SS: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఎస్పీ సతీష్ కుమార్ 50 అర్జీలను స్వీకరించారు. బాధితులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ కలహాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీలపై వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. బాధితులకు చట్టపరిధిలో న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.