రూ.500 నోట్లు రూ.90 లక్షలు ఇవ్వాలని.. రూ.కోటి విలువగల రూ.2 వేల నోట్లను ఇస్తామని ఓ ముఠా మోసం చేస్తోంది. వారి వెనక ఓ పోలీస్ అధికారి ఉన్నారు. ఘటనను ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకొని.. సదరు అధికారిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీచేశారు.
ఓ బాలిక పట్ల అండగా ఉండాల్సిన రక్షకభటుడే(constable) కామంధుడిగా మారి కాటేశాడు. తన ఇంట్లో పనిలో చేరిన బాలికపై ఆరునెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. అంతేకాదు ఎవరికైనా చెబితే చంపేస్తానని కూడా బెదిరింపులకు పాల్పడ్డాడు. అయినా కూడా ఆ అమ్మయి ధైర్యంగా పోలీసులకు చెప్పి అతన్ని అరెస్ట్ చేయించింది.
తెలుగు రాష్ట్రాలు ఎన్నికలకు ఇంకా 9 నెలల కంటే తక్కువ సమయం ఉన్నందున నెమ్మదిగా అన్ని పార్టీలు ఎన్నికల మూడ్లోకి ప్రవేశిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన కొత్త పరిణామం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో చేరిన పొంగులేటి శ్రీనివాస్రెడ్డి(Ponguleti srinivas reddy) గురువారం సాయంత్రం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(AP CM Jagan mohan red...
50 ఏళ్ల వయసులో ఇద్దరు కవలలకు జన్మనిచ్చిన మహిళ. ఇక సంతానమే కాదు అనుకున్న సమయంలో ఇద్దరు మగబిడ్డలకు జన్మనిచ్చింది.
దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాలకు న్యాయమూర్తులను మార్చుతూ కొలీజియం సిఫారసు చేసింది. ఏపీ, తెలంగాణకు కూడా సీజేలను మార్చుతూ ఉత్తర్వులు వెలువడ్దాయి.
ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధి హామీలో కొత్తగా 23 పనులను చేర్చుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అలాగే త్వరలోనే బకాయిలు ఉన్న కూలీలకు వారి ఖాతాల్లో నగదు జమ అవుతుందని అధికారులు తెలిపారు.
పవన్ తన మూడో భార్య అనా కొణిదెలకు విడాకులు ఇచ్చినట్లు నెట్టింట వార్తలు వైరల్ అయ్యాయి. వాటికి చెక్ పెడుతూ జనసేన ట్విట్టర్ వేదికగా పోస్ట్ షేర్ చేసింది.
జగన్ అక్రమాస్తుల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా సుప్రీం కోర్టు విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ కు నోటీసులు జారీ చేసింది.
పేద విద్యార్థుల చదువు కోసం ఉన్న ఆస్తి మొత్తాన్ని అమ్మి సేవామూర్తి గిరిజాదేవి సమాజ సేవ చేస్తున్నారు. విద్యార్థులకు సాయం చేస్తే అది వారికే కాదు రేపటి సమాజం కోసం అని బలంగా నమ్మే నిరాడంబరమూర్తి గిరిజాదేవి.
తెలుగు సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో అనంత శ్రీరామ్పై విమర్శలు గుప్పిస్తున్నారు.
అందరి హీరోల సినిమాలకు టిక్కెట్ రేటు పెంచి... పవన్ సినిమాలకు మాత్రం ఏపీ ప్రభుత్వం వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం నుండి తీవ్రమైన ఒత్తిడి కారణంగా నిర్మాతలు ఆశించిన మేరకు టికెట్ రేట్స్ దొరకక, గతంలో పవన్ చేసిన రెండు సినిమాలకు కలెక్షన్లు రాలేదు.
పవన్ కళ్యాణ్ తన మూడో భార్యతో విడాకులు తీసుకుంటారన్న ప్రచారం జరుగుతుంది. చాలా రోజుల క్రితమే అన్నా లెజినోవా తన పిల్లలను తీసుకొని రష్యా వెళ్లిపోయిందని, ఇక తను రాదన్న వార్తులు చెక్కర్లు కొడుతున్నాయి.
వంగవీటి మోహనరంగా 76వ జయంతి వేడుకలను ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం వైఎస్సార్ సీపీ నేత ఆకుల శ్రీనివాసకుమార్ ఆధ్వర్యంలో జరిగింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లోకి అడుగుపెట్టారు. అకౌంట్ ఓపెన్ చేసిన గంటల్లోనే మిలియన్లలో ఫాలోవర్స్ ను ఆయన సొంతం చేసుకున్నారు.
భక్తులు కొత్త కొత్త సంప్రదాయాలను తీసుకొస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా గురుపౌర్ణమి సందర్భంగా కొందరు భక్తులు బాబాకు బీర్తో అభిషేకం చేశారు. ఈ ఘటనపై బాబా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.