KDP: ముద్దనూరు పట్టణంలోని డిగ్రీ కళాశాలలో ఈరోజు యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్యాంప్ నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు, ఆరోగ్యం-భవిష్యత్తుపై ప్రభావం, చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించారు. క్రమశిక్షణతో డ్రగ్ ఫ్రీ జీవనం గడపాలని, అనుమానాస్పద కార్యకలాపాలను పోలీసులకు తెలియజేయాలని సూచించారు.