకిడికి నటుడు నందమూరి తారకరత్న సొమ్మసిల్లిపడిపోయాడు. అతడి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి అతడి శరీరం నీలిరంగులోకి మారిందని చెప్పారు. మెరుగైన చికిత్స కోసం తారకరత్నను తెలుగుదేశం పార్టీ నాయకులు బెంగళూరుకు తరలిస్తున్నట్లు సమాచారం. ల...