E.G: తాళ్ళపూడి మండలం మలకపల్లిలో నిర్వహించిన ప్రజావేదికలో గ్రామానికి చెందిన సనమండ్ర పోసియ్యకు చెందిన గృహాన్ని నిర్మిస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు లబ్ధిదారుడి గృహాన్ని హౌసింగ్ డిపార్ట్మెంట్, MRO గురువారం పరిశీలించారు. లబ్దిదారుడికి హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.