అన్నమయ్య: రాయచోటిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన సత్యసాయి జిల్లా నంబులపూలకుంట మండలానికి చెందిన దేరంగుల శ్రీనివాసులు అనే వ్యక్తికి కోర్టు 10 రోజుల జైలు శిక్ష విధించింది. బుధవారం ట్రాఫిక్ సీఐ కుళాయిప్ప విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడటంతో అతడిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం జైలు శిక్ష ఖరారైనట్లు పేర్కొన్నారు.
CTR: కుప్పం ద్రవిడ వర్సిటీ ప్రాంగణంలోని మహాత్మ జ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల (బాలికలు) 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ సరోజ తెలిపారు. విద్యార్థులు మార్చి 4లోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
KDP: తాళం పగలగొట్టి 3 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఘటన బద్వేలు పట్టణంలోని రిక్షా కాలనీలో బుధవారం జరిగింది. పోలీసుల వివరాలు మేరకు కాలనీకి చెందిన ప్రభావతి ఇంటికి తాళం వేసి పని నిమిత్తం టౌన్లోకి వెళ్లారు. తిరిగి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉంది. బీరువా పరిశీలించగా బంగారు ఆభరణాలు చోరీ జరిగినట్లు గుర్తించి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ATP: రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య ‘చీకటి ఒప్పందం’ కుదిరిందని మాజీ ఎంపీ తలారి రంగయ్య విమర్శించారు. బుధవారం నంద్యాల వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సీమ ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నా చంద్రబాబు మౌనంగా ఉండటం దారుణమని మండిపడ్డారు.
KRNL: జిల్లాలో పక్కా గృహాల లబ్దిదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఇవాళ ఫోన్ ఇన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా హౌసింగ్ పీడీ టి. చిరంజీవి తెలిపారు. ఇనుము, సిమెంటు, ఇతర నిర్మాణ సామగ్రి రాకపోయినా, ఇల్లు నిర్మించుకుని బిల్లులు పెండింగ్ ఉన్నా, PMAY 2.0 అర్బన్ గృహాలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా లబ్ధిదారులు 08518- 257481 నంబర్లో సంప్రదించాలన్నారు.
NDL: డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి దంపతులు మంత్రి నారా లోకేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలో తనను కలిసిన ఎమ్మెల్యే కోట్లను మంత్రి ఆప్యాయంగా పలకరించారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోట్ల సుజాతమ్మకు మంగళగిరి చేనేత చీరను లోకేష్ అందజేశారు.
W.G: ఆకివీడులోని టపాసుల విక్రయశాలలను భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల ఉండిలో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు.. దుకాణాల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనల మేరకు జాగ్రత్తలు పాటించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అనకాపల్లి పట్టణం తాకాశి వారి వీధిలో వేంచేసియున్న నూకంబిక అమ్మవారి ఆలయంలో కొత్త అమావాస్య జాతరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ రాజేష్ తెలిపారు. మార్చి నెలలో జరిగే జాతరకు సంబంధించి బుధవారం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మూహుర్తపు రాట వేసారు. ప్రతి ఏటా అమ్మవారి జాతరను సంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.
ప్రకాశం: కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఫైబర్ సెక్యూరిటీ, సోషల్ మీడియా ఎనలిస్ట్ కోర్సుల్లో 3నెలలు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఉషారాణి తెలిపారు. 17 నుంచి 30 సంవత్సరాలు వయసు గల ఇంటర్, డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. రిజిస్ట్రేషన్ కొరకు 80088 22821 ను సంప్రదించాలన్నారు.
కృష్ణా: పెడన మండలంలోని అచ్చయ్యవారిపాలెం గ్రామంలో ఉపాధి హామీ నిధులతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను బుధవారం ఎంపీడీవో అరుణ పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు నాణ్యత ప్రమాణాలతో నిర్వహించాలని అధికారులకు ఆమె సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నందమూరు పంచాయతీ కార్యదర్శి జానకి పాల్గొన్నారు.
సత్యసాయి: పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి బుధవారం అసెంబ్లీలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించారు. రూ. 20 వేలలోపు వేతనం పొందుతున్న వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించేలా ప్రత్యేక జీవో జారీ చేయాలని కోరారు. గతంలో ఇచ్చిన క్రమబద్ధీకరణ హామీలను అమలు చేసి అర్హులైన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
E.G: విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో బుధవారం “ఆంధ్రప్రదేశ్ ఆటవిడుపు – 2026” క్రీడోత్సవాలు ఘనంగా జరిగాయి. నిడదవోలు MLA కందుల దుర్గేశ్ ఈ పోటీల్లో పాల్గొని టగ్ ఆఫ్ వార్, రన్నింగ్, కబడ్డీ ఆడి అలరించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు జట్టు భావనను పెంపొందిస్తాయని ఆయన తెలిపారు. ఉత్సాహంగా జరిగిన ఈ వేడుకలో పలువురు MLAలు, MLCలు పాల్గొని క్రీడాస్ఫూర్తిని చాటారు.
NTR: విజయవాడలో నాణ్యమైన జనరిక్ మందుల ప్రోత్సాహకంపై ముద్రించిన అవగాహన పోస్టర్లను లక్ష్మీశ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు స్వయంగా మందులు తీసుకోవడం నివారించాలని సూచించారు. లైసెన్స్ ఉన్న మెడికల్ షాపుల నుంచి బిల్లులతో మందులు కొనుగోలు చేయాలని, గడువు తేదీని తప్పనిసరిగా పరిశీలించి, వైద్యుల సూచించిన విధంగా మందులు వాడాలన్నారు.
SKLM: సోంపేట మండల పరిషత్ కార్యాలయంలో పీఎం సూర్య ఘర్ పథకం (సోలార్ రూఫ్ టాప్)పై ఇవాళ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తు న్నట్లు పలాస ఈఈ యజ్ఞేశ్వర రావు బుధవారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో సోలార్ రూ ప్టాప్ పెట్టుకోవడం వలన కలుగు లాభాలు, రాయితీ, బ్యాంకు రుణాలపై అవగాహన కల్పిస్తామన్నారు.