కడప జిల్లా ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఈ నెల 28వ తేదీనే పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. పింఛన్ లభించని వారికి మరల మార్చి 2వతేదీన పంపిణీ చేస్తామని తెలిపారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి జిల్లాలోని 2,80,808 మంది లబ్దిదారులకు రూ.122,43,81,500ల నిధులు ఇప్పటికే తొమ్మిది రకాల బ్యాంకుల్లో జమ చేశారు అని డీఆర్డీయే పీడీ జి.రాజ్యలక్ష్మి వెల్లడించారు.