వైఎస్ వివేకా హత్య కేసులో నేడు సీబీఐ విచారణ ముగియాల్సి ఉంది. అయితే కోర్టు ఈ కేసు విచారణను జులై 14కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
విశాఖ అచ్యుతాపురంలో గల ఓ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది. ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు.
రామకుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పీఏ మనోహర్ సహా 44 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న నేపథ్యంలో వారిపై హెడ్ కానిస్టేబుల్ మణి ఫిర్యాదు చేశాడు.
కిడ్నీ ముఠా ఆగడాలు ఆగడం లేదు. పేదలను టార్గెట్ చేసి.. వారి అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ఏలూరులో ఓ మహిళ వద్ద నుంచి కిడ్నీ తీసుకొని.. చెప్పిన మొత్తం ఇవ్వలేదు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
పల్నాడులో వైసీపీ, టీడీపీ నేతల మధ్య జరిగిన గొడవలో అస్వర్ సయ్యద్ బాషాకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బక్రీద్ పండగ వేళ అన్వర్ ను అరెస్ట్ చేయడంపై ముస్లిం సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
సోషల్ మీడియా వేదికగా మోసాలు కూడా పెద్ద సంఖ్యలు జరుగుతున్నాయి తాజాగా గుంటూరులో మరో ఫేస్ బుక్ మోసం బయటపడింది
తిరుమల ఆలయంపై గగనతలంలో నేడు రెండు విమానాలు ప్రయాణించాయి. ఆగమ శాస్త్రం ప్రకారం విమానాలు కొండపై ప్రయాణించడం నిషిద్దం. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రుతుపవనాల ప్రభావం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్రలో మరో నాలుగు రోజుల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్(ap) వాసులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఏంటంటే టమాటా(tomatos) ధరలను సబ్సీడీపై ప్రభుత్వం రూ.50కే అందించనున్నట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. ఈ రోజు నుంచి ఏపీ వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలో క్షుద్రపూజల కలకలం రేపింది. ఈ ఘటనతో విద్యార్థి సంఘాలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి.
ప్రస్తుతం ఏపీలో వారాహి యాత్రలో బిజీగా ఉన్న పవన్ జ్వరంతో బాధపడుతున్నారు. అయినప్పటికీ ఆయన భీమవరంలోని తన పార్టీ ఆఫీసులో బ్రో మూవీ టీజర్కు డబ్బింగ్ చెప్పారు.
ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గర రాజేంద్రనాథ్పై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఆయనతో ఉన్న 70 మందికి గాయాలు అయ్యాయి. వారికి ఆస్పత్రిలో చికిత్స అందించారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ లక్ష్యంగా సీఎం జగన్ విమర్శలు చేశారు. టీడీపీ అంటే దోచుకో పంచుకో తినుకో అని చెప్పారు. పవన్ కల్యాణ్ ప్రజలను మోసం చేశారని తెలిపారు.
టీడీపీ మహిళా నేతలను వేధిస్తోన్న వారికి సజ్జల కుమారుడు భార్గవ్ రెడ్డి అండగా ఉన్నారని టీడీపీ మహిళ నేత అనిత ఆరోపించారు.