KKD: రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా 9 ఎయిర్ పోర్టులు నిర్మించే ప్రణాళికలో భాగంగా తుని – అన్నవరం మధ్య విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వం మొగ్గు చూపింది. తొలుత కరప మండలం గురజానాపల్లిలోని సాల్ట్ భూములను పరిశీలించినా, సాంకేతిక కారణాలతో తుని ప్రాంతాన్ని ఎంపిక చేస్తూ డీపీఆర్ సిద్ధం చేశారు.భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రభుత్వం ఇక్కడే నిర్మాణం చేయనున్నారు.
AKP: బహిరంగ మలమూత్ర విసర్జనను అరికట్టాలని కోటవురట్ల డిప్యూటీ ఎంపీడీవో కూర్మారావు విజ్ఞప్తి చేశారు. శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కోటవురట్లలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కూర్మారావు మాట్లాడుతూ.. ప్రజలు ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలన్నారు. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించి సంపద కేంద్రాలకు తరలించాలన్నారు.
GNTR: పరిశుభ్రమైన పరిసరాలే మన లక్ష్యమని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. స్వర్ణ ఆంధ్రా–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మేడికొండూరు మండలం పేరిచర్లలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద మొక్కలు నాటి, గ్రామంలో చెత్త ఊడ్చే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.
CTR: పలమనేరు మున్సిపల్ కమిషనర్ రమణా రెడ్డి ఆధ్వర్యంలో “స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర” ర్యాలీ శనివారం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి టవర్ క్లాక్ వరకు కొనసాగింది. కమిషనర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్య కార్మికులకు తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలని కోరారు. ప్రతి వార్డులో శానిటేషన్ సిబ్బంది స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు.
CTR: పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి బైరెడ్డిపల్లిలో ఆదివారం పర్యటించనున్నట్లు ఎంపీడీవో ఉపేంద్ర తెలిపారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో వెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారని చెప్పారు. అన్ని శాఖల అధికారులు తమ శాఖల పురోగతి నివేదికలతో సమావేశానికి హాజరు కావాలని ఆయన కోరారు.
ప్రకాశం: జరుగుమల్లిలో శనివారం నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా చెత్త ఊడ్చి పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించి, పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
CTR: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని శనివారం పుంగనూరు కొత్తయిండ్లు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా విజ్ఞాన వికాస సమితి అధ్యక్షలు రెడ్డప్ప రెడ్డి యాదవ్ నిర్వహించారు. ఈసందర్భంగా అయన విద్యార్థులను ఉద్దేశించి అయన ప్రశాంగించారు. అమ్మ వంటి మాతృభాషను ఎన్నటికీ మరవకూడదన్నారు. తెలుగు భాష యొక్క ఔన్నత్యం గురించి వివరించారు.
KDP: బద్వేలులో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యే డా. సుధ శుభాకాంక్షలు తెలిపారు. యద్దారెడ్డి స్వగృహంలో మాజీ కుడా చైర్మన్ గురుమోహన్ అభినందనలు తెలియజేశారు. ఆనంద నిలయంలో వైసీపీ నాయకులు సింగనమల వెంకటేశ్వర్లు కేక్ కట్ చేసి వృద్ధులకు అన్నదానం చేశారు.
PPM: ఈనెల 23వ తేదీ నుంచి మార్చి ఒకటో తేదీ వరకు మన్యం జిల్లా లో 33 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని DIEO వై.నాగేశ్వరరావు శనివారం ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 17,530 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. రెండు ఫ్లయింగ్, రెండు సిట్టింగ్ స్క్వాడ్స్, DEC మెంబర్స్ కన్వీనర్ DIEO మొత్తం నాలుగు వాహనాల్లో పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో తనిఖీలు నిర్వహిస్తారు.
E.G: రాజమండ్రి రూరల్ మండలం సుబ్బారావు పేటలో జరిగిన అగ్ని ప్రమాదంలో మద్దా నూతయ్య, వనులమ్మకు చెందిన తాటాకు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు ఏసు తదితరులు బాధిత కుటుంబ సభ్యులను శనివారం పరామర్శించి నిత్యవసర సరుకులు అందజేశారు. దృష్టి తీసుకెళ్ళి బాధితులకు న్యాయం చేస్తామన్నారు.
SKLM: స్వచ్ఛ ఆంధ్రా-స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం పట్టణంలో ప్రత్యేక శుభ్రతా కార్యక్రమం నిర్వహించారు. డీసీబీ కాలనీలో మొక్కలు నాటడం, ఉమా రుద్ర కోటేశ్వర స్వామి ఆలయం పరిసరాల్లో శుభ్రతా పనులు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ కార్మికులతో కలిసి స్వయంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజల సహకారం అవసరమని ఆయన అన్నారు.
సత్యసాయి: లేపాక్షి పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌవలసముద్రం టోల్ ప్లాజా వద్ద పోలీసులు శనివారం ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు. హిందూపురం రూరల్ సీఐ జనార్ధన్, ఎస్సై నరేంద్ర వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచిస్తూ, పలువురికి హెల్మెట్లు పంపిణీ చేశారు.
ATP: పెళ్లికి వెళ్తూ జరిగిన కారు ప్రమాదంలో ఉరవకొండకు చెందిన వైసీపీ కార్యకర్త నాగేష్ మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి నాగేష్ భౌతికకాయానికి శనివారం పూలమాల వేసి నివాళులర్పించారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యకర్తను కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ASR: ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి కొయ్యూరు మండలాభివృద్ధికి కృషి చేయాలని ఎంపీపీ బడుగు రమేశ్ సూచించారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.